Best Web Hosting Provider In India 2024

డ్రాగన్ బ్యూటీ ఇంత పని చేసిందా? నైట్ పార్టీ కోసం రూ.35 లక్షలు.. ఈడీ రైడ్ లో గుట్టు రట్టు..కాయదు లోహర్ పై సంచలన ఆరోపణలు
డ్రాగన్ బ్యూటీ కాయదు లోహర్ వివాదంలో చిక్కుకుంది. టాస్మాక్ స్కామ్ తో సంబంధం ఉన్న నిందితులు నిర్వహించిన నైట్ పార్టీలో ఈ భామ పాల్గొన్నట్లు తెలిసింది. అందుకోసం రూ.35 లక్షలు తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
వరుస సినిమా ఆఫర్లతో టాక్ ఆఫ్ ది సినీ ఇండస్ట్రీగా మారిన కాయదు లోహర్ పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. సినిమా అవకాశాలతో, క్రేజీ ప్రాజెక్టులతో ఇప్పటివరకూ వార్తల్లో నిలుస్తున్న కాయదు.. ఇప్పుడు మరో విషయంలో వైరల్ గా మారింది. టాస్మాక్ స్కామ్ నిందితులతో సంబంధాల విషయంలో కాయదు పేరు బలంగా వినిపిస్తోంది. ఈ నిందితులు నిర్వహించిన నైట్ పార్టీల్లో కాయదు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఆ నైట్ పార్టీల్లో
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో టాస్మాక్ స్కామ్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ లిక్కర్ స్కామ్ సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్న వాళ్లతో కాయదు లోహర్ రిలేషన్ వైరల్ గా మారింది. ఈ నిందితులు నిర్వహించిన నైట్ పార్టీల్లో కాయదు పాల్గొన్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆమె రూ.35 లక్షలు తీసుకుందనే టాక్ వినిపిస్తోంది.
ఈడీ రైడ్స్
టాస్మాక్ స్కామ్ వ్యక్తులతో కాయదు లోహర్ కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిందితులపై ఈడీ రైడ్స్ జరిగిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిందని తమిళనాడు మీడియా కోడై కూస్తోంది. రూ.35 లక్షలు తీసుకుని కాయదు నైట్ పార్టీలకు వెళ్లిందనే వార్త ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేస్తోంది.
డ్రాగన్ మూవీతో
2021లో కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసింది కాయదు లోహర్. ఆ తర్వాత మలయాళం, తెలుగు, మరాఠి సినిమాలు చేసింది. తెలుగులో అల్లూరి సినిమాలో మెరిసింది. అయితే డ్రాగన్ సినిమా తో కాయదు కెరీర్ మారిపోయింది. ఈ మూవీలో యాక్టింగ్, ఎక్స్ పోజింగ్ తో ఆ భామ సెన్సేషనల్ గా మారింది.
డ్రాగన్ బ్లాక్ బస్టర్ తో కాయదు వరుసగా ఆఫర్లు కొట్టేస్తోంది. ప్రస్తుతం అధర్వ, జీవీ ప్రకాష్ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్న కాయదు.. శింబుతో మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇటు తెలుగులోనూ ప్యారడైజ్ తదితర సినిమాలకు ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఆ స్కామ్ ఏంటీ?
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్)లో ఆర్థిక కుంభకోణం సంచలనంగా మారింది. లిక్కర్ స్కామ్ చేశారంటూ స్టాలిన్ ప్రభుత్వంపై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. దాడులు నిర్వహిస్తోంది. టెండర్లలో అవినీతి ద్వారా రూ.1000 కోట్లు కొట్టేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, డిస్టెల్లరీ ఓనర్లు ఉన్నారని అంటున్నారు.