జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 ఫలితాలపై బిగ్​ అప్డేట్​- ఆ రోజే విడుదల..

Best Web Hosting Provider In India 2024


జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 ఫలితాలపై బిగ్​ అప్డేట్​- ఆ రోజే విడుదల..

Sharath Chitturi HT Telugu

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 ఫలితాలు వచ్చే వారం విడుదల కానున్నాయి. ఐఐటీ జేఈఈ ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలు ఎప్పుడంటే..

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అలర్ట్​! జూన్​ 2, 2025న జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఐఐటీ కాన్పూర్​ వెల్లడించింది. ఫలితాలతో పాటు ఫైనల్​ ఆన్సర్​ కీని కూడా రిలీజ్​ చేయనున్నట్టు స్పష్టం చేసింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్​డ్​ 2025కు హాజరైన అభ్యర్థులు jeeadv.ac.in ఐఐటీ జేఈఈ అధికారిక వెబ్​సైట్​లో ఫలితాలను చూసుకోవచ్చు. జూన్​ 2 ఉదయం 10 గంటలకు రిజల్ట్ లింక్ యాక్టివేట్ అవుతుంది.

జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షను 2025 మే 18న నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరిగింది.

అభ్యర్థుల సమాధానాలు మే 22న, ప్రొవిజనల్ ఆన్సర్ కీని 2025 మే 26న విడుదల చేశారు. 2025 మే 27న అభ్యంతర విండోను మూసివేశారు.

జేఈఈ అడ్వాన్స్​డ్ రిజల్ట్ 2025: ఎలా చెక్ చేసుకోవాలి?

జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలను తెలుసుకోవాలంటే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.

1. jeeadv.ac.in జేఈఈ అడ్వాన్స్​డ్​ అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి.

2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజల్ట్ 2025 లింక్​పై క్లిక్ చేయండి.

3. అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

4. సబ్మీట్​ బటన్​పై క్లిక్ చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది.

5. రిజల్ట్ చెక్ చేసి పేజీని డౌన్​లోడ్ చేసుకోవాలి.

6. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసి పెట్టుకోండి.

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్​ కోసం చేరేందుకు నిర్వహించేదే ఈ జేఈఈ. దేశంలోని అత్యంత కఠిన పరీక్షల్లో ఇదొకటి. తొలుత మెయిన్స్​ నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారు అడ్వాన్స్​డ్​ పరీక్షకు అర్హత సాధిస్తారు. అడ్వాన్స్​డ్​ పరీక్షకు క్వాలిఫై అయిన వారికి ఐఐటీల్లో సీట్లు లభిస్తాయి.

మరోవైపు ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ టెస్ట్ 2025 కోసం ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 2న ప్రారంభమై జూన్ 3, 2025న ముగుస్తుంది. 2025 జూన్ 5న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సింగిల్ షిఫ్ట్​లో ఏఏటీ పరీక్ష నిర్వహించి, 2025 జూన్ 8న ఫలితాలను ప్రకటిస్తారు.

2025 జూన్ 3 నుంచి జోసా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్​డ్ అధికారిక వెబ్​సైట్​ని చూడాల్సి ఉంటుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link