ఆసియా దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. మరి భారత్ పరిస్థితి ఏంటి?

Best Web Hosting Provider In India 2024


ఆసియా దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. మరి భారత్ పరిస్థితి ఏంటి?

Anand Sai HT Telugu

ఆసియాలోని కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారత్‌లోనూ కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి.

కరోనా కేసులు (Representative)

ళ్లీ కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత కొన్ని వారాల్లో సింగపూర్, హాంకాంగ్, థాయ్‌లాండ్‌లో కోవిడ్ -19 కేసులు పెరిగాయి. మరోవైపు భారతదేశంలోనూ మెుత్తం కేసులు 257గా నమోదు అయ్యాయి. మే 12 నుంచి వారం రోజుల వ్యవధిలో 164 కొత్త కేసులు వచ్చాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో ఎక్కువగా కేసులు వెలుగుచూశాయి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (ఇఎంఆర్) విభాగం, విపత్తు నిర్వహణ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్), కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు అప్రమత్తమవుతున్నారు.

భారత్‌లో పరిస్థితి

అయితే దేశంలో కోవిడ్ పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు. ‘అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం, కేసులు చాలావరకు తేలికపాటివి, మరణాలతో సంబంధం కలిగి ఉండవు.’ అని అధికారులు చెబుతున్నారు. భారత్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని, దేశంలోని అధిక జనాభాను పరిగణనలోకి తీసుకుంటే సోమవారం వరకు నమోదైన కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

అధికారులు ఏమన్నారంటే?

ఈ పరిణామాల నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) అధ్యక్షతన ఎన్సీడీసీ, ఈఎంఆర్ విభాగం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారతదేశంలో దాదాపు అన్ని కేసులు తేలికపాటివేనని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఈ దేశాల్లో ఎక్కువ

హాంకాంగ్, సింగపూర్ నుంచి థాయ్ లాండ్ వరకు కోవిడ్ -19 కొత్త వేవ్ ఉద్భవించింది. ఒమిక్రాన్ వేరియంట్ జేఎన్.1, దాని అనుబంధ స్ట్రెయిన్ల కారణంగా ఎక్కువ కేసులు వ్యాప్తి చెందుతున్నాయి. మే ప్రారంభంలో సింగపూర్‌లో 14,000కుపైగా కేసులు నమోదయ్యాయి.

కోవిడ్ -19 జెఎన్.1 స్ట్రెయిన్ మొదట 2023 ఆగస్టులో కనుగొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) దీనిని 2023 డిసెంబర్‌లో ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా పేర్కొంది. ఇది ఒమిక్రాన్ బీఏ.2.86 వేరియంట్‌కు వారసుడులాంటిది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link