





Best Web Hosting Provider In India 2024

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు,ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో రేపు(బుధవారం) చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా, కొన్నిచోట్ల 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో రానున్న 2-3 రోజుల్లో మరింత విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
బలపడుతున్న అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతం ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం, ఉత్తరదిశగా కదులుతూ రాగల 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఈ నెల 29న వాయుగుండంగా మారేందుకు అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు
గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వేశారు.
మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి అనకాపల్లి జిల్లా పాములవాకలో 46.5 మి.మీ, నరసింగపల్లిలో 41.2 మి.మీ, యలమంచిలిలో 40.7 మి.మీ, అల్లూరి జిల్లా అనంతగిరి 37.5 మి.మీ, అనకాపల్లిలో 29 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది.
సంబంధిత కథనం
టాపిక్