అపోహాలు నమ్మకండి.. 

Best Web Hosting Provider In India 2024

బాపట్ల:  దయచేసి అపోహాలు నమ్మకండి, మరి ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు చదవొద్దని,ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ప్రసారాలు చూడకండి అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు సూచించారు. ఎందుకంటే వీరంతా అబద్ధాలు చెబుతున్నారని, కేవలం మీ బిడ్డ ప్రభుత్వంపై బురద జల్లెందుకు, వాళ్లకు సంబం«ధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు కాబట్టి వెంటనే ఈ మనిషిని తప్పించి ఆ మనిషిని తీసుకురావాలని దురుద్దేశ్యంతో కావాలని అబద్ధాలు ఆడుతున్నారు. ఇలాంటి వారిని దయచేసి నమ్మొద్దని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయస్‌ జగన్‌ పర్యటించారు.  బాపట్ల జిల్లా పాతనందాయపాలెంలో తుపాన్‌ బాధితులతో సీఎం వైయస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..

  • ఈ రోజు ఇంతటి బాధాకరమైన పరిస్థితుల మధ్య వచ్చినా కూడా మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య ఈ ప్రభుత్వంలో ఏదైనా సంభవించరానిది సంభవిస్తే ఈ ప్రభుత్వం తోడుగా నిలబడుతుందన్న నమ్మకం మీ ప్రతి చిరునవ్వులోనూ కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం కచ్చితంగా మీ అందరిది.
  • ఈ ప్రభుత్వంలో మంచే జరుగుతుందే తప్ప ఏ ఒక్కరికి చెడు జరుగదు. ఇక్కడికి రాకముందు తిరుపతి జిల్లాను సందర్శించాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. తుపాన్‌ ఇక్కడి నుంచి తిరుపతి, కోస్తా తీరం వెంబడి పడింది. ఎప్పుడూ చూడని వర్షం నాలుగు రోజుల క్రితం చూశాం.
  • తుపాన్‌ వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డాం. కానీ ఒకటే చెబుతున్నాను. మిగిలిన ఏ రాష్ట్రాల్లో లేనిది, మన రాష్ట్రంలో ఉన్నది ఒక గొప్ప వ్యవస్థ..సచివాలయం, వలంటీర్‌ వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎంత గొప్పదంటే..ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, నష్టం జరిగినా కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ సహాయం చేసే వ్యవస్థ ఇది. వివక్షకు తావుండదు. మనకు ఓటు వేయకపోయినా కూడా ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. నష్టపోయిన అందరినీ కూడా గుర్తించి పారదర్శకంగా సాయం చేస్తున్నాం. మిగిలిపోయిన పేర్లు ఉంటే మీ అంతట మీరే చూసుకొని మీ పేరు లేకుంటే నమోదు చేసుకోమని సోషల్‌ ఆడిట్‌ కోసం సచివాలయాల్లో జాబితా ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
  • గతంలో కరువు వస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. వరదలు వచ్చినా ఎవరూ పట్టించుకునే వారు ఉండేవారు లేదు. ఈ నాలుగున్నరేళ్ల మీ బిడ్డ పాలనలో చరిత్రను పూర్తిగా మార్చేశారు. ఎవరైతే తుపాన్‌కారణంగా నష్టపోయారో, నీళ్లు పొలాలు, ఇళ్లలోకి వచ్చాయో ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇంటికీ రేషన్‌తో పాటు రూ.2500 ఇచ్చాం. ఇలాంటిది గతంలో ఎప్పుడూ చూడలేదు. మరో నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికి సాయం అందుతుంది. దాదాపుగా 12 వేల మంది తుపాన్‌ కారణంగా నష్టపోయారు. వారందరికీ కూడా బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగళాదుంప, ప్రతి ఇంటికి రూ.2500 ఇస్తున్నాం.  వలంటీర్‌ ఇంటికి వచ్చి సాయం అందిస్తారు.
