





Best Web Hosting Provider In India 2024

ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలి.. క్షమించరాని క్రూరమైన చర్య.. సెలబ్రిటీల రియాక్షన్ ఇదే
జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని సెలబ్రిటీలు ఖండించారు. ఈ ఉగ్రదాడికి ప్రీతీకారం తీర్చుకోవాల్సిందేనని ఆగ్రహంతో ఊగిపోయారు. క్రూరమైన చర్చ అని మండిపడ్డారు.
అమాయకుల ప్రాణాలను బలి తీసుకుని, కుటుంబల్లో శోకం మిగిల్చి, దేశం బాధపడేలా చేసిన ఉగ్రదాడిపై సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం (ఏప్రిల్ 22) జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో నేచర్ అందాలను ఆస్వాదిస్తున్న టూరిస్ట్ లపై ఉగ్రమూక పాశవికంగా దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సంజయ్ దత్ తదితర సెలబ్రిటీలు రియాక్టయ్యారు.
క్షమించరాని చర్య
పహల్గామ్ లో టెర్రరిస్ట్ అటాక్ క్షమించరాని క్రూరమైన చర్య అని మెగాస్టార్ చిరంజీవి బాధపడ్డారు. అమాయకులు, టూరిస్ట్ ల ప్రాణాలు పోవడంతో గుండె ముక్కలైందని చిరు అన్నారు. విక్టిమ్స్ ను చూస్తుంటే హృదయం బరువెక్కుతోందని.. శాంతి, న్యాయం కోసం ప్రార్థిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ లో పేర్కొన్నారు.
మూడు నెలల క్రితం
మూడు నెలల క్రితం తాము అక్కడ ఉన్నామని హీరో నాని అన్నారు. దాదాపు 20 రోజుల పాటు 200 మంది టీమ్ కలిసి పనిచేశామన్నారు. పహల్గాం కలలాంటిదని, ఈ దాడి చూస్తుంటే హృదయం బద్దలైందని నాని చెప్పారు. ఎందుకు? అని ప్రశ్నించారు. ఇలాంటి టెర్రరిస్ట్ దాడులకు సమాజంలో చోటు ఉండకూదని, దీన్ని తీవ్రంగా ఖండించాలని రామ్ చరణ్ పోస్టు చేశారు.
మౌనం వీడాలి
పహల్గాం ఉగ్రదాడిపై బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది క్షమించరాని చర్య అని, దీనిపై అందరూ మౌనం వీడాలని ఆయన పేర్కొన్నారు. ఉగ్రదాడికి పాల్పడ్డ వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని, తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. హీరోయిన్లు జాన్వీ కపూర్, రష్మిక మంధాన కూడా ఈ ఉగ్రదాడిపై స్పందించారు.
ఎంతో భయంకరమైంది
అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఈ ఉగ్ర దాడి ఎంతో భయంకరమైందని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులను చంపడం దారుణమన్నారు. ఇది పిరికి పంద చర్య అని సోనూసూద్ ఖండించారు. ఎంతో అందమైన ప్రదేశంలో జరిగిన దాడి గురించి తెలిసి గుండె పగిపోయిందని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
సంబంధిత కథనం