చీకట్లో హైదరాబాద్‌ పాతబస్తీ.. వక్ఫ్‌ చట్ట సవరణకు వ్యతిరేకంగా దీపాలు ఆర్పేసి నిరసన

Best Web Hosting Provider In India 2024

చీకట్లో హైదరాబాద్‌ పాతబస్తీ.. వక్ఫ్‌ చట్ట సవరణకు వ్యతిరేకంగా దీపాలు ఆర్పేసి నిరసన

Sarath Chandra.B HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu

ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుతో వక్ఫ్‌ చట్ట సవరణ నిరసిస్తూ హైదరాబాద్‌ పాతబస్తీలో లైట్లను ఆర్పేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.

చీకట్లో చార్మినార్‌, వక్ఫ్‌ చట్ట సవరణకు నిరసనగా హైదరాబాద్‌ దీపాలు ఆర్పేసి నిరసన (PTI)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

వక్ఫ్ సవరణ చట్టం-2025కు వ్యతిరేకంగా అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చిన పిలుపునకు మద్దతుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన నివాసంలో లైట్లు ఆర్పివేసి నిరసన తెలిపారు. పాతబస్తీలో పలు ప్రాంతాల్లో లైట్లను ఆర్పేసి నిరసన వ్యక్తం చేశారు.

వక్ఫ్‌ చట్ట సవరణకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. పాతబస్తీలో బుధవారం రాత్రి దీపాలను ఆర్పేసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ కూడా పాల్గొన్నారు.

ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చిన పిలుపు విజయవంతమైందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. నిరసనలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం చేసిన చట్టం వక్ఫ్ బోర్డును బలహీనపరుస్తుందనే సందేశాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వానికి పంపడానికి నిరసనను నిర్వహించినట్టు అసదుద్దీన్‌ చెప్పారు. తాజా చట్టం రాజ్యాంగ విరుద్ధం… ఒకట్రెండు వారాల తర్వాత మానవహారం, కొన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.

అంతకుముందు ఏప్రిల్ 27న కర్ణాటకలోని కలబుర్గిలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్ బీ) నిరసన చేపట్టింది.

వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 25 న సుప్రీంకోర్టులో తన ప్రాథమిక అఫిడవిట్ను దాఖలు చేసింది, ఈ చట్టం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించదని పేర్కొంది.

ఈ సవరణలు పూర్తిగా ఆస్తి నిర్వహణ యొక్క లౌకిక అంశాలను నియంత్రించడానికి ఉద్దేశించినవని కేంద్రం పేర్కొంది. అందువల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25, 26 ప్రకారం కల్పించిన మత స్వేచ్ఛను ఉల్లంఘించలేదు.చట్టంలోని ఏ నిబంధనలపైనా స్టే ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది.

ఏప్రిల్ 2, 3 తేదీల్లో వరుసగా లోక్ సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొంది, ఏప్రిల్ 5న రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా మారింది.

పహల్గాన్ దాడిని ఉద్దేశించి ఒవైసీ మాట్లాడుతూ, “పహల్గాన్లో జరిగినదాన్ని పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పారు. పాకిస్తాన్ దాడి వెనుక ఉందని, ప్రజలను వారి కుటుంబాల ముందు చంపడం మరియు వారి మతం అడిగిన తరువాత, హిందువులను చంపడం… ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఆ దాడిని ఖండించిందని, వక్ఫ్‌ చట్ట సవరణకు వ్యతిరేకంగా తమ నిరసనలను 3 రోజులు విరమించామని చెప్పారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం

టాపిక్

HyderabadMimBjpNational Politics
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024