




Best Web Hosting Provider In India 2024

సూర్య రెట్రోనే మించిపోయిన సిమ్రన్ కామెడీ మూవీ.. ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే
సూర్య నటించిన రెట్రో మూవీనే మించిపోయింది సిమ్రన్ నటించిన కామెడీ మూవీ. బాక్సాఫీస్ కలెక్షన్లలో తమిళనాడులో రెట్రోని వెనక్కి నెట్టింది. మరి అలాంటి బ్లాక్బస్టర్ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందో చూడండి.
తమిళనాడులో పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఉన్న సినిమాలపై కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఆ సినిమాలకు పోటీగా రిలీజయ్యే చిన్న మూవీస్ అసలు ఊసులోనే ఉండవు. కానీ ఈసారి పరిస్థితి తారుమారైంది. సూర్యలాంటి స్టార్ హీరో నటించిన రెట్రో మూవీనే వెనక్కి నెట్టింది సిమ్రన్ నటించిన కామెడీ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. అది కూడా తమిళనాడు గ్రాస్ కలెక్షన్లలో కావడం విశేషం.
టూరిస్ట్ ఫ్యామిలీ బాక్సాఫీస్
టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ మే 1న థియేటర్లలో రిలీజైంది. అదే రోజు సూర్య నటించిన రెట్రో కూడా రావడంతో ఆ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాదని భావించారు. కానీ అనూహ్యంగా రెట్రోనే మించిపోయింది. తమిళనాడులో ఇప్పటి వరకూ రెట్రో రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించగా.. టూరిస్ట్ ఫ్యామిలీ మాత్రం రూ.53 కోట్లు వసూలు చేయడం విశేషం.
మామన్, డీడీ నెక్ట్స్ లెవెల్ లాంటి కొత్త తమిళ సినిమాలు రిలీజైనా.. టూరిస్ట్ ఫ్యామిలీ జోరు తగ్గడం లేదు. ఆదివారం (మే 18) ఒక్కరోజే రూ.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.70 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం. శశికుమార్, సిమ్రన్ నటించిన ఈ కామెడీ ఇప్పటికీ తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది.
టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ రిలీజ్ డేట్
తమిళంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఏడో స్థానంలో నిలిచిన మూవీ ఈ టూరిస్ట్ ఫ్యామిలీ. రూ.14 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా.. రెండు వారాల్లోనే రూ.70 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. మే 31 నుంచి జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా వస్తున్న రిపోర్టులు వెల్లడించాయి.
నిజానికి ఈ సినిమాను నేరుగా ఓటీటీలోకే తీసుకొద్దామని మొదట మేకర్స్ భావించినా.. తర్వాత థియేటర్లలో రిలీజ్ చేశారు. అది కూడా సూర్య నటించిన రెట్రో మూవీకి పోటీగా కావడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ఈ మూవీ.. ఓటీటీలో మరింత దుమ్ము రేపడం ఖాయంగా భావిస్తున్నారు.
టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ గురించి..
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాను అభిషన్ జీవింత్ డైరెక్ట్ చేశాడు. అతనికి ఇదే తొలి మూవీ. శశికుమార్, సిమ్రన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఏప్రిల్ 29న ప్రీమియర్ కాగా.. మే 1న థియేటర్లలో రిలీజైంది. మిలియన్ డాలర్ స్టూడియోస్ ఈ సినిమాను తెరకెక్కింది.
ఈ టూరిస్ట్ ఫ్యామిలీ మనసుకు హత్తుకునే ఓ ఫ్యామిలీ డ్రామా. కొవిడ్ 19, రాజకీయ సంక్షోభాల నేపథ్యంలో శ్రీలంకలో నివసించే ఓ తమిళ కుటుంబం తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి ఇండియాకు రావాల్సి వస్తుంది. ఆ అనిశ్చిత పరిస్థితుల్లో తమ స్వదేశానికి వచ్చి తిరిగి తమ జీవితాన్ని కొత్తగా మొదలు పెడతారు. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఈ కఠిన పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారన్నదాన్ని సరదాగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు.
ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. కథను రియలిస్టిక్గా చెప్పే ప్రయత్నం చేయడం ఆకట్టుకుంటుంది. ఇదే టూరిస్ట్ ఫ్యామిలీ మూవీని బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించేలా చేసింది. అంతేకాదు ఐఎండీబీలోనూ 8.8 రేటింగ్ సాధించింది.
సంబంధిత కథనం