Best Web Hosting Provider In India 2024

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఉవ్వెత్తున ఎగసి ఉత్సాహంగా సాగింది. విశాఖ నగరంలోని డైమండ్ పార్కు నుంచి డాబాగార్డెన్స్, జగదాంబ సెంటర్, ,పూర్ణామార్కెట్ మీదుగా టౌన్ కొత్త రోడ్డు కు జనసందోహం మధ్య బైక్ ర్యాలీ స్వాగత యాత్రతో సామాజిక సాధికార బస్సు చేరుకుంది. అంతకుముందు నియోజకవర్గంలో ఇటీవల చేపట్టిన పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించి, అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారామ్, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ భాషా, ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణీ, వంశీకృష్ణ శ్రీనివాస్ లు బహిరంగ సభకు హాజరయ్యారు.