త్రివిక్రమ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..: స్టార్ డైరెక్టర్‌పై నటి పూనమ్ కౌర్ మరోసారి ఆరోపణలు.. ఇన్‌స్టాలో పోస్ట్

Best Web Hosting Provider In India 2024

త్రివిక్రమ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..: స్టార్ డైరెక్టర్‌పై నటి పూనమ్ కౌర్ మరోసారి ఆరోపణలు.. ఇన్‌స్టాలో పోస్ట్

Hari Prasad S HT Telugu

నటి పూనమ్ కౌర్ మరోసారి డైరెక్టర్ త్రివిక్రమ్ పై విరుచుకుపడింది. అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ను ప్రశ్నించింది. తాను త్రివిక్రమ్ పేరును చెబుతూనే ఫిర్యాదు చేసినట్లు మరోసారి స్పష్టం చేసింది.

త్రివిక్రమ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..: స్టార్ డైరెక్టర్‌పై నటి పూనమ్ కౌర్ మరోసారి ఆరోపణలు.. ఇన్‌స్టాలో పోస్ట్

నటి పూనమ్ కౌర్ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు కూడా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తాను చేసిన ఫిర్యాదును పట్టించుకోవడం లేదంటూ ఆమె ఇన్‌స్టా స్టోరీ పోస్ట్ చేసింది. మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ లోని లైంగిక వేధింపుల నిరోధక కమిటీ సభ్యురాలైన నటి ఝాన్సీతో టచ్ లోనే ఉన్నట్లు ఆమె ఓ ఆధారాన్ని కూడా ఈ సందర్భంగా బయటపెట్టింది.

ఎందుకు పట్టించుకోవడం లేదు?

నటి పూనమ్ కౌర్ గత నాలుగైదేళ్లుగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతోంది. అతనిపై ఫిర్యాదు చేసినట్లు చెబుతూనే ఉంది. అయితే అసలు నిజంగా తమ ఇద్దరి మధ్య ఏం జరిగిందన్న విషయాన్ని మాత్రం స్ఫష్టంగా ఎప్పుడూ చెప్పలేదు. తాజాగా మరోసారి త్రివిక్రమ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఝాన్సీని ప్రశ్నించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కూడా చేసింది.

“నేను గతంలోనూ చెప్పాను.. ఇప్పుడూ చెబుతున్నాను. నేను ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాను. ఝాన్సీగారితోనూ మాట్లాడాను. నాతో మాట్లాడతానని చెప్పిన ఆమె ఆ తర్వాత ఆలస్యం చేస్తోంది. తనను డిస్టర్బ్ చేయొద్దని అంటోంది. నేను ఎవరి పేరూ చెప్పలేని అంటున్నారు. కానీ నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశానని స్పష్టంగా చెబుతున్నాను. అతన్ని రాజకీయ నేతలు, ఇండస్ట్రీలోని ఎంతో మంది కాపాడుతున్నారు. నేను మహిళా సంఘంతో మాట్లాడతాను” అని పూనమ్ ఇన్‌స్టా స్టోరీస్ లో ఓ పోస్ట్ చేసింది.

ఝాన్సీతో టచ్‌లోనే..

అంతేకాదు తాను ఝాన్సీతో టచ్ లోనే ఉన్నట్లు కూడా ఓ ఆధారాన్ని ఆమె బయటపెట్టింది. అది గతేడాది సెప్టెంబర్ లో ఝాన్సీ టీమ్ తనకు ఇచ్చిన రిప్లైకి సంబంధించిన స్క్రీన్‌షాట్. అందులో ఇలా ఉంది..

“హాయ్ పూనమ్.. మీ వాదన వినడానికి ఓ కమిటీ రూపొందించే ప్రక్రియ మొదలుపెట్టాం. మీరేం చెప్పాలనుకున్నారో ఆ కమిటీ ముందు చెప్పండి. అంతకంటే ముందు నాతో ఏ విషయం చెప్పొద్దు. ఓ మహిళా లాయర్ కోసం చూస్తున్నాం. కాస్త ఓపికగా ఉండండి” అని రిప్లై ఇచ్చారు.

అసలేంటీ వివాదం?

అసలు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనమ్ ఏం ఆరోపణలు చేసిందన్నదానిపై ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. గతేడాది జానీ మాస్టర్ కేసు తెరపైకి వచ్చినప్పుడు కూడా పూనమ్ దీనిపై స్పందించింది. తాను చెప్పినప్పుడే త్రివిక్రమ్ పై చర్యలు తీసుకొని ఉంటే.. తనతోపాటు చాలా మందికి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని అందులో ఆమె రాసింది. త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని తాను ఇండస్ట్రీ పెద్దలను డిమాండ్ చేసినట్లు కూడా వెల్లడించింది. గత నాలుగైదేళ్లుగా త్రివిక్రమ్ గురించి అప్పుడప్పుడూ ఇలాంటి పోస్టులు ఆమె చేస్తూనే ఉంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024