రేపు ‘దోస్త్’ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు – అలాట్ మెంట్‌ ఎలా చెక్ చేసుకోవాలంటే

Best Web Hosting Provider In India 2024

రేపు ‘దోస్త్’ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు – అలాట్ మెంట్‌ ఎలా చెక్ చేసుకోవాలంటే

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రేపు (మే 29) సీట్లను కేటాయించనున్నారు. dost.cgg.gov.in వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.

తెలంగాణ దోస్త్ సీట్ల కేటాయింపు

తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ – 2025 ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ సీట్లను రేపు(మే 29) కేటాయించనున్నారు. ఫస్ట్ ఫేజ్ కింద 87 వేలకుపైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న వారికి మాత్రమే సీట్లను అలాట్ చేస్తారు.

జూన్ 6 వరకు రిపోర్టింగ్…

దోస్త్ 2025 ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు మే 30వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ గడువు జూన్ 6వ తేదీతో ముగుస్తుంది. సీటు పొందిన కాలేజీలో రిపోర్టింగ్ చేయకపోతే… వారి సీటు రద్దు అవుతుంది.

సీటు అలాట్ మెంట్ ఎలా పొందాలంటే..?

దోస్త్ ఫస్ట్ ఫేజ్ లో సీటు పొందే విద్యార్థులు https://dost.cgg.gov.in/welcome.do వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు. ఈ కాపీతో పాటు విద్యా అర్హత పత్రాలను సంబంధిత కాలేజీలో సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు లోపు రిపోర్టింగ్ తప్పకుండా చేయాలి. లేకపోతే సీటు రద్దవుతుంది. ఆ తర్వాత… మళ్లీ రిపోర్టింగ్ కు అవకాశం ఉండదు.

మే 30 నుంచి సెకండ్ ఫేజ్:

తెలంగాణ దోస్త్ 2025 సెకండ్ ఫేజ్ ప్రక్రియ మే 30 నుంచి షురూ అవుతుంది. జూన్‌ 8 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. మే 30 నుంచి జూన్‌ 9 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్‌ 13న సీట్ల కేటాయింపు ఉంటుంది.

మూడో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్‌ 13 నుంచి మొదలవుతుంది. ఇందుకు జూన్ 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జూన్‌ 13 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవాలి. జూన్‌ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలను ఎంచుకోవాలి. వారి స్కోర్, రిజర్వేషన్ ఆధారంగా…. సీట్లను కేటాయిస్తారు. దోస్త్ రిజిస్ట్రేషన్ల ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మగాంధీ, తెలంగాణ వర్శిటీ,చాకలి ఐలమ్మ, శాతవాహన వర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Ts DostTg DostTelangana NewsEducation
Source / Credits

Best Web Hosting Provider In India 2024