బ్రహ్మముడి మే 31 ఎపిసోడ్: కళ్లు తిరిగిపడిపోయిన యామిని- రిసార్టులో రామ్‌తో ఫస్ట్ నైట్- వైదేహి ఉచ్చులో రాజ్- రాహుల్ చోరీ

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి మే 31 ఎపిసోడ్: కళ్లు తిరిగిపడిపోయిన యామిని- రిసార్టులో రామ్‌తో ఫస్ట్ నైట్- వైదేహి ఉచ్చులో రాజ్- రాహుల్ చోరీ

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ మే 31 ఎపిసోడ్‌లో కావ్యకు రాజ్ లవ్ ప్రపోజ్ చేయకుండా యామిని తల్లి వైదేహి కాల్ చేస్తుంది. యామిని కళ్లు తిరిగి పడిపోయిందని చెప్పడంతో రాజ్ ఇంటికి వెళ్తాడు. నీవల్లే తినకుండా డిప్రెషన్‌లోకి వెళ్లిందని, రిసార్టుకు తీసుకెళ్లమని వైదేహి రామ్ దగ్గర మాట తీసుకుంటుంది. రాజ్ సరే అంటాడు.

బ్రహ్మముడి సీరియల్‌ మే 31వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యకు రాజ్ లవ్ ప్రపోజ్ చేస్తుండగా.. యామిని వైదేహి కాల్ చేస్తుంది. కానీ, రాజ్ కాల్ లిఫ్ట్ చేయడు. మళ్లీ రాజ్ చెప్పబోతుంటే కాల్ వస్తుంది. ఆంటీ ఏంటీ కట్ చేస్తున్న మళ్లీ చేస్తుందేంటీ అని రాజ్ అంటాడు. బాబు రామ్ అని వైదేహి అంటుంది. ఏమైంది ఆంటీ, ఎందుకు ఏడుస్తున్నారు అని రాజ్ అంటాడు.

కళ్లు తిరిగిపడిపోయిన యామిని

యామిని కళ్లు తిరిగిపడిపోయింది అని వైదేహి చెబుతుంది. ఇంట్లో ఉన్నాం, డాక్టర్ గారు వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వే తనను కాపాడగలవు అని వైదేహి అంటుంది. ఇప్పుడే వస్తున్నా అని రాజ్ అంటాడు. సారీ నేను వెళ్లాలి అని కావ్యకు చెప్పి వెళ్లిపోతాడు రాజ్. దాంతో ఇంట్లో వాళ్లంతా నిరాశపడతారు. ఇది కదా అసలు ట్విస్ట్ అంటే. ఆ యామిని అనుకున్నది అనుకున్నట్లు సాధించింది. రాజ్, కావ్య పర్మనెంట్‌గా విడిపోయినట్లే అని రుద్రాణి మాత్రం సంతోషిస్తుంది.

మరోవైపు నగలు చూస్తూ రాహుల్ సంతోషిస్తాడు. ఓ సంచిలో నగలన్నీ పెట్టుకుంటాడు. ఆ యామిని ఇచ్చిన షాక్‌కి ఇంట్లో అందరూ తేరుకోడానికి వారం రోజులు పడుతుంది. ఈ గ్యాప్‌లో ఈ నగల ప్లేసులో గిల్ట్ నగలు చేసి పెట్టొచ్చు అని నగలు ఎత్తుకెళ్తాడు రాహుల్. మరోవైపు యామినిని డాక్టర్ చూస్తుంటాడు. రాజ్ వస్తాడు. సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల స్పృహ తప్పి పోయారు. పర్లేదు అని చెప్పిన డాక్టర్ రాజ్‌ను పక్కకు తీసుకెళ్తాడు.

యామిని స్పృహ తప్పి పడిపోయింది ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కాదు. డిప్రెషన్ వల్ల. తను ఏదో విషయం బాధపడుతుంది. అదేంటో కనుక్కోండి. లేదంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది అని డాక్టర్ వెళ్లిపోతాడు. ఇంతలో యామిని తల్లిదండ్రులు వస్తే వారిపై అరుస్తాడు రాజ్. తనకు ఆ పరిస్థితి రాకపోడానికి కారణం ఫుడ్ కాదు నువ్వు అని యామిని తండ్రి అంటాడు.

