



Best Web Hosting Provider In India 2024
‘భారత్ పాకిస్తాన్ పై దాడి చేస్తే, మనం ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలి’- బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ అధికారి వ్యాఖ్య
‘భారత్ పాకిస్తాన్ పై దాడి చేస్తే, మనం భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకోవాలి’ అని బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ కు అత్యంత సన్నిహితుడిగా భావించే ఏఎల్ ఎం ఫజ్లుర్ రెహ్మాన్ పేర్కొన్నారు. ఇందుకు చైనా సహకారం కోరాలని ఆయన సూచించారు.
జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్ పై దాడి చేస్తే తమ దేశం భారత్ లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలపై దాడి చేసి ఆక్రమించుకోవాలని బంగ్లాదేశ్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఏఎల్ ఎం ఫజ్లుర్ రెహ్మాన్ సూచించారు. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ కు సన్నిహితుడిగా భావించే ఫజ్లుర్ రెహమాన్ బంగ్లాదేశ్ రైఫిల్స్ (ప్రస్తుతం బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్) మాజీ చీఫ్ కూడా. ఈ వైల్డ్ ఐడియాను సాధించడానికి చైనా సహకారం కోరాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి
“భారత్ పాకిస్తాన్ పై దాడి చేస్తే, బంగ్లాదేశ్ ఈశాన్య భారతదేశంలోని ఏడు రాష్ట్రాలను ఆక్రమించుకోవాలి. అందుకోసం చైనాతో సంయుక్త సైనిక ఒప్పందంపై చర్చలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను’ అని నేషనల్ ఇండిపెండెంట్ కమిషన్ ఛైర్ పర్సన్ కూడా అయిన ఫజ్లుర్ రెహ్మాన్ ఫేస్ బుక్ లో బెంగాలీలో రాశారు. మాజీ ప్రధాని షేక్ హసీనా ఆశ్రయం కోరుతూ భారత్ కు పారిపోయిన తర్వాత విభేదాలను పక్కన పెట్టి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు న్యూఢిల్లీ, ఢాకా ప్రయత్నిస్తున్న తరుణంలో రెహ్మాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మహమ్మద్ యూనస్ కూడా..
మార్చిలో చైనా పర్యటన సందర్భంగా మహమ్మద్ యూనస్ భారత ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ‘‘భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను ఏడుగురు సోదరీమణులు అంటారు. అవి భారతదేశంలోని భూపరివేష్టిత ప్రాంతం. సముద్రం వరకు వెళ్లేందుకు వారికి మార్గం లేదు’’ అని యూనస్ పేర్కొన్నారు. ‘‘ఈ ప్రాంతంలో “సముద్రానికి బంగ్లాదేశ్ మాత్రమే ఏకైక సంరక్షకుడు. ఇది చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరణకు ఒక మంచి అవకాశం’’ అని మహమ్మద్ యూనస్ అన్నారు. ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఏప్రిల్ లో బిమ్ స్టెక్ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దీనిపై ఘాటుగా స్పందించారు. “ముఖ్యంగా మన ఈశాన్య ప్రాంతం బిమ్ స్టెక్ కు కనెక్టివిటీ హబ్ గా ఎదుగుతోంది, రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్ లు మరియు పైప్ లైన్ల అసంఖ్యాక నెట్ వర్క్ తో అభివృద్ధి చెందుతోంది” అని ఆయన అన్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link