తెలంగాణలోని రైతులకు శుభవార్త – అసైన్డ్ భూములకు పట్టాలు…! కీలక ప్రకటన

Best Web Hosting Provider In India 2024

తెలంగాణలోని రైతులకు శుభవార్త – అసైన్డ్ భూములకు పట్టాలు…! కీలక ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

అసైన్డ్ భూముల పట్టాలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని చెప్పారు. భూభారతి లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులు ఉంటాయని చెప్పారు.

అసైన్డ్ భూముల పట్టాలు – మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

భూభారతి లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నారు. జూన్ 20 వరకు అన్ని రెవెన్యూ గ్రామాలలో తహసిల్దార్ల ఆధ్వర్యంలో ఈ సదస్సులను జరుపుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ సదస్సుల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు సూచించారు.

అసైన్డ్ భూముల పట్టాలపై ప్రకటన…

గురువారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లోని పలువురు మంత్రులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొంగులేటి…. అసైన్డ్ భూముల పట్టాలపై కీలక ప్రకటన చేశారు.

అసైన్డ్ భూములలోసాగు చేసుకుంటున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని పొంగులేటి చెప్పారు. అంతేకాకుండా…. సాదా బైనామా సంబంధించి ప్రభుత్వ భూములకు కూడా కొంతమంది దరఖాస్తులు చేసుకున్నారని…. వీటిని తక్షణమే తిరస్కరించాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు నుంచి స్టే తొలగిన వెంటనే అర్హత ఉన్న సాదా బైనామాలను పరిష్కరించాలని సూచించారు.

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు….

“దేశంలో ఎక్కడా కూడ పేదలకు ఇంటి నిర్మాణానికి, ఏ ప్రభుత్వం 5లక్షల రూపాయలు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ మాత్రమే ఇస్తుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదవారి కోసం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఒత్తిడులకు లోనై అనర్హులకు ఎక్కడైనా ఇండ్లు మంజూరు చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాము. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలి” అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

“ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పెట్టుబడి సొమ్ము లేకపోతే మహిళా సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయాలి. జూన్ 10 లోపు పైలెట్ ప్రాజెక్టు క్రింద మంజూరు చేసిన ఇండ్లు గ్రౌండింగ్ పూర్తి కావాలి. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు కోసం అవసరమైన ఇసుక లబ్దిదారులకు టోకెన్ ద్వారా ఉచితంగా అందించాలి. నీటి పారుదల శాఖ పరిధిలో పెండింగ్ ఆపరేషన్ అండ్ మేయింటెనెన్స్ పనులు ప్రాధాన్యత క్రమంలో చేపట్టి పూర్తి చేయాలి” అని సూచించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Ponguleti Srinivas ReddyTelangana NewsTrending TelanganaTelangana Bhu BharatiKhammam
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024