ఎవరికి చెప్పుకోలేక

అప్పుడే ఆ మాటలను యామిని వింటుంది. మీరంటే దానికి ప్రేమే కాదు పిచ్చి ప్రాణం. మీరే ప్రపంచంగా బతికేది. ఇప్పటికీ అలాగే బతికేది. కానీ, దాన్ని మీరు అస్సలు పట్టించుకోవట్లేదు. మీరు ఇంకెవరో ప్రపంచం అన్నట్లు తిరిగారు. మీతో పెళ్లి అనేసరికి ఎంతో సంతోషించింది. కానీ, మీరు అర్థం చేసుకుంటే కదా. తన బాధ ఎవరికీ చెప్పుకోలేక ఇలా ఫుడ్ మీద చూపించింది అని వైదేహి అంటుంది.

నిజంగా మీకు ఈ పెళ్లి ఇష్టమైతే మీరు నాకు ఓ మాట ఇవ్వండి అని వైదేహి అంటుంది. దాంతో రాజ్ మాటిస్తాడు. నా కూతురును రెండు రోజులు ఎటైనా తీసుకెళ్లండి. సంతోషించేలా చేయండి. అది కూడా రేపే అని వైదేహి అంటుంది. రేపా, రేపు నాకు అర్జంట్ వర్క్ ఉంది అని రాజ్ అంటాడు. నా కూతురు కంటే ముఖ్యమైనదా. నీకు కాబోయే భార్య ఆరోగ్యం కంటే ముఖ్యమైన పనా. వద్దులే బాబు దాని కర్మ ఇంతే అనుకుని మేమే ఎక్కడికైనా తీసుకెళ్తాం అని వైదేహి అంటుంది.

మీరు ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి కాదని, మేమే నచ్చజెప్పుకుంటాం అని వైధేహి అంటుంది. యామినిని నేనే బయటకు తీసుకెళ్తాను అని రాజ్ అంటాడు. మాకు తెలిసిన రిసార్ట్ ఉంది. అది బుక్ చేస్తాను. అక్కడికి వెళ్లండి అని యామిని తండ్రి అంటాడు. యామిని దగ్గరికి వైధేహి, తండ్రి వెళ్లి అనుకుంది సాధించామని సంతోషిస్తారు. అలా వైదేహి, యామిని, తండ్రి ముగ్గురు కలిసి పన్నిన ఉచ్చులో రాజ్ పడిపోతాడు.

కావ్యను ఓదార్చుదాం

మరోవైపు ఇంటి వాకిట్లో కావ్య కావ్య అటు ఇటు తిరిగుతుంది. రాజ్ ప్రపోజ్ చేయకుండా వెళ్లాడని ఎంతలా బాధపడుతుందో చూడు అని ఇందిరాదేవి అంటుంది. నోటి కాడి ముద్ద నేలరాలితే ఎవరికి మాత్రం బాధ ఉండదు. ఆ ముదనష్టపు యామిని కరెక్ట్‌గా ప్రపోజ్ చేసే టైమ్‌లోనే కాల్ చేయకుంటే అయిపోయేదిగా అని అపర్ణ అంటుంది. సరే కావ్యను ఓదార్చుదాం పదా అని ఇందిరాదేవి అంటుంది.

ముగ్గురు రాజ్ గురించి మాట్లాడుకుంటారు. రాజ్ గురించి నేను బాధపడట్లేదు. ఐస్ క్రీమ్ రావట్లేదని చూస్తున్నా అని కావ్య అంటుంది. దాంతో ఇందిరాదేవి, అపర్ణ షాక్ అవుతారు. ఆయన ఈరోజు ప్రపోజ్ చేయకున్నా ఏదో ఒక రోజు చేస్తారు. నా భర్త మళ్లీ నా దగ్గరికి వచ్చి చేరుతారు అని కావ్య వెళ్లిపోతుంది. రాజ్ ఫోన్ చేశాడా లేదా అని ధాన్యలక్ష్మ వచ్చి అడుగుతుంది.

