‘నువ్వు ఎందుకు చావవు?’ అని అడిగిన భర్త- ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్న మహిళ!

Best Web Hosting Provider In India 2024


‘నువ్వు ఎందుకు చావవు?’ అని అడిగిన భర్త- ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్న మహిళ!

Sharath Chitturi HT Telugu

4 నెలల క్రితం వివాహం చేసుకున్న ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన యూపీలో కలకలం రేపింది. తన భర్త, అతని కుటుంబం తనని చిత్రహింసలు పెడుతోందని వీడియో షూట్​ చేసి ఆమె ప్రాణాలు తీసుకుంది.

యూపీలో మహిళ ఆత్మహత్య

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణ ఘటన జరిగింది. భర్త, అతని తరఫు కుటుంబసభ్యుల వేధింపుల కారణంగా ఓ 23ఏళ్ల మహిళ ప్రాణాలు తీసుకుంది! తన మరణానికి కారణం వారేనంటూ, వీడియో షూట్​ చేసి ఆత్మహత్యకు పాల్పడింది.

అసలేం జరిగింది?

యూపీకి చెందిన 23ఏళ్ల అమ్రీన్​ జహాన్ నాలుగు నెలల ముందు ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆమె భర్త బెంగళూరులో వెల్డింగ్​ పనులు చేసుకుంటాడు. పెళ్లి తర్వాత నుంచి అమ్రీన్​ మొరాదాబాద్​లోని అత్తారింటిలో జీవిస్తోంది.

ఇటీవలే ఆమెకు గర్భం పోయింది. అప్పటి నుంచి తన​ని తన భర్త, అతని కుటుంబసభ్యులు వేధించడం మొదలుపెట్టారని అమ్రీన్​ చెప్పింది. మరీ ముఖ్యంగా భర్త తండ్రి, భర్త సోదరి హింసిస్తున్నారని వివరించింది.

“ఒక్కోసారి నా ఆహారపు అలవాట్లను నిందిస్తారు. ఇంకోసారి నా రూమ్​కి కరెంట్​ని కట్​ చేస్తారు. నా చికిత్సకు డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టినట్టు తిడుతుంటారు. ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయమని అడుగుతుంటారు. నా భర్త దగ్గర అన్ని డబ్బులుంటే, పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుంది. నా భర్త తండ్రి, నా భర్త సోదరి నన్ను చాలా విధాలుగా హింసిస్తున్నారు. కానీ తప్పంతా నాదే అని నా భర్త అంటున్నాడు. అతనికి అసలేం అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే, నా పరిస్థితికి అతను కూడా ఒక కారణం. నేను ఏమాత్రం సహించలేకపోతున్నాను,” అని మరణానికి ముందు షూట్​ చేసిన వీడియోలో అమ్రీన్​ వెల్లడించింది.

“నువ్వు ఎందుకు చావకూడదు? నువ్వు ఎందుకు చావవు?” అని తన భర్త తనని అడిగినట్టు అమ్రీన్​ తెలిపింది. అతని తండ్రి, సోదరి కూడా అలాగే మాట్లాడతారని చెప్పింది.

“నా మరణం తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఈ పరిస్థితి కన్నా నేను చాలా ప్రశాంతంగా ఉంటాను,” అని అమ్రీన్​ చెప్పి ఆత్మహత్య చేసుకుంది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. అమ్రీన్​ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, అమ్రీన్​ భర్త, అతని కుటుంబ సభ్యులపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరణానికి ముందు రోజు అమ్రీన్​ తనకు కాల్​ చేసినట్టు, అందరు తనని హింసిస్తున్నట్టు చెప్పి, ఏడ్చినట్టు అతను పోలీసులకు వివరించరు. ఆమె ఇంటికి వెళ్లేసరికి ప్రాణాలతో లేదని వివరించాడు.

అమ్రీన్​ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link