OTT Mystery Thriller: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్.. వరుసగా అమ్మాయిల మరణాలు.. మిస్టరీ ఏంటి! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Best Web Hosting Provider In India 2024

OTT Mystery Thriller: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్.. వరుసగా అమ్మాయిల మరణాలు.. మిస్టరీ ఏంటి! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Mystery Thriller: ఓటీటీలోకి ‘అయ్యన మనే’ థ్రిల్లర్ సిరీస్ వచ్చేస్తోంది. ఓ భవనంలో మిస్టరీతో సిరీస్ సాగనుంది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడొస్తుందంటే..

OTT Mystery Thriller: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్

కన్నడ నటి ఖుషి రవి ప్రధాన పాత్ర పోషించిన అయ్యన మనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా ఈ సిరీస్ రూపొందింది. ఈ కన్నడ సిరీస్‍కు రమేశ్ ఇందిర దర్శకత్వం వహించారు. రీసెంట్‍గా వచ్చిన ట్రైలర్ కూడా ఇంట్రెస్ట్ పెంచేసింది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా రివీల్ అయింది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

అయ్యన మనే వెబ్ సిరీస్ ఏప్రిల్ 25వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. కన్నడలో రూపొందిన ఈ సిరీస్ ఇతర భాషల డబ్బింగ్‍లోనూ వస్తుందేమో చూడాలి.

అయ్యన మనే స్టోరీలైన్

1990ల బ్యాక్‍డ్రాప్‍లో అయ్యన మనే వెబ్ సిరీస్ సాగుతుంది. చిక్కమాగళూరూలోని ఓ పూర్వికుల భవనంలో అయ్యన మనే కుటుంబం ఉంటుంది. ఆ ఇంటికి కోడళ్లుగా వచ్చిన ముగ్గురు అమ్మాయిలు వరుసగా మరణిస్తారు. వారు చనిపోయిన విషయాన్ని ఆ కుటుంబం దాచేస్తుంది. పెళ్లి చేసుకొని అదే ఇంటికి కోడలిగా వస్తుంది జాజీ (ఖుషీ రవి). అనుమానాస్పదంగా చనిపోయిన అమ్మాయిల మిస్టరీ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. నిజాలను బయటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయిలు ఎందుకు చనిపోయారు? ఈ మిస్టరీని జాజీ ఛేదిస్తుందా? అనే విషయాలు అయ్యన మనే సిరీస్‍లో ఉంటాయి.

అయ్యన మనే సిరీస్‍లో ఖుషీ రవితో పాటు అక్ష్య నాయక్, మానసి సుధీర్, విజయ్ శోభరాజ్, రమేశ్ ఇందిర కీలకపాత్రలు పోషించారు. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‍ను తెరకెక్కించారు డైరెక్టర్ రమేశ్ ఇందిర. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఈ సిరీస్‍ను శృతి నాయుడు నిర్మించారు. ఏప్రిల్ 25 నుంచి ఈ సిరీస్‍ను జీ5లో చూడొచ్చు.

జీ5 ఓటీటీలో గత వారం కింగ్‍స్టన్ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించారు. థియేటర్లలో మార్చి 7న రిలీజైన ఈ మూవీ పెద్దగా కలెక్షన్లు దక్కించుకోలేకపోయింది. జీ5 ఓటీటీలో తమిళం, తెలుగు భాషల్లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024