పేర్లు రాసిపెట్టుకోండి… వారందరికీ వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది – వైఎస్ జగన్ వార్నింగ్

Best Web Hosting Provider In India 2024

పేర్లు రాసిపెట్టుకోండి… వారందరికీ వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది – వైఎస్ జగన్ వార్నింగ్

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

వైసీపీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టే ఏ ఒకర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత జగన్ మరోసారి హెచ్చరించారు. వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ చెల్లిస్తామని వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రస్తుతం దౌర్భాగ్యపు పాలన సాగుతోందని విమర్శించారు.

వైసీపీ అధినేత జగన్

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన సీఎం చంద్రబాబే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని విమర్శించారు. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నాడని… సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు… ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుందంటూ సెటైర్లు విసిరారు.

డిపాజిట్లు కూడా రావు – వైఎస్ జగన్

“తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికే ప్రతి ఇంట్లో ఉన్నాయి. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడు… డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో పడిపోతాడు” అని వైెఎస్ జగన్ దుయ్యబట్టారు.

రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం…

కూటమి పాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు అవుతోందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలూ సృష్టిస్తున్నారని ఆరోపించారు. అధికారులంతా కూటమి కనుసన్నల్లో పనిచేస్తున్నారన్నారు. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒకర్నీ కూడా వదిలే పరిస్థితి ఉండదన్నారు. ఇబ్బందిపెట్టిన ప్రతి ఒక్కర్నీ పేరు రాసిపెట్టుకోవాలని సూచించారు. అలాంటి వారికి వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ చెల్లిస్తామని హెచ్చరించారు.

వచ్చే వైసీపీ 2.Oలో అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు, కార్యకర్తలకూ ప్రాధాన్యత ఉంటుందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నామన్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Ys JaganAndhra Pradesh NewsAp Politics
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024