బాలీవుడ్ నటిని కన్నార్పకుండా చూస్తున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్; వీడియో వైరల్

Best Web Hosting Provider In India 2024


బాలీవుడ్ నటిని కన్నార్పకుండా చూస్తున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్; వీడియో వైరల్

Sudarshan V HT Telugu

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బాలీవుడ్ నటి మావ్రా హోకానేకు అవార్డు ఇస్తున్న పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.2023 నాటి ఈ వీడియోలో పాకిస్తాన్ ప్రధాని అవార్డు తీసుకుని వెళ్తున్న ఆ నటిని కన్నార్పకుండా చూస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో మరోసారి వైరల్ గా మారింది.

బాలీవుడ్ నటిని కన్నార్పకుండా చూస్తున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (X)

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నటి మావ్రా హోకానేకు అవార్డు ఇస్తున్న పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 నాటి ఈ వీడియోలో పాకిస్తాన్ ప్రధాని అవార్డు తీసుకుని వెళ్తున్న నటిని వెనుక నుంచి కన్నార్పకుండా చూస్తున్న దృశ్యాలు ఉన్నాయి. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని గవర్నర్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

2023 నాటి వీడియో

‘‘షాబాజ్ షరీఫ్ అవార్డు ఇచ్చే సమయంలో మావ్రా హుస్సేన్ ను డీప్ స్కాన్ చేశాడు’’ అనే క్యాప్షన్ తో 2023లో పాకిస్థాన్ కు చెందిన యూ న్యూస్ టీవీ ఈ వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. మావ్రా హోకానే 2016లో సనమ్ తేరీ కసమ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల తన సహనటుడు హర్షవర్ధన్ ఈ చిత్రంలో మావ్రాను నటింపజేస్తే తాను సీక్వెల్ లో భాగం కాబోనని ప్రకటించడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది.

ఆపరేషన్ సిందూర్ పై అనుచిత వ్యాఖ్యలు

26 మందిని పొట్టనబెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను మావ్రా ఖండించింది. వాటిని పీఆర్ స్టంట్స్ అని ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలోనే మావ్రాపై హర్షవర్ధన్ రాణే పై విధంగా స్పందించారు. మ్యూజిక్ యాప్స్ లో సనమ్ తేరీ కసమ్ డిజిటల్ పోస్టర్ల నుంచి కూడా మావ్రా హోకానేను తొలగించారు.

ఆపరేషన్ సిందూర్

26 మంది పౌరులను బలిగొన్న కాశ్మీర్ లోని పహల్గామ్ వద్ద ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి భారతదేశ ప్రత్యక్ష సైనిక ప్రతిస్పందనే ఆపరేషన్ సిందూర్. మే 7వ తేదీ తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించింది. తెల్లవారు జామున జరిగిన దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు మరణించారు. అనంతరం, పాక్ సరిహద్దు వెంబడి యుద్ధ విమానాలు, క్షిపణులు, సాయుధ డ్రోన్లు, రాకెట్లతో వరుస దాడులు, ప్రతిదాడులు జరిగాయి. మే 9-10 తేదీల రాత్రి భారత వైమానిక దళం 13 పాక్ వైమానిక స్థావరాలు, సైనిక స్థావరాలపై దాడులు చేసింది. నాలుగు రోజుల పాటు సాగిన పోరు అనంతరం మే 10న ఇరుదేశాలు ఒక అవగాహనకు రావడంతో సైనిక దాడులను నిలిపివేశారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link