పీఓకేను పాకిస్థాన్ ఖాళీ చేసినప్పుడే జమ్మూకశ్మీర్‌పై చర్చలు : విదేశాంగ మంత్రిత్వ శాఖ

Best Web Hosting Provider In India 2024


పీఓకేను పాకిస్థాన్ ఖాళీ చేసినప్పుడే జమ్మూకశ్మీర్‌పై చర్చలు : విదేశాంగ మంత్రిత్వ శాఖ

Anand Sai HT Telugu

పాకిస్థాన్‌తో సంబంధాల విషయానికొస్తే భారత్ వైఖరి స్పష్టంగా ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఏ సంబంధం అయినా ద్వైపాక్షికంగా ఉండాలన్నారు. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవని స్పష్టం చేశారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్

పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉగ్రవాద వ్యతిరేక అంశాలపై చర్చించడం సహా భారతదేశంతో చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌కు స్పష్టమైన సమాధానం ఇచ్చింది.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్‌తో మా సంబంధాల విషయానికొస్తే, మా వైఖరి పూర్తిగా స్పష్టంగా ఉంది. ఏదైనా సంబంధం ద్వైపాక్షికంగా ఉండాలి. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవని పునరుద్ఘాటించాలనుకుంటున్నాం.’ అని రణధీర్ జైస్వాల్ అన్నారు.

పీఓకే ఖాళీ చేయాలి

‘పాకిస్థాన్ ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించాల్సి ఉంటుంది. వారి రికార్డులు, జాబితాను మేం కొన్ని సంవత్సరాల క్రితం వారికి అప్పగించాం. ఇది కాకుండా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ పూర్తిగా ఖాళీ చేసినప్పుడు, పాకిస్థాన్ ఈ ప్రాంతాన్ని మనకు అప్పగించినప్పుడు మాత్రమే జమ్మూకశ్మీర్‌పై చర్చలు జరుగుతాయి.’ అని జైస్వాల్ అన్నారు.

సింధు జల ఒప్పందం

పాకిస్థాన్‌తో సింధు జల ఒప్పందం విషయానికొస్తే.. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానేసే వరకు నిలిపివేయబడుతుందని జైస్వాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా, ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవవని మరోసారి స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో జరిగిన ఏ చర్చల్లోనూ వాణిజ్యం లేదా సుంకం అంశాన్ని లేవనెత్తలేదన్నారు.

ఇరాన్‌లో తప్పిపోయిన భారతీయులు

ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయ పౌరుల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. ‘ఇరాన్‌కు వెళ్లిన ముగ్గురు భారతీయ పౌరులను రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తిరిగి రావడానికి ప్రయత్నించమని కోరింది. మేము అక్కడి నుండి ప్రభుత్వంతో కూడా సంప్రదిస్తున్నాం. నేను వారి కుటుంబంతో కూడా టచ్‌లో ఉన్నాను. మాకు ఇరాన్ వైపు నుండి మంచి సహకారం లభిస్తోంది. తప్పిపోయిన వ్యక్తుల కుటుంబాలతో కూడా మేం సంప్రదిస్తున్నాం.’ అని ఆయన అన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link