పేదలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

Best Web Hosting Provider In India 2024

 అనంత‌పురం: పేదలను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నార‌ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి రామగిరి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. రామగిరి మండలం నసనకోట గ్రామంలో రైతు భరోసా కేంద్రం, వైయస్ఆర్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలను ఎమ్మెల్సీ మంగమ్మ తో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం దుబ్బారపల్లిలో వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అక్కడే రైతులకు ఎరువులు పంపిణీ చేశారు.  అక్కడి నుంచి పేరూరుకు చేరుకుని సచివాలయం -1 పరిధిలో వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడే ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సచివాలయ పరిధిలోని ప్రజలకు రూ. 31 కోట్ల వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. 

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *