Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తెరదీశారని, దానికి ఉదాహరణలు కోకొల్లలని రాష్ట్రమంతా కోడై కూస్తుంటే.. వృద్ధ రామోజీరావు కంటికి మాత్రం ఇవి కనిపించడం లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. బడుగుల అభివృద్ధి రామోజీరావు పచ్చ కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అణగదొక్కిన చంద్రబాబే రామోజీరావుకు స్వీటు అయ్యాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు.