తెలంగాణ పాలిసెట్ – 2025 ఫలితాలు విడుదల… మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024

తెలంగాణ పాలిసెట్ – 2025 ఫలితాలు విడుదల… మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

తెలంగాణ పాలిసెట్ – 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

తెలంగాణ పాలిసెట్ ఫలితాలు 2025

తెలంగాణ పాలిసెట్ – 2025 ఫలితాలు వచ్చేశాయి. ఉదయం 11 గంటల తర్వాత ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు వారి ర్యాంక్ కార్డులను తెలంగాణ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈనెల 13వ తేదీన పాలిసెట్ – 2025 పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొత్తం 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 81.88 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో అర్హత సాధించిన వారికి పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని ఇంజనీరింగ్‌, నాన్ ఇంజనీరింగ్‌, టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

టీజీ పాలిసెట్ 2025 ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి:

  1. టీజీ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ https://www.polycet.sbtet.telangana.gov.in/ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయాలి.
  3. మీ హాల్ టికెట్ నెంబర్, క్యాప్చాను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  4. ఇక్కడ ర్యాంక్‌ కార్డు స్క్రీన్‌పై డిస్‌ ప్లే అవుతుంది.
  5. ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
  6. అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.

పాలిసెట్ ఫలితాల విడుదలైన నేపథ్యంలో… త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. ర్యాంక్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో మొత్తం కన్వీనర్ కోటా సీట్లే ఉంటాయి. ఇందులో 85 శాతం స్థానికులకు మిగిలిన 15 శాతం సీట్లను స్థానికేతర కోటా కింద కేటాయిస్తారు. విడతల వారీగా సీట్ల భర్తీ ఉంటుంది. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదలవుతాయి.

ఈ లింక్ పై క్లిక్ చేసి తెలంగాణ పాలిసెట్ – 2025 ఫలితాలను చెక్ చేసుకోవచ్చు…

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Ts PolycetEntrance TestsExamsExam ResultsTelangana NewsAdmissionsEducation
Source / Credits

Best Web Hosting Provider In India 2024