Best Web Hosting Provider In India 2024

ఒంగోలు: సామాజిక సాధికార యాత్రతో ఒంగోలు పట్టణం దద్దరిల్లింది. జై జగన్ నినాదాలతో మార్మోగింది. వేలాది మంది జనం మధ్య బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఉత్సాహంగా ప్రసంగించారు. ఆద్యంతం ఇసకేస్తే రాలనంత జనం మధ్య యాత్ర సాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, విడదల రజని, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, మాగుంట శ్రీనివాసులురెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, హఫీజ్ ఖాన్, కేపీ నాగార్జునరెడ్డి, టీజేఆర్ సుధాకర్బాబు, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్రావు, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. సభలో వక్తలు ఏమన్నారంటే..