Best Web Hosting Provider In India 2024

కన్నప్ప టీమ్కు షాక్.. కీలక సీన్స్ ఉన్న హార్డ్డిస్క్ మిస్.. ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు
కన్నప్ప సినిమాకు సంబంధించిన ఓ హార్డ్డిస్క్ పోయిందట. దీనిపై మూవీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరిపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఏం జరిగిందంటే..
కన్నప్ప సినిమాకు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ జూన్ 27వ తేదీన విడుదల కావాల్సింది. స్టార్ నటీనటులు ఉన్న ఈ డెవోషనల్ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో కన్నప్ప టీమ్కు షాక్ ఎదురైంది. కీలకమైన సన్నివేశాలు ఉన్న ఓ హార్డ్డిస్క్ మిస్ అయిందని ఈ టీమ్ వెల్లడించింది.
ముంబై నుంచి వచ్చిన హార్డ్డిస్క్ మిస్
కన్నప్ప సినిమాకు సంబంధించి కీలకమైన కంటెంట్ ఉన్న ఓ హార్డ్డిస్క్ను ముంబైకు చెందిన ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీ.. హైదరాబాద్కు పంపింది. డీటీడీసీ ద్వారా వచ్చిన ఈ హార్డ్డిస్క్ను మూవీ కార్యాలయంలో పని చేసే ఆఫీస్ బాయ్ రఘు తీసుకున్నారు. ఆ తర్వాత దాన్ని చరిత అనే మహిళకు అతడు ఇచ్చారు. హార్డ్డిస్క్ వచ్చిందనే విషయాన్ని రఘు, చరిత దాచేశారు. తప్పించుకొని తిరుగుతున్నారు. దీంతో హార్డ్డిస్క్ మిస్ అయిందనే విషయం మూవీ టీమ్కు తెలిసింది. ఈ విషయాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మూవీ టీమ్ తెలిపింది.
ఇద్దరిపై ఫిర్యాదు
కన్నప్ప సినిమా హార్డ్డిస్క్ మిస్ అయిన విషయంలో రఘు, చరితపై ఫిల్మ్ నగర్ పోలీసులకు కన్నప్ప ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూజర్ విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వారిద్దరిని వెతికేందుకు పోలీసులు రంగంలోకి దిగారని తెలిసింది. ప్రమోషన్ల కోసం ప్లాన్ చేసుకుంటున్న కన్నప్ప టీమ్కు ఇది షాక్లా మారింది.
విడుదలపై ఉత్కంఠ
కన్నప్ప సినిమాను జూన్ 27న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసింది. అయితే, ఈ హార్డ్డిస్క్ మిస్సింగ్ వ్యవహారం రిలీజ్పై ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఈ చిత్రం వాయిదాలు పడుతూ వచ్చింది. మరి ఈ విషయంలో చివరికి ఏం జరుగుతుందో చూడాలి.
ఈ చిత్రంలో శివుడి పరమభక్తుడు కన్నప్ప పాత్రను మంచు విష్ణు పోషించారు. ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్ కుమార్ లాంటి భారీ స్టార్లు ఈ చిత్రంలో నటించారు. కాజల్ అగర్వాల్.. పార్వతీ దేవిగా కనిపించనున్నారు. దీంతో పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీపై ఫోకస్ ఉంది.
కన్నప్ప సినిమాను మంచు మోహన్ బాబు ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. స్టీఫెన్ దేవసి ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నారు. గ్రాండ్ విజువల్స్, పీఎఫ్ఎక్స్ ఉన్న ఈ మూవీ భారీ బడ్జెట్తో రూపొందింది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.