పాక్ గగనతలంలోకి ప్రవేశించని ప్రధాని మోదీ విమానం.. రాగానే ఎయిర్‌పోర్ట్‌లోనే ఎమర్జెన్సీ భేటీ

Best Web Hosting Provider In India 2024


పాక్ గగనతలంలోకి ప్రవేశించని ప్రధాని మోదీ విమానం.. రాగానే ఎయిర్‌పోర్ట్‌లోనే ఎమర్జెన్సీ భేటీ

Anand Sai HT Telugu

ప్రధాని మోదీ దిల్లీ చేరుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ ప్రతిస్పందన, భద్రతా వ్యూహాలపై సవివరంగా చర్చించారు.

ఉగ్రదాడిపై ప్రధాని మోదీ అత్యవసర సమావేశం

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన మధ్యలోనే ముగించుకుని భారత్ వచ్చారు. బుధవారం ఉదయం దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే దిగారు. వెంటనే అక్కడే ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించారు.జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి ఈ ముఖ్యమైన సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో దాడి తీవ్రత, అంతర్జాతీయ ప్రతిస్పందన, భద్రతా వ్యూహాలపై చర్చించారు.

ప్రధాని అధ్యక్షతన సమావేశం

సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం స్వదేశానికి తిరిగి వచ్చారు. పహల్గామ్‌లో ఉగ్రదాడితో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా వెంటనే తిరిగి రావాలని మోదీ నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 11 గంటలకు ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కెబినెట్ కమిటీ సమావేశం అవ్వనుంది. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీనగర్‌లో ఉన్నారు. దాడి జరిగిన పహల్గామ్ ప్రదేశానికి వెళ్లనున్నారు.

పాక్ గగనతలంలోకి వెళ్లని విమానం

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను ముందుగానే రద్దు చేసుకుని భారత్‌కు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చే సమయంలో ప్రధాని మోదీ విమానం పాక్ గగనతలంలోకి ప్రవేశించలేదు. పాక్ గగనతలాన్ని నివారించి ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఢిల్లీకి చేరుకుంది.

సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం జెడ్డా చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పహల్గామ్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో వెంటనే పర్యటన రద్దు చేసుకున్నారు. ఢిల్లీ నుంచి జెడ్డా (సౌదీ అరేబియా)కు వెళ్తుండగా ప్రధాని మోదీ విమానం పాక్ గగనతలం గుండా వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ విమానం అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించింది. ఈ మార్గం పాకిస్తాన్ గగనతలాన్ని పూర్తిగా నివారించి, భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్న ఒమన్, యుఎఇ లేదా సౌదీ అరేబియా వంటి స్నేహపూర్వక దేశాల గగనతలాన్ని ఉపయోగించింది.

ఈ మార్గంలో సమయం ఆదా

ఎయిర్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. పాకిస్తాన్ గగనతలం సౌదీ అరేబియా, ఖతార్ లేదా మధ్య ఆసియా / ఐరోపా వంటి గల్ఫ్ దేశాలకు ప్రయాణించడానికి అత్యంత ప్రత్యక్ష, తక్కువ మార్గాన్ని అందిస్తుంది. ఉదాహరణకు ఢిల్లీ నుండి జెడ్డాకు విమానంలో పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించడం విమాన సమయం, ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది. అరేబియా సముద్రం వంటి ప్రత్యామ్నాయ మార్గాలు పొడవైనవి, ఖరీదైనవి కావచ్చు.

Anand Sai

eMail
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link