ఫ్రాన్స్‌లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం.. నిబంధనను ఉల్లంఘిస్తే భారీగా జరిమానా

Best Web Hosting Provider In India 2024


ఫ్రాన్స్‌లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం.. నిబంధనను ఉల్లంఘిస్తే భారీగా జరిమానా

Anand Sai HT Telugu

ఫ్రాన్స్‌లో బీచ్‌లు, పార్కులు, పాఠశాలల చుట్టుపక్కల ప్రాంతాల్లో ధూమపానం నిషేధించారు. భవిష్యత్ తరాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం చాలా ముఖ్యమని ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది.

ఫ్రాన్స్‌లో ధూమపానం నిషేధం (shutterstock)

ఫ్రాన్స్‌లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించారు. భవిష్యత్ తరాల భద్రత దృష్ట్యా రద్దీగా ఉండే ప్రాంతాల్లో సిగరెట్లు కాల్చడాన్ని ఫ్రాన్స్ నిషేధించబోతోందని ఫ్రాన్స్ ఆరోగ్య, కుటుంబ మంత్రి కేథరిన్ వాట్రిన్ ఇటీవల చెప్పారు. ఈ ప్రదేశాలలో బస్టాపులు, పార్కులు, బీచ్‌లు, రెస్టారెంట్లు, పాఠశాల పరిసరాలు ఉన్నాయి. జూలై 1 నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఆస్టిన్ ఫ్రాన్స్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేథరిన్ వాట్రిన్ తెలిపారు. గత ఏడాది ప్రారంభంలో బ్రిటన్ కూడా ధూమపానంపై ఇలాంటి నిషేధాన్ని విధించింది.

పిల్లలు ఉన్న చోట సిగరెట్లు వాడకూడదని ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి చెప్పారు. ధూమపానం కారణంగా ఫ్రాన్స్‌లో ప్రతిరోజూ సుమారు 200 మంది మరణిస్తున్నారని, ఇది భయానక సంఖ్య అని వాట్రిన్ అన్నారు. ఫ్రెంచ్ అబ్జర్వేటరీ ఫర్ డ్రగ్స్ అండ్ అడిక్టివ్ ట్రెండ్స్ ఈ నెలలో ప్రచురించిన నివేదిక ప్రకారం దేశంలో 18-75 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో దాదాపు పావు వంతు మంది ప్రతిరోజూ ధూమపానం చేస్తారు.

ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి 35 యూరోల (154 డాలర్లు) వరకు జరిమానా విధించవచ్చని ఆయన చెప్పారు. కేఫ్ టెర్రస్‌ను ఈ నిషేధం నుంచి మినహాయించవచ్చని ఆరోగ్య మంత్రి తెలిపారు.

మరొక నివేదిక ప్రకారం.. పొగాకు సంబంధిత సమస్యల కారణంగా ఫ్రాన్స్‌లో ప్రతి సంవత్సరం 75,000 మంది మరణిస్తున్నారు. అయితే భారత్‌లో దీనికి సంబంధించిన గణాంకాలు మరింత భయపెడుతున్నాయి. డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం పొగాకు వినియోగం వల్ల భారత్‌లో ఏటా 1.35 మిలియన్ల మంది మరణిస్తున్నారు. అంటే రోజుకు 3,699 మరణాలు, గంటకు 154 మరణాలు సంభవిస్తున్నాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link