భగవద్గీత చెబుతున్న ప్రకారం ఇలాంటి వ్యక్తులతో స్నేహం ప్రమాదకరం, వారు మీకు విచారాన్ని ఒత్తిడినే మిగులుస్తారు

Best Web Hosting Provider In India 2024

భగవద్గీత చెబుతున్న ప్రకారం ఇలాంటి వ్యక్తులతో స్నేహం ప్రమాదకరం, వారు మీకు విచారాన్ని ఒత్తిడినే మిగులుస్తారు

Haritha Chappa HT Telugu

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎన్నో బోధనలను మానవాళికి అందించాడు. వాటిని పాటిస్తే ఒక మనిషి జీవితంలో సరైన దిశలో నడిచేందుకు వీలు కలుగుతుంది. భగవద్గీతలో ఎలాంటి వారితో స్నేహం చేయకూడదు కూడా చెప్పారు.

భగవద్గీత (Pixabay)

కురుక్షేత్ర యుద్ధ భూమిలో పుట్టిన అద్భుతమైన ఇతిహాసం భగవద్గీత. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన బోధనలు ఎన్నో ఉన్నాయి. వాటిలో బంధాల గురించి, అనుబంధాల గురించి స్నేహం గురించి కూడా ఉంది. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం స్నేహాన్ని ఎప్పుడూ ఆలోచించి కొనసాగించాలి. స్నేహితులను కూడా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.

ఒక స్నేహం మీ జీవితాన్ని నిలబెట్టగలదు… అదే స్నేహం చెడుగా మారితే మీ జీవితాన్ని నాశనం చేయగలదు. కాబట్టి మీరు ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నారో అర్థం చేసుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. భగవద్గీతలో కొంతమందితో స్నేహం చేయడం చాలా ప్రమాదకరమని చెప్పాడు శ్రీకృష్ణుడు. అలాంటి వ్యక్తులు ఎవరో తెలుసుకోండి.

గర్వంతో నిండిన వారు

భగవద్గీత ప్రకారం గర్వంతో నిండిన వ్యక్తితో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. ఎందుకంటే అతను ఎప్పుడూ కూడా తనను తాను గొప్పవాడిగా భావిస్తాడు. ఇతరులను తక్కువగా చూస్తూ, బాధపెడుతూ, కించపరుస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరి మాట వినడు. అలాంటి వ్యక్తితో స్నేహం చేస్తే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆ స్నేహం వల్ల మీపై తీవ్ర ఒత్తిడి కూడా పడవచ్చు. మీ స్నేహితుల్లో గర్వితులు ఉంటే వెంటనే అతని దూరంగా పెట్టండి.

మూర్ఖుడు

మూర్ఖుడు ఆలోచించకుండా అన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఒక మూర్ఖుడి వెంట ఉండడం చాలా ప్రమాదకరం. అతను తాను ఇబ్బందుల్లో పడ్డమే కాదు ఇతరులను కూడా ఇబ్బందుల్లో పడేస్తాడు. మూర్ఖుడితో స్నేహం చేయడం ఎప్పటికైనా ప్రమాదకరమని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. అలాంటి వ్యక్తులు సమస్యలను కొని తెచ్చి పక్కవారిని కూడా ఇబ్బంది పెడతారు.

తీవ్రమైన కోపం ఉన్నవారు

భగవద్గీతలో చెప్పిన ప్రకారం విపరీతమైన కోపం ఉన్న వ్యక్తితో స్నేహం కూడా మంచిది కాదు. కోపంగా ఉన్న వ్యక్తి మనసు చంచలంగా ఉంటుంది. అది స్థిరంగా ఉండదు. వారిలో ఆలోచనా శక్తి కూడా తక్కువగా ఉంటుంది. అలాంటి వారితో స్నేహం చాలా ముప్పు. అలాంటివారు కోపంలో ఎలాంటి పనులైనా చేస్తారు. దానివల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. మీ జీవితంలోని ప్రశాంతత కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తీవ్రమైన కోపంతో ఉన్నవారికి దూరంగా ఉండటమే మంచిది.

ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నాకే

మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అతని మతం నుంచి, నైతికత, విలువలు వరకు ఎలాంటి వాడో తెలుసుకోవాలి. ఈ వివరాలు తెలుసుకోవడం వల్ల అతడు ఎలాంటి ఆచారాలను పాటిస్తాడో… ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడో కొంతవరకు అంచనా వేయవచ్చు. ఒక వ్యక్తి గురించి ఏమీ తెలియకుండా అతనితో స్నేహం చేయడం మాత్రం మంచిది కాదు. ఇది మిమ్మల్ని ఒక్కోసారి తీవ్రమైన కష్టాల్లోకి తోసేస్తుంది. భవిష్యత్తును నాశనం చేస్తుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024