



Best Web Hosting Provider In India 2024
‘‘హమాస్ గాజా చీఫ్, ‘ది షాడో’ మహమ్మద్ సిన్వర్ ను హతమార్చాం’’: బెంజమిన్ నెతన్యాహు
హమాస్ గాజా చీఫ్, షాడోగా పేరుగాంచిన మహమ్మద్ సిన్వర్ ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. హమాస్ గాజా చీఫ్ మహమ్మద్ సిన్వర్ గత ఏడాది తన సోదరుడు యాహ్యా సిన్వర్ ను ఇజ్రాయెల్ హతమార్చిన తర్వాత పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ లో ఉన్నత స్థానానికి ఎదిగారు.
హమాస్ గాజా చీఫ్, షాడోగా పేరుగాంచిన మహమ్మద్ సిన్వర్ ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం ప్రకటించారు. గత ఏడాది తన సోదరుడు, హమాస్ కీలక నేత యాహ్యా సిన్వర్ ను ఇజ్రాయెల్ దళాలు హతమార్చిన తర్వాత మొహమ్మద్ సిన్వర్ పాలస్తీనా సాయుధ బృందంలో ఉన్నత స్థానానికి ఎదిగాడు.
మహమ్మద్ సిన్వర్ హతం
షాడో మహమ్మద్ సిన్వర్ ను అంతమొందించామని నెతన్యాహు బుధవారం పార్లమెంట్ ప్లీనరీ సమావేశంలో చెప్పారు. ఈ నెల ప్రారంభంలో దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సిన్వర్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని అప్పట్లో ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధృవీకరించలేదు.
మహమ్మద్ సిన్వర్ ఎవరు?
తన సోదరుడు, హమాస్ దివంగత నాయకుడు యాహ్యా సిన్వర్ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన తరువాత, ముహమ్మద్ సిన్వర్ గాజాలో సైనిక విభాగాన్ని, రాజకీయ కమాండ్ ను చేపట్టాడు. గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో జన్మించిన మహమ్మద్ ఇబ్రహీం హసన్ సిన్వర్ అనేక దశాబ్దాలుగా హమాస్ శ్రేణులకు సేవలందించారు.
ముద్దు పేరు షాడో
తన రహస్య కార్యకలాపాల కారణంగా హమాస్ శ్రేణులు, ఇజ్రాయెల్ అధికారులు “షాడో” అని ముద్దుగా పిలుచుకునే సిన్వర్ ఈ బృందంలో కీలక వ్యక్తి. 2006లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాద్ షాలిత్ ను అపహరించే ఆపరేషన్ లో పాల్గొన్నాడు. దీనివల్ల 2011 లో ఖైదీల మార్పిడి ఒప్పందానికి దారితీసింది. ఇజ్రాయెల్, పాలస్తీనా జైళ్లలో ఏళ్ల తరబడి గడిపిన ఆయన ఇతర హమాస్ నాయకులతో సన్నిహిత సంబంధాలు పెంచుకుని 1991లో హమాస్ సైనిక విభాగంలో చేరారు.
గతంలో పలుమార్లు ప్రయత్నాలు
మొహమ్మద్ సిన్వర్ ను హతమార్చేందుకు ఇజ్రాయెల్ గతంలో పలుమార్లు ప్రయత్నించింది. 2014లో ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో సిన్వర్ చనిపోయాడని హమాస్ ప్రకటించింది. కానీ ఆ సమాచారం అబద్ధమని రుజువైంది. గాజాను స్వాధీనం చేసుకుంటామని, హమాస్ ను నాశనం చేసే వరకు లేదా నిరాయుధులను చేసి బహిష్కరించే వరకు పోరాడతామని, 2023 అక్టోబర్ 7 దాడిలో పట్టుబడిన మిగిలిన 58 మంది బందీలను మిలిటెంట్ గ్రూప్ తిరిగి ఇచ్చే వరకు పోరాడతామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. హమాస్ నేతృత్వంలోని మిలిటెంట్లు 2023 దాడిలో 1,200 మంది ఇజ్రాయెలీలను హతమార్చగా, 251 మందిని అపహరించారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడిలో సుమారు 54,000 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link