కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 17: పోలీసుల మాటలతో షాకైన జ్యోత్స్న.. తాతపై సవాల్ గెలిచిన కార్తీక్.. అవార్డు సంబరం

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 17: పోలీసుల మాటలతో షాకైన జ్యోత్స్న.. తాతపై సవాల్ గెలిచిన కార్తీక్.. అవార్డు సంబరం

 

కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మే 17: శివన్నారాయణ ఇంటికి పోలీసులు వస్తారు. పోలీస్ స్టేషన్‍‍కు జ్యోత్స్న రాక తప్పదని చెబుతారు. ఎస్ఐ మాటలతో జ్యోత్స్న బెంబేలెత్తుతుంది. సుమిత్ర కోప్పడుతుంది. తాతపై చేసిన ఛాలెంజ్‍ను కార్తీక్ నెగ్గేశాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

 
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 17: పోలీసుల మాటలతో షాకైన జ్యోత్స్న.. తాతపై సవాల్ గెలిచిన కార్తీక్.. అవార్డు సంబరం
 

కార్తీక దీపం 2 నేటి (మే 17, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. తనపై హత్యయత్నం కేసులో జ్యోత్స్న పేరు ఎందుకు చెప్పారని కార్తీక్‍ను దీప అడుగుతుంది. కత్తిపై వేలు ముద్రలు ఉన్నాయని అనుమానంతో పోలీసులను శివన్నారాయణ ఇంటికి పంపిస్తే జ్యోత్స్న వాళ్లకు వేరేలా అర్థమవుతుందని అంటుంది. రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం మరింత పెరుగుతుందని బాధపడుతుంది. ఇప్పుడు మాత్రం భుజాలపై చేయి వేసుకొని కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారని అనుకుంటున్నావా, ఇప్పుడూ వాళ్ల మనల్ని శత్రువులుగానే చూస్తున్నారని అని కార్తీక్ అంటాడు.

 

మనసెందుకు మార్చుకున్నారు!

ఈ గొడవలు, ఆ ఇంటి మనుషుల ప్రవర్తన చూస్తుంటే ఒకప్పుడు రెండు కుటుంబాలు విడిపోవడమే మంచిది అనిపించేదని కార్తీక్ అంటాడు. మరిప్పుడు అని దీప ప్రశ్నిస్తుంది. రెండు కుటుంబాలను కలపాలి దీప అని కార్తీక్ చెబుతాడు. మనసు ఎందుకు మార్చుకున్నారని దీప ప్రశ్నిస్తుంది. శివన్నారాయణ అసలైన మనవరాలు, దశరథ్, సుమిత్రల కూతురు, ఆ ఆస్తికి అసలైన వారసురాలు దీపే అని దాసు చెప్పిన మాటలను మరోసారి కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. నీ కోసమే మనసు మార్చుకున్నానని కార్తీక్ అంటాడు. కానీ అసలు నిజం చెప్పడు. మీరు చెబుతున్న దానికి, చేస్తున్న దానికి సంబంధం లేదని కార్తీక్ అంటాడు.

ఎవరైనా సరే వదిలేదు లేదు

రెండు కుటుంబాలు కలవాలని అనుకుంటున్నానని, తప్పు చేసిన వారిని క్షమిస్తానని కాదు దీప అని కార్తీక్ అంటాడు. నిన్ను ఎవరు చంపాలనుకున్నారో నాకు తెలియాలి, వదిలేది లేదని చెబుతాడు. ఏం జరుగుతుందో జరగనీ, అన్నింటికీ రెడీగానే ఉన్నానని అంటాడు. “కార్తీక్ బాబు మాట వినడం లేదు.. ఈపాటికే పోలీసులు ఆ ఇంటికి వెళ్లి ఉంటారు.. ఏం జరుగుతుందో ఏంటో” అని మనసులో అనుకుంటుంది దీప.

శివన్నారాయణ ఇంటికి పోలీసులు.. జ్యోత్స్న బెంబేలు

దీప హత్యాయత్నం కేసులో జ్యోత్స్నను అనుమానిస్తున్నానని కార్తీక్ చెప్పడంతో శివన్నారాయణ ఇంటికి మరోసారి వెళతారు పోలీసులు. దీపను పొడిచిన కత్తి ఫొటోను చూపిస్తారు. ఈ ఇంట్లో కత్తి దొరికితే మమ్మల్ని ఏం చేయమంటారు.. ఎంక్వైరీ చేసి నిందితుడు దొరికితే జైలులో వేయండని శివన్నారాయణ అంటాడు. నిందితుడి పట్టుకోవడానికే వచ్చాం అని ఎస్ఐ చెబుతాడు. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నిందుతులు మా ఇంట్లో ఉన్నారా అని కోపంగా అంటుంది పారిజాతం. “మాకు ఆధారం దొరికింది. దీన్ని బట్టి మేం నిందితులను కనిపెడతాం” అని ఎస్ఐ చెబుతాడు. “ఒక్క పని ఎవడూ సరిగా చేయడు. దీపను పొడిచాక కత్తి అక్కడే పడేయాలా. నన్ను పట్టించడానికి కాకపోతే” అని మనసులో బెంబేలెత్తుతుంది జ్యోత్స్న.

 

ముగ్గురిపై అనుమానం.. సుమిత్ర ఆగ్రహం

ఈ కేసులో ముగ్గురిపై అనుమానం ఉందని కార్తీక్ చెప్పాడని ఎస్ఐ చెబుతాడు. ఒకటి జ్యోత్స్న, రెండు గౌతమ్, మూడు మర్డర్ చేయడానికి వచ్చిన మనిషి అని అంటాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు. సుమిత్ర ఆగ్రహిస్తుంది. “నా కూతురు ఏ తప్పు చేయలేదు. ఎక్కడికీ రాదు. సాక్ష్యాధారాలతో రమ్మనండి. కత్తి దొరికింది.. సుత్తి దొరికింది అని అస్తమానం ఇంటికి వచ్చి మా ఇంటి ఆడపిల్ల పరువు తీయకండి” అని ఫైర్ అవుతుంది.

పోలీస్ స్టేషన్‍కు జ్యోత్స్న రావాల్సిందే

లైసెన్స్డ్ గన్‍లో బుల్లెట్ మిస్ అయిన కేసులో అయినా జ్యోత్స్న పోలీస్ స్టేషన్‍కు రావాల్సిందేనని ఎస్ఐ అంటాడు. విచారణకు హాజరు కావాల్సిందేనని చెబుతాడు. దీప హత్యాయత్నం కేసులో జ్యోత్స్నేే ఏ-1 అనుమానితురాలిగా ఉన్నారు కాబట్టి.. ఈ కేసులో కూడా మేం పిలిచినప్పుడు మీరు పోలీస్ స్టేషన్‍కు హాజరవ్వాల్సిందేనని ఎస్ఐ చెప్పేస్తాడు. దీంతో జ్యోత్స్న భయపడిపోతుంది. “మీ మీద అనుమానం ఉందని చెప్పింది మీ మేనల్లుడే.. మీ ఫ్యామిలీలో ఏ గొడవలు ఉన్నాయో మాకు తెలియదు. మా డ్యూటీ చేయనివ్వండి” అని దశరథ్‍తో ఎస్ఐ అంటాడు. మిమల్ని ఎంక్వైరీ చేయాలి, పోలీస్ స్టేషన్‍కు ఎప్పుడు రావాలో ముందుగానే సమాచారం ఇస్తాం, మీరు తప్పకుండా రావాలి అని జ్యోత్స్నకు ఎస్ఐ చెబుతాడు. దీంతో జ్యో కంగారు పడుతుంది. ఈలోపు కత్తిపై వేలిముద్రలో ఎవరివో తెలిస్తే నిందితుడిని పట్టుకుంటామని చెప్పి వెళ్లిపోతాడు ఎస్ఐ.

 

ఎలా బుద్ది చెప్పాలో తెలుసు

కార్తీక్‍పై శివన్నారాయణ కోప్పడతాడు. పోలీసులను ఇంటికి పంపిస్తే మనం ఎందుకు ఊరుకోవాలి, కాంచన ఇంటికి వెళ్లే మాట్లాడదాం అని పారిజాతం రెచ్చగొడుతుంది. “అలా చేస్తే నేను వాడికి భయపడినట్టు.. ఎన్ని కేసులైనా పెట్టుకోనివ్వండి.. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు” అని కోపంగా అంటాడు శివన్నారాయణ. దశరథ్ ఆలోచనలో పడతాడు.

దీపను నువ్వు చంపబోయావా?

కాంచనకు ఫోన్ చేసి చివాట్లు పెట్టాలని దశరథ్‍తో అంటుంది పారిజాతం. అన్ని చట్టప్రకారమే జరుగుతాయి పిన్ని అని దశరథ్ అంటాడు. “జ్యోత్స్నకు, దీపకు గొడవలు జరిగాయి కాబట్టే.. అవి కోర్టు వరకు వెళ్లాయి కాబట్టే జ్యోత్స్నను అనుమానిస్తున్నారు. ఇందులో తప్పేముంది” అని చెబుతాడు. ఏం జ్యోత్స్న.. దీపను నువ్వు చంపబోయావా అని అని అడుగుతాడు. దీంతో జ్యో కంగారు పడుతుంది. సుమిత్ర కూడా అవాక్కవుతుంది. మీరు కూడా పోలీసుల్లా అడుగుతున్నారేంటి అని అడుగుతుంది. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదని దశరథ్ అంటాడు. వేలిముద్రలు కనిపెడితే నిందితుడు కూడా దొరికినట్టే.. తప్పు చేసిన వారు ఏదో ఒకరోజు దొరకాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళతాడు దశరథ్. ఏం టెన్షన్ పడకు.. మీ బావకు ఉన్న మతిపోయిందని సుమిత్ర అంటుంది. దీప వల్లే అని పారిజాతం రెచ్చగొడుతుంది. నా కూతురిని దీప దూరం చేసేలా ఉందని సుమిత్ర కోపంగా అంటుంది.

 

తప్పు చేసినట్టు ఒప్పుకో

పోలీసులు కత్తి గురించి చెబుతుంటే.. నువ్వేంటి దొరికిపోయిన దానిలా అలా భయపడుతున్నావని జ్యోత్స్నను అనసూయ అడుగుతుంది. లైసెన్స్ గన్ గురించి చెప్పినప్పుడు కూడా అంతే అని అంటుంది. తప్పు చేసినట్టు నా దగ్గర ఒప్పుకో అని చెబుతుంది. “ఏంటి గాడిద గుడ్డు ఒప్పుకునేది. నీ కొడుకును చంపబోయింది నేనే అని చెబితే నువ్వు ఊరుకుంటావా. నా గొంతు పట్టుకుంటావ్. అక్కడ మొదలయ్యాయి నా కష్టాలు. కత్తిపై వేలిముద్రల సాయంతో నేను చేసిన నేరాలన్నీ గొలుసులాగా బయటికి వస్తాయి” అని జ్యోత్స్న ఆలోచిస్తుంది. మధ్యలో నువ్వేంటి గ్రానీ అని జ్యో కోప్పడుతుంది.

బావను ఆపాలి

జరిగేవన్నీ చూస్తుంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయమేస్తుందని పారిజాతం అంటుంది. ఏం జరగకుండా ఉండాలంటే బావను ఆపాలని జ్యోత్స్న ఆలోచిస్తుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. తాను కార్తీక్‍త సంతకం పెట్టించుకున్న పేపర్లను చూస్తుంది. ఇప్పుడు వాటిని ఎందుకు చూస్తున్నావని పారిజాతం అడుగుతుంది. ఈ ఆయుధాన్ని బావపై వాడుతానని జ్యో అంటుంది. ఏదైనా సాధించాలని పట్టుదలగా ఉన్న వారికి సడెన్ షాక్ ఇవ్వాలని, అలా చేస్తే ప్రస్తుతం చేస్తున్నది మరిచిపోయి మనం ఇచ్చిన షాక్ గురించి ఆలోచిస్తారని జ్యోత్స్న అంటుంది. ఏ రకంగా షాక్ ఇవ్వాలని అనుకుంటున్నావని పారిజాతం అంటుంది.

 

బావకు ఊహించని షాక్ ఇవ్వాలి

నా పతనం జరుగుతోందని జ్యో అంటుంది. పతనమా అని పారు కంగారు పడుతుంది. “బుల్లెట్ కేసు, దీపపై హత్యాయత్నం కేసు రెండు జరగడానికి కారణం నేనే.. దేంట్లో దొరికినా నా జీవితం నాశనం అవుతుంది. బావ వదిలిపెట్టడు. వదిలిపెట్టాలంటే బావకు ఊహించని షాక్ ఇవ్వాలి. మళ్లీ తేరుకునే ఛాన్స్ కూడా ఇవ్వనంత బలంగా కొట్టాలి” అని జ్యో మనసుల అనుకుంటుంది. జీవితం మారుతుందనుకుంటే ఒక్క తప్పు చేయాలని, ఎక్కువ వద్దు అని పారిజాతం చెబుతుంది. జ్యోత్స్న వినదు. కార్తీక్ గాడికి ఏదో మూడింది.. తల్లి దొరకలేదని పిల్లను చంపుతుందా ఏంటి అని ఆలోచిస్తుంది పారిజాతం.

అవార్డు గెలిచిన కార్తీక్

అనసూయను పేపర్ పువ్వుతో సరదాగా ఆట పట్టిస్తుంది శౌర్య. ఇది చూసి కాంచన కూడా సంతోషిస్తుంది. అలా చేయడం తప్పు కదా అని కార్తీక్ అంటే.. సెలవుల్లో ఏం చేయాలో అర్థం కావడం లేదని శౌర్య అంటుంది. సమ్మర్ క్యాంపులో చేర్పిస్తాని కార్తీక్ అంటే వద్దంటుంది శౌర్య. రౌడీని నాతో పాటు రెస్టారెంట్‍కు తీసుకెళతానని కార్తీక్ అంటాడు.

సత్యరాజ్ కాల్ చేస్తుంటే మీరు కాల్ ఎత్తట్లేదంట, నాకు ఫోన్ చేశారని కార్తీక్‍తో దీప అంటుంది. మన ఇంటికి ఆయనే వస్తున్నారంట అని చెబుతుంది. ఏమై ఉంటుందని కాంచన అడుగుతుంది. గొడవల్లో పడి లాభాలు తగ్గాయని కార్తీక్ అంటాడు. ఇంతలోనే కార్తీక్ ఇంటికి వస్తాడు సత్యరాజ్. బొకే అందించి కంగ్రాచులేషన్స్ చెబుతాడు. నువ్వు మామూలోడివి కాదు.. అనుకున్నావంటే వదిలిపెట్టవను విక్రమార్కుడివి అని కార్తీక్‍ను సత్యరాజ్ ప్రశంసిస్తాడు. గుడ్‍న్యూస్ ఏంటో చెప్పాలని కార్తీక్ అడుగుతాడు. ‘రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’కు మన రెస్టారెంట్ సెలెక్ట్ అయిందని సత్యరాజ్ చెబుతాడు. దీంతో ఎస్ఎస్ అంటూ సంతోషిస్తాడు కార్తీక్.

 

తాతపై నెగ్గిన కార్తీక్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్.. ఈ అవార్డు నీదే అని కార్తీక్‍తో సత్యరాజ్ అంటాడు. ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు.. మా కుటుంబం కూడా షాక్‍లో ఉన్నారని సంతోషంగా అంటాడు కార్తీక్. సంవత్సరం తిరిగే సరికి రెస్టారెంట్ పెట్టి.. ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోకపోతే నా పేరు కార్తీకే కాదు అని చేసిన సవాల్‍ను కాంచన గుర్తు చేసుకుంటుంది. మనం గెలిచాం దీప అని కార్తీక్ సంబరంగా అంటాడు. తాతపై సవాల్ గెలిచినందుకు ఆనందిస్తాడు.

నా కొడుకు గెలిచాడు.. కాంచన కన్నీరు

నీ కొడుకు గెలిచాడు అంటూ బొకేను కాంచనకు ఇస్తాడు కార్తీక్. ఆనందంతో కాంచన కన్నీరు పెట్టుకుంటుంది. నా కొడుకు గెలిచాడు, ఇన్ని రోజులు నోటికి వచ్చినట్టు మాట్లాడిన వారికి నోరు తెరవకుండానే సమాధానం చెప్పాడని అంటుంది. మళ్లీ నేను తలెత్తుకొని చాలా మంది ముఖాలు చూడగలను అని చెబుతుంది. కార్తీక్‍కు స్వీట్ తినిపిస్తుంది. సంతోషంగా నవ్వుతుంది. దీప కూాడా ఆనందంగా ఉంటుంది. అన్నీ ఉన్నప్పుడు కాదు.. ఏదీ లేనప్పుడు గెలిచావ్ చూడు ఇదీ గెలుపు అంటే అని సంబరంగా అంటుంది అనసూయ. మళ్లీ మనింట్లో పండుగ మొదలైందని చెబుతుంది.

 

గొంతెత్తి అరిచి చెబుతా..

మనం గెలిచాం దీప అని కార్తీక్ సంతోషంగా అంటాడు. దీపకు స్వీట్ తినిపిస్తాడు. “బలమైన మాటను నిలబెట్టుకునేందుకు ఎంత పౌరుషం ఉండాలో.. నిలబెట్టుకోవడానికి అంతే పౌరుషం ఉండాలి. మీరు ఆవేషంలో మాట్లాడారని చాలా మంది అనుకున్నారు. ఆలోచించే మాట్లాడారని వాళ్లందరికీ ఈరోజే అర్థమవుతుంది. ఇక పెద్దాయన ముందు మిమల్ని నిలబెట్టడమే ఆలస్యం” అని దీప అంటుంది. అవార్డుతోనే ఇంటికి వెళ్లి.. తాత అని గొంతెత్తి మరీ అరిచిచెబుతానని కార్తీక్ అంటాడు. చూడలేక తలుపులు మూసుకుంటారో.. వినలేక చెవులు మూసుకుంటారో వాళ్ల ఇష్టమని చెబుతాడు. “నువ్వు నాతో ఉంటే ఏదీ సాధించలేరని చాలా మంది అన్నారు. నువ్వు నాతో ఉండడం వల్లే నేను ఇదంతా సాధించానని వాళ్లకు తెలియాలి” అని కార్తీక్ అంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (మే 17) ఎపిసోడ్ ముగిసింది.

 
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024