





Best Web Hosting Provider In India 2024

పైల్స్తో బాధపడేవారు ఈ 5 ఆహారాలను తినకూడదు! ఎందుకు తెలుసా?
మీరు పైల్స్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ 5 ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవడం పెద్ద తప్పు. ఇవి మీ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. పైల్స్ ఉన్నప్పుడు ఏమి తినాలి, ఏమి తినకూడదు వంటి విషయాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.
పైల్స్ లేదా మొలలు అనేది చాలా మందికి ఇబ్బంది కలిగించే ఒక సాధారణ సమస్య. ఈ వ్యాధితో బాధపడేవారికి మలద్వారం చుట్టూ వాపు, నొప్పి ఉంటుంది. పైల్స్ ఉన్నప్పుడు నొప్పి, దురద, మల విసర్జన సమయంలో రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య ఉన్నవాళ్లు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే, కొన్ని ఆహారాలు మలబద్ధకాన్ని పెంచి, పైల్స్ లక్షణాలను మరింత తీవ్రం చేస్తాయి.
ఇది ప్రధానంగా ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. మలబద్ధకం వల్ల మల విసర్జన కష్టమై, ఎక్కువ ఒత్తిడి పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల పైల్స్ మరింత ఉబ్బి, నొప్పి పెరుగుతుంది. అందుకే, పైల్స్ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. అవి ఏంటి, ఎందుకు తినకూడదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నిపుణులు పైల్స్ రోగులు ఎల్లప్పుడూ ఫైబర్తో సమృద్ధిగా ఉండే నీటితో నిండిన, సహజ లూబ్రికెంట్తో కూడిన ఆహారాలను తినమని సూచిస్తారు. దీనివల్ల మలం మెత్తగా ఉండి నొప్పి తగ్గుతుంది. కానీ, పైల్స్ రోగులు ఆరోగ్యకరమైనవి అనుకుంటూ కొన్ని ఆహారాలను తీసుకుంటారు, అవి వారి సమస్యను మరింత పెంచుతాయి. కాబట్టి పైల్స్ రోగులు ఏమి తినాలి, ఏమి తినకూడదో తెలుసుకుని తినడం చాలా ముఖ్యం.
పైల్స్ రోగులు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి..
1. మసాలా ఆహారం
పైల్స్ సమస్య కలిగిన వారు దూరంగా పెట్టాల్సిన ఆహారాల్లో ముఖ్యమైనది మసాలా ఆహారం. ఇవి పైల్స్లో మంట, నొప్పిని పెంచుతాయి. ఎక్కువ కారం, మసాలా మంటను కలిగిస్తుంది.
2. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్
పిజ్జా, బర్గర్లు, చిప్స్, మైదా వంటి తక్కువ ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు మలబద్ధకాన్ని కలిగిస్తాయి. ఇవి మలాన్ని గట్టిగా చేసి మలవిసర్జనను కష్టతరం చేస్తాయి.
3. ఎక్కువ ఉప్పుతో కూడిన ఆహారం
పైల్స్ రోగులు ఎక్కువ ఉప్పును తీసుకోకూడదు. ఎందుకంటే ఉప్పు నీటిని గ్రహించి మలాన్ని గట్టిగా చేస్తుంది. ఉప్పు, అవకాయ, డబ్బాల్లో ఉన్న ఆహార పదార్థాలు పైల్స్ రోగుల ఆరోగ్యానికి హానికరం. ఇవి మలబద్ధకాన్ని పెంచుతాయి.
4. మాంసాహారం, అధిక ప్రోటీన్
మాంసం, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల మలబద్ధకం వస్తుంది. ఇది పైల్స్ రోగులకు మంచిది కాదు.
5. అరటిపండ్లు, జామపండ్లు
కొన్ని పండ్లలో టానిన్స్ లేదా గట్టి ఫైబర్ ఉంటుంది. అవి మలబద్ధకాన్ని పెంచుతాయి. ఈ రకమైన పండ్లలో ముఖ్యంగా పచ్చి అరటిపండ్లు, మరియు గింజలున్న జామపండ్లు ఉంటాయి. ఇవి మలం గట్టిగా మరేలా చేసి నొప్పి, వాపును పెంచుతాయి.
పైల్స్ రోగులు ఎలాంటి ఆహారాలు తింటే మంచిది?
ఫైబర్తో కూడిన ఆహారం
మొలల సమస్యతో బాధపడేవారు ఫైబర్తో సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఫైబర్ మలాన్ని మెత్తగా చేసి మలవిసర్జనను సులభతరం చేస్తుంది, దీనివల్ల పైల్స్లో ఉపశమనం లభిస్తుంది. దీనికి మీరు సాధారణ ధాన్యాలు ఉదా: ఓట్స్, బ్రౌన్ రైస్, పప్పులు, మొక్కజొన్న, శనగలు, ఆపిల్, పియర్స్, క్యారెట్, బ్రోకలీ, పాలకూర తీసుకోవచ్చు. ఈ ఆహారాల్లోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
పండ్లు, కూరగాయలు
కివి, పపాయి, దోసకాయ, గుమ్మడికాయ, శనగలు వంటి తాజా పండ్లు, కూరగాయలు నీరు, ఫైబర్తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మలాన్ని మెత్తగా చేసి వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
ప్రోబయోటిక్స్
పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్ కలిగిన ఆహారాలు ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
నూనెలు
ఆలివ్ ఆయిల్ లేదా అలసీడ్ ఆయిల్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇది ప్రేగులకు సున్నితత్వాన్ని అందిస్తుంది.
నీరు, ద్రవాలు
తగినంత నీరు, ఇతర ద్రవాలు వంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఫైబర్తో సమృద్ధిగా ఉండే పండ్లు తగినంత నీరు త్రాగినప్పుడే ప్రభావం చూపుతాయి. నీటి కొరత ఫైబర్ను మలబద్ధకాన్ని కలిగించి నొప్పి, వాపు సమస్యను పెంచుతుంది.
టాపిక్