  • పంట నష్టానికి సంబంధించి ప్రతి రైతుకు ఒక్కటే చెబుతున్నాను. దయచేసి అపోహాలు నమ్మకండి. మీకు ఇన్సూరెన్స్‌ రాదని, పరిహారం రాదని ఎవరైనా చెబితే నమ్మకండి. ఇక్కడ ఉన్నది మీ బిడ్డ ప్రభుత్వం. మన కర్మ ఏంటంటే మనం యుద్ధం చేస్తున్నది మారీచులతో యుద్ధం చేస్తున్నాం. ఒక్క చంద్రబాబుతోనే కాదు మనం యుద్ధం చేసేది ఎల్లోమీడియాతో కూడా యుద్ధం చేస్తున్నాం. భ్రమ కలిగించి అపోహాలు కల్పిస్తున్నారు. ఇన్సూరెన్స్‌పై తప్పుడు రాతలు రాస్తున్నారు. ఇన్సూరెన్స్‌ ఇచ్చిన పరిస్థితి మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది. ఈ ఖరీఫ్‌ సీజన్‌ డబ్బులు వచ్చే జూన్‌ రైతు భరోసాతో కలిపి ఇస్తున్నాం. ప్రతి ఎకరాను కూడా ఈ–క్రాప్‌ చేసి ఏ ఒక్క రైతు మిస్‌ కాకుండా పంట నమోదు చేయిస్తున్నాం. రైతుల తరఫున ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి రైతుల పంటలకు ఇన్సూరెన్స్‌ కల్పించిన చరిత్ర దేశంలో మన ప్రభుత్వానిదే. గత ప్రభుత్వంలో కేవలం 34 లక్షల మందికి మాత్రమే ఇన్సూరెన్స్‌ ఇచ్చారు. మీ బిడ్డ పాలనలో ఎక్కడా కరువు కాటకాలు లేవు. మీ బిడ్డ పాలనలో 55 లక్షల మందికి రూ.7800 కోట్లు ఇచ్చాం.  ప్రతి సంవత్సరంలోనూ ఇన్‌ఫుట్‌సబ్సిడీ ఏ సీజన్‌ది ఆ సీజన్‌లోనే ఇచ్చాం. దీనికి తగ్గట్టుగానే కలెక్టర్లు స్పందిస్తున్నారు. పంట నష్టం అంచనా వేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించి, మిస్‌ అ యిన రైతులు మళ్లీ నమోదు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నాం. ఇందుకోసం 15 రోజుల సమయం ఇస్తున్నాం. వచ్చే నెల సంక్రాంతికి మీ అందరికీ ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందుతుంది. రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా అదే సీజన్‌లోనే ఆదుకుంటున్నాం.
  • పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు ఇస్తాం.
  • దయచేసి అపోహాలు నమ్మకండి, మరీ ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవొద్దు, ఈటీవీ, ఏబీఎన్‌ చూడవద్దు. ఎందుకంటే వీరంతా కేవలం అబద్ధాలు చెబుతున్నారు. దురుద్దేశంతో కావాలనే అబద్ధాలు ఆడుతున్నారు. ఇలాంటి వారిని నమ్మొద్దని మీ అందరినీ కోరుతున్నాను. మీ అందరికీ ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది.
  • మీ బిడ్డ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య తేడా ఇంకొటి చెబుతున్నాను. మీ బిడ్డ ప్రభుత్వంలో ఏదైనా నష్టం జరిగితే మంచి చేసిన తరువాత సోషల్‌ ఆడిట్‌ చేయించి ఎక్కడ, ఎప్పుడు ఏ ఇబ్బంది జరిగినా నేను స్వయంగా మీ వద్దకు వచ్చిసాయం అందిస్తున్నాడు. మీ బిడ్డ ఘటన జరిగిన వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తాడు. వారం రోజుల సమయం ఇచ్చి ఆ తరువాత నేనే నేరుగా ప్రజల వద్దకు వచ్చి మీ కలెక్టర్‌ ఎలా పని చేశాడని అడుగుతా..కలెక్టర్లకు ఎంపవర్‌ చేసి, వారి చేతుల్లో డబ్బులు పెట్టి వ్యవస్థను మొత్తం యాక్టివేట్‌ చేసి బాగా జరిగిందా లేదా అని చూసేందుకు నేను వస్తున్నాను. ప్రజలు మా గురించి నెగిటివ్‌గా చెప్పకూడదని అధికారులు పరుగెత్తి మరి ప్రజలకు మంచి చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం ఇప్పుడు మాత్రమే జరుగుతుంది. జరిగిన నష్టం అపారమైనది, చేయాల్సిన సహాయం అంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది. వేగంగా జరుగుతుంది. గత ప్రభుత్వాల కంటే ఎక్కువగా మిన్నగా జరుగుతుందని సీఎం వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
  • రోడ్లు, వాటర్‌ ట్యాంకులకు త్వరలోనే మరమ్మతులు యుద్ధప్రాతిపదిక చేయిస్తాం. శాశ్వతంగా చేయాల్సిన పనులు కూడా వీలైనంత త్వరగా చేస్తానని సీఎం వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *