




Best Web Hosting Provider In India 2024
ఇంగ్లాండ్ టూర్కు టీమిండియా.. సెలక్టర్లతో మీటింగ్కు ముందు సిద్ధి వినాయక టెంపుల్లో గంభీర్.. ప్రత్యేక పూజలు
ప్రతిష్ఠాత్మక ఇంగ్లాండ్ టూర్ కోసం టీమిండియాకు ఎంపికకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీతో గురువారం (మే 15) హెడ్ కోచ్ గంభీర్ మీటింగ్ ఉంది. దీనికి ముందు అతను సిద్ధి వినాయక టెంపుల్ లో పుజలు చేశాడు.
ఓ వైపు ఐపీఎల్ 2025 పున:ప్రారంభం సందడి కొనసాగుతుండగా.. మరోవైపు ఇంగ్లాండ్ టూర్ కోసం టీమిండియా సెలక్షన్ పై ఇంట్రెస్ట్ నెలకొంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తో భారత టెస్టు టీమ్ ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం (మే 15)న ముంబయిలో సెలక్షన్ కమిటీతో హెడ్ కోచ్ గంభీర్ సమావేశమవుతున్నాడు. అంతకంటే ముందు సిద్ధి వినాయక టెంపులలో గంభీర్ పూజలు చేశాడు.
సతీసమేతంగా
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురువారం ముంబయిలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక టెంపుల్ లో భార్యతో కలిసి ప్రత్యేక పూజలు చేశాడు. ఇంగ్లాండ్ టూర్ కోసం టీమిండియా టెస్టు టీమ్ సెలక్షన్ నేపథ్యంలో సెలక్టర్లతో గంభీర్ సమావేశం కానున్నాడు. దీని కంటే ముందు అతను గుడికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో భార్యతో కలిసి అతను దైవ దర్శనం చేసుకున్నాడు.
నవ శకం
కోచ్ గంభీర్ నేతృత్వంలో టెస్టుల్లో టీమిండియా నవ శకం ప్రారంభం కాబోతుంది. ఇటీవల రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఒకరి తర్వాత ఒకరు టెస్టు రిటైర్మెంట్ ప్రకటించేశారు. దీంతో కొత్త కెప్టెన్ ఎవరు అనే దానితో పాటు కోహ్లి, రోహిత్ స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. జూన్ 20న ఇంగ్లాండ్ లో భారత టెస్టు సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఇందులో భాగంగా టీమిండియా అయిదు టెస్టులు ఆడుతుంది.
కోచ్ కు సవాలే
రోహిత్, కోహ్లి లేని భారత యువ టెస్టు టీమ్ ను నడిపించడం కోచ్ గంభీర్ కు సవాలే. కెప్టెన్ రేసులో శుభ్ మన్ గిల్, పంత్, బుమ్రా ముందున్నారు. అయితే యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కే పగ్గాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు రోహిత్, కోహ్లి నిష్క్రమణతో ఆ స్థానాలు దక్కించుకునేందుకు శ్రేయస్ అయ్యర్, కరుణ్ నాయర్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.
ఐపీఎల్ ముగిశాక
ఐపీఎల్ 2025 సీజన్ ముగిశాక ఇంగ్లాండ్ టూర్ కోసం టీమిండియా సన్నద్ధమవనుంది. ఇంగ్లాండ్ సవాలును యంగ్ ఇండియన్ టెస్టు టీమ్ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. రోహిత్, కోహ్లి రిటైర్మెంట్ తో కేఎల్ రాహుల్ టీమిండియా టెస్టు బ్యాటింగ్ ఆర్డర్లో సీనియర్ ఆటగాడిగా మిగిలాడు. యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, పంత్ లాంటి ప్లేయర్లకు ఎక్కువ అనుభవం లేదు. ఈ సిరీస్ తో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-2027 సైకిల్ స్టార్ట్ అవుతుంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link