మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు.. 30ఏళ్లుగా పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో సీబీఎన్

Best Web Hosting Provider In India 2024

మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు.. 30ఏళ్లుగా పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో సీబీఎన్

Sarath Chandra.B HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu

తెలుగు దేశం పార్టీ జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. 30ఏళ్లుగా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న చంద్రబాబును మరోమారు పార్టీ శ్రేణులు ఆ పదవి కట్టబెట్టబోతున్నారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా మరోమారు బాధ్యతలు చేపడతారు.

టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు, నేడు మహానాడులో ప్రకటన

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా 30 ఏళ్లుగా కొనసాగుతున్న చంద్రబాబు కడప మహానాడులో మరోమారు ఎన్నిక కానున్నారు. 1995లో తొలిసారి తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు .. అప్పటి నుంచి ఆ పదవిలో కొన సాగుతున్నారు.

టీడీపీ అధ్యక్ష పదవికి ఎన్నికలను ప్రతి రెండేళ్లకు ఒక సారి నిర్వహిస్తారు. 2014 రాష్ట్ర విభజన వరకు ఉమ్మడి ఏపీలో టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ శాఖలతో కలిపి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

కడపలో జరుగుతున్న 34వ మహానాడులో మరోమారు అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. దీంతో కలిపి ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి 30ఏళ్లు పూర్తవుతాయి. చంద్రబాబు పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2004లో టీడీపీ ఓడిపోయింది. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది.

2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ చేతిలో టీడీపీ ఓటమి పాలైంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీకి పూర్వ వైభవం వచ్చింది. 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఓటమి పాలైనా ఏపీలో మాత్రం విజయం సాధించింది.తెలంగాణలో సంక్షోభాలు ఎదురైనా ఏపీలో పార్టీని నిలబెట్టగలిగారు.

2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడంతో టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డాయి. 2024 ఎన్నికల నాటికి టీడీపీ తిరిగి పుంజుకుని విజయం సాధించింది. ఏడాది క్రితం ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కడప మహానాడు వేదికగా చంద్రబాబు మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు.

మహానాడులో రెండో రోజు కార్యక్రమాలు…

  • ఉదయం 10-10.30 వరకు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తారు.
  • ఉదయం 10.30-11 వరకు తెలుగు జాతి -విశ్వఖ్యాతి కార్యక్రమం నిర్వహణ
  • ఉదయం 11-12 గంటలు రాష్ట్రం- విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం
  • మధ్యాహ్నం 12-1 రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ, ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి, రాయలసీమ డిక్లరేషన్‌, అమరావతి అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చిస్తారు.
  • మధ్యాహ్నం 2 నుంచి 2.15 వరకు యోగాంధ్రప్రదేశ్‌ కార్యక్రమాలపై చర్చ ఉంటుంది. మధ్యాహ్నం 2.15-2.30 వరకు మౌలిక సదుపాయాల కల్పనతో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం, రహదారులు, పోర్టులు, ఎయిర్‌ పోర్టుల అభివృద్ధిపై చర్చిస్తారు.
  • మధ్యాహ్నం రెండున్నర నుంచి 3 వరకు విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, సమగ్ర సాగునీటి ప్రణాళికలతో ఉజ్వల ప్రగతి, తెలంగాణ వ్యవసాయం- సాగునీటి ప్రాజెక్టులపై చర్చిస్తారు.

మధ్యాహ్నం 3-3.30 వరకు ప్రజల సంరక్షణ-శాంతి భద్రతల పరిరక్షణపై చర్చిస్తారు. మూడున్నర నుంచి 4 వరకు పర్యాటక అభివృద్ధికిపటిష్ట చర్యలపై తీర్మానాలు ఉంటాయి. సాయంత్రం నాలుగు నుంచి నాలుగున్నర వరకు రాజకీయ తీర్మానం చేస్తారు. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబును ఎన్నుకుంటారు. సాయంత్రం నాలుగున్నర నుంచి 4.45 వరకు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నిక ప్రకటన, ప్రమాణ స్వీకారం ఉంటాయి. సాయంత్రం 4.45 నుంచి 5.30 వరకు జాతీయ అధ్యక్షుల ముగింపు ఉపన్యాసం ఉంటుంది.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం

టాపిక్

Mahandu 2025TdpChandrababu NaiduAp PoliticsAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024