




Best Web Hosting Provider In India 2024

కాలిఫోర్నియాలో మినీ మహానాడు-2025 గ్రాండ్ సక్సెస్!
యూఎస్లోని కాలిఫోర్నియాలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి నిర్వహించారు. దీనితోపాటుగా టీడీపీ మినీ మహానాడు-2025 కార్యక్రమం ఘనంగా చేశారు.
ీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలతో పాటు మినీ మహానాడు-2025 కార్యక్రమం కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్లో ఘనంగా నిర్వహించారు. బే ఏరియాలోని భీమవరం రుచులు బాంకెట్ హాల్లో బుధవారం రాత్రి 7 గంటలకు మొదలైంది. ఈవెంట్ను ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని నిర్వహించారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆ తర్వాత ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు వర్చువల్గా హాజరయ్యారు.
ఎన్నారై టీడీపీ యూఎస్ కో ఆర్డినేటర్ జయరాం కోమటి తదితరులు గెస్ట్ స్పీకర్లుగా వర్చువల్గా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఎన్నారైలు తరలి రావడం సంతోషంగా ఉందని జయరాం కోమటి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి సత్తా చాటడానికి కారణం ఎన్టీఆర్ అని ప్రశంసించారు. ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడిచిన చంద్రబాబు ఐటీ రంగానికి ఊతమిచ్చారన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంపై తెలుగు వారు చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు.
అమెరికాలో మినీ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని ఏపీ ఎన్నార్టీ ఛైర్మన్ డాక్టర్ రవి వేమూరు అన్నారు. తెలుగు జాతి తలెత్తుకొని తిరిగేలా చేసిన ఘన ఎన్టీఆర్దని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు తమ వంతు కృషి చేస్తామని, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అడుగుజాడల్లో నడుస్తామని అన్నారు.
నవ్యాంధ్ర అభివృద్ధికి ఎన్నారైలు తమ వంతు సహకారం అందిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. భవిష్యత్తులో ఏవిధమైన సహాయసహకారాలు అందించబోతున్నారనే విషయాలపై ఎన్నారైలతో మాట్లాడారు. ఎన్నారైలు ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. బీసీలకు బ్యాక్ బోన్ గా నిలిచిన పార్టీ టీడీపీ అని, సీఎం చంద్రబాబు సారథ్యంలో ఎన్టీఆర్ ఆశయాల సాధనకు పాటుబడతామని ఎంపీ పంచలింగాల నాగరాజు అన్నారు.
అమెరికాలో మినీ మహానాడులో పాల్గొనడం సంతోషంగా ఉందని తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లా, తుడా పరిధిలో జరిగిన భూ కబ్జాలకు సంబంధించి ఎన్నారైలకు ఏవైనా సమస్యలుంటే తన కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
మంత్రి లోకేష్ ప్రతిపాదించిన 6 శాసనాలు : 1. తెలుగుజాతి విశ్వఖ్యాతి, 2. యువగళం, 3. స్త్రీ శక్తి, 4. పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5. అన్నదాతకు అండగా, 6. కార్యకర్తే అధినేత, సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ-4 కార్యక్రమానికి ఎన్నారైల సహకారం, ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని విజ్ఞప్తి…వంటి 8 అంశాలతో ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆ తీర్మానానికి సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు, తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి బుచ్చి రాం ప్రసాద్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న, ఎన్నారై టీడీపీ అధ్యక్షులు, ఏపీ ఎన్నార్టీ ఛైర్మన్ డాక్టర్ రవి వేమూరు, ఎన్నారై టీడీపీ యూఎస్ కో ఆర్డినేటర్ జయరాం కోమటి తదితరులు వర్చువల్గా హాజరయ్యారు.
టాపిక్