ఒరిజినల్‌గా ఇది వెట్రిమారన్ కథ.. ముగ్గురు హీరోలతో సినిమా చేయడం అంత ఈజీ కాదు.. హీరో నారా రోహిత్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

ఒరిజినల్‌గా ఇది వెట్రిమారన్ కథ.. ముగ్గురు హీరోలతో సినిమా చేయడం అంత ఈజీ కాదు.. హీరో నారా రోహిత్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం. తమిళంలో డైరెక్టర్ వెట్రిమారన్ నిర్మాతగా నిర్మించిన గరుడన్ సినిమాకు తెలుగులో రీమేక్‌గా భైరవం తెరకెక్కింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముగ్గురు హీరోలతో చేయడంపై నారా రోహిత్ కామెంట్స్ చేశాడు.

ఒరిజినల్‌గా ఇది వెట్రిమారన్ కథ.. ముగ్గురు హీరోలతో సినిమా చేయడం అంత ఈజీ కాదు.. హీరో నారా రోహిత్ కామెంట్స్

తమిళంలో వెట్రిమారన్‌కు డైరెక్టర్‌గా ఎంతో పేరు ఉంది. అలాంటి వెట్రిమారన్ నిర్మాతగా వ్యవహరించి సాలిడ్ హిట్ అందుకున్న సినిమా గరుడన్. ఈ మూవీని తెలుగులో రీమేక్‌గా తెరకెక్కించిన సినిమా భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవం మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించారు.

మే 30న థియేటర్లలో

అదితి శంకర్ హీరోయిన్‌గా నటించిన భైరవం సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మాతగా వ్యవహరించి నిర్మించారు. పెన్ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పించిన భైరవం మే 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వెట్రిమారన్, నిర్మాత రాధామోహన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నారా రోహిత్ ఇతర సినీ విశేషాలను పంచుకున్నాడు.

జయసుధ గారి క్యారెక్టర్ గురించి?

-ఇందులో జయసుధ గారు బామ్మ క్యారెక్టర్ చేశారు. జయసుధ గారు లెజెండరీ. సార్ వచ్చారు తర్వాత వారితో వర్క్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది.

ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది ?

-నేను యాక్షన్ సినిమాలు చేశాను కానీ ఇంత కమర్షియల్ మాస్ ఫిలిం నేనెప్పుడూ చేయలేదు. ఇది నాకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్. ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

-ఈ సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకి మేజర్ హైలైట్. చాలా రోజుల తర్వాత ఇంత హెవీ యాక్షన్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. మేము ముగ్గురు కలిసి చేసిన ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్‌కి చాలా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది .

తెలుగు కోసం ఎలాంటి మార్పులు చేశారు?

-స్టోరీ లైన్ అదే ఉంటుంది. అయితే తెలుగులోకి వచ్చేసరికి ప్రతి సీన్‌ని రీరైట్ చేసాం. మన నేటివిటీకి తగ్గట్టు సినిమా ఉంటుంది. సినిమా మీరు చూస్తున్నప్పుడు ఒరిజినల్ కంటే మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.

హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి?‌

-ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ ఉండదు. ఒరిజినల్‌గా ఇది వెట్రిమారన్ గారి కథ. ప్రతి పాత్రకి కథలో చాలా కీలక పాత్ర ఉంటుంది.

నిర్మాత రాధా మోహన్ గారి గురించి?

-రాధా మోహన్ గారి లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. ముగ్గురు హీరోలతో ఒక సినిమా చేయడం అంత ఈజీ కాదు. ఎక్కడ రాజీ పడకుండా సినిమా తీశారు. ఆయనకి ఈ సినిమాతో పెద్ద సక్సెస్ రావాలని భారీగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024