





Best Web Hosting Provider In India 2024

230 కోట్ల మలయాళ థ్రిల్లర్.. ఓటీటీలోకి వచ్చేసిన థియేటర్లను షేక్ చేసిన తుడరుమ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళం సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అందులోనూ థ్రిల్లర్ సినిమాలు అంటే ఆడియన్స్ తెగ లైక్ చేసేస్తారు. ఇప్పుడు అలాంటి బ్లాక్ బస్టర్ మలయాళ థ్రిల్లర్ మూవీ తుడరుమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (మే 30) నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
మోహన్లాల్ కెరీర్లోనే దృశ్యం సినిమాకు స్పెషల్ ప్లేస్ ఉంది. ఆ మూవీ ఇచ్చే థ్రిల్ అలాంటిలాంటిది కాదు. ఇప్పుడు దృశ్యం సినిమాలాంటి మరో సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ ‘తుడరుమ్’. పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లకు వచ్చి ప్రపంచ స్థాయిలో అదరగొట్టడమే కాకుండా కేరళ బక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు రాబట్టిన సినిమా తుడరుమ్. థియేటర్లలో అదరగొట్టిన ఈ మోహన్లాల్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
ఓటీటీలోకి మోహన్లాల్ సినిమా
ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మోహన్లాల్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తుడరుమ్’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (మే 30) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. పెద్దగా హైప్ లేకుండా రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. దీంతో కలెక్షన్లు కుమ్మేసింది.
ఎక్కడ చూడొచ్చంటే?
బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డు నెలకొల్పిన తుడరుమ్ సినిమాను జియోహాట్స్టార్ ఓటీటీలో చూడొచ్చు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను అదే ఓటీటీ ప్లాట్ ఫామ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. జియోహాట్స్టార్లో ఈ రోజు నుంచి తుడరుమ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ మలయాళంతో పాటు తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ చూడొచ్చు.
రికార్డు కలెక్షన్లు
తుడరుమ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు రాబట్టింది. కేరళ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న మలయాళ సినిమాగా నిలిచింది. అలాగే కేరళలో రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఫస్ట్ మలయాళం మూవీ కూడా ఇదే. కేరళలో 50 కోట్ల షేర్ సాధించిన తొలి మూవీ కూడా ఇదే కావడం విశేషం.
ఇక ప్రపంచవ్యాప్తంగా 30 రోజుల్లో ఈ సినిమా రూ.230.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. కేరళలోనే రూ.115.25 కోట్లు సొంతం చేసుకుంది. ఇండియాలో 30 రోజుల్లో సుమారు రూ.120 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది తుడరుమ్.
కథ ఏమిటంటే?
ఎల్2 ఎంపురాన్ తర్వాత తుడరుమ్ తో మోహన్ లాల్ వరుసగా రెండో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు. పోయిన తన ట్యాక్సీని వెతుక్కుంటూ షణ్ముగం ‘బెంజ్’ ఎంతవరకు వెళతాడు అనేది సినిమా కథాంశం. దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత మోహన్ లాల్ తో కలిసి నటి శోభన తెరపై కలిసి నటించడం విశేషం. ఈ మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కు కొదవే లేదు.
సంబంధిత కథనం