పాక్‌లో పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి.. అణుపరీక్షల వార్షికోత్సవ ర్యాలీలో నేతలతో పాల్గొన్న ఉగ్రవాదులు

Best Web Hosting Provider In India 2024


పాక్‌లో పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి.. అణుపరీక్షల వార్షికోత్సవ ర్యాలీలో నేతలతో పాల్గొన్న ఉగ్రవాదులు

Anand Sai HT Telugu

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మందిని దారుణంగా హతమార్చారు. ఈ దాడికి సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా కమాండర్ పాకిస్థాన్‌లో జరిగిన ర్యాలీలో కనిపించాడు.

పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి

హల్గామ్ ఉగ్రదాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత దాడి సూత్రధారి సైఫుల్లా కసూరి బహిరంగంగా ప్రత్యక్షమయ్యాడు. లష్కరే తోయిబా కమాండర్ అయిన సైఫుల్లా ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నాడు. లష్కరే తదుపరి వారసుడిగా భావిస్తున్న హఫీజ్ సయీద్ కుమారుడు కూడా సైఫుల్లా వెంట ఉన్నాడు. ఉగ్రవాదులతో బహిరంగంగా వేదిక పంచుకుంటున్న పలువురు పాక్ నేతలు కూడా ఈ ర్యాలీలో కనిపించారు.

పాకిస్థాన్‌ అణుపరీక్షల వార్షికోత్సవం సందర్భంగా పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఏటా యూమ్-ఇ-తక్బీర్ గా జరుపుకొంటారు. ఈ సంబరాల్లో భాగంగా ఈ ర్యాలీ కూడా జరిగింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులు భారత్‌పై విషం చిమ్మారు. ఈ ర్యాలీలో భారత్ వ్యతిరేక నినాదాలు చేశారు.

తనను పహల్గాం ఉగ్రదాడికి మాస్టర్‌మైండ్‌గా చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాను అని కసూరి వ్యాఖ్యానించాడు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ దాడిలో మృతి చెందిన ఉగ్రవాది ముదస్సిర్ అహ్మద్ పేరిట పంజాబ్ ప్రావిన్స్‌లో నిర్మాణాలు చేపడుతానని చెప్పాడు.

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్న తల్హా సయీద్ కూడా పాకిస్థాన్‌లో జరిగిన ఈ భారత్ వ్యతిరేక ర్యాలీలో జిహాదీ నినాదాలు చేశాడు. తల్హా సయీద్ పాకిస్థాన్ ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. గత కొన్ని వారాలుగా భారత్ వ్యతిరేక ప్రచారాన్ని తీవ్రతరం చేస్తున్నాడు. కొన్ని రోజులుగా పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాల్లో భారత్ కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తోంది. ఇతడి తండ్రి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్.

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మందిని అతి కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మతం అడిగిన తర్వాత కాల్పులు జరిపారు. లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే గ్రూపు ఈ దాడికి పాల్పడింది. ఆ తర్వాత పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఆపరేషన్ సిందూర్ కింద పలు ఉగ్రవాద స్థావరాలను భారత్ కూల్చివేసింది. ఈ ఆపరేషన్‌లో భారత సాయుధ దళాలు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link