అది నేను చూసుకుంటా కానీ, ముందు అప్పు, కల్యాణ్‌ను శోభనం గదిలోకి పంపించు అని పంపిస్తుంది ఇందిరాదేవి. ఇంతలో రాజ్ కాల్ చేస్తాడు. ఏమైందని ఇందిరాదేవి అడిగితే.. యామిని స్పృహ తప్పి పడిపోయిందని రాజ్ చెబుతాడు. అదే పోవడం పైకి పోతే దరిద్రంపోయేది. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే రాజ్ పర్లేదంటుంది. కావ్య బాధ గురించి చెబుతుంది ఇందిరాదేవి.

నిలదీసిన ఇందిరాదేవి

చెబుదామనుకున్నా. కానీ, అంతా స్పాయిల్ అయింది. రేపు నేను రాలేను. రేపు రిసార్ట్‌కు తీసుకెళ్తున్నా అని జరిగింది చెబుతాడు రాజ్. మనసులో ఒక అమ్మాయిని పెట్టుకుని మరొకరితో ఎలా వెళ్తావ్ అని నిలదీస్తుంది ఇందిరాదేవి. రిసార్టుకు తీసుకెళ్తానని మాటిచ్చాను అని రాజ్ కాల్ కట్ చేస్తాడు. యామిని ఏదో ప్లాన్ చేసినట్లుంది. రాజ్‌ను తీసుకుని రిసార్ట్‌కు వెళ్తుందట అని అపర్ణకు ఇందిరాదేవి చెబుతుంది.

మరోవైపు రిసార్టులో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని ఫోన్‌లో చెబుతుంది యామిని. అది చూసి వైదేహి షాక్ అవుతుంది. అసలు నీ ప్లాన్ ఏంటీ, రామ్‌ను ఏం చేయబోతున్నావ్ అని వైధేహి అడుగుతుంది. బావను నా సొంతం చేసుకోబోతున్నాను. బావతో రేపు నాకు శోభనం జరుగబోతుంది అని యామిని అంటుంది. నీ బొందనే. ఇదేం పిచ్చి పని. పెళ్లి కాకముందే ఫస్ట్ నైట్ ఏంటే అసహ్యంగా, వెంటనే ఇది ఆపేయ్ అని తల్లి వైదేహి అంటుంది.

నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ చాలా ఆలస్యం చేశాను. అమృతం లాంటి బావ ప్రేమ విషంలా మారకముందే నేను బావను నాదాన్ని చేసుకోవాలి. బ్లాక్ మెయిల్ చేసైనా సరే నేను బావతో తాళి కట్టించుకోవాలి. అలా జరగాలంటే ఇప్పుడు నేను ఇలాంటి స్టెప్ తీసుకోక తప్పదు . బావ లేకుండా ఉండలేను. కావాలనే బావకు యాక్సిడెంట్ చేసి గతం మర్చిపోయేలా చేశాను. భార్యాభర్తలను విడగొట్టాను అని యామిని అంటుంది.

రాజ్‌తో యామిని శోభనం

ఇంత చేసింది ఎందుకు తనతో జీవితం పంచుకోడానికే. బావ నా చేయి జారిపోతాడేమో అని భయంగా ఉంది. చేయి జారిపోకుండా బావ నా గుప్పిట్లో ఉండేందుకే ఇలా చేస్తున్నా. రేపు నాకు శోభనం జరిగితే ఆ కావ్య జోలికి వెళ్లడు. తప్పు చేశానన్న గిల్టీతో అయినా తప్పనిసరిగా నా మెడలో మూడు ముళ్లు వేస్తాడు. ఆ కావ్య మెడకు ఉరితాడుగా మారుస్తాడు అని యామిని వెళ్లిపోతుంది.

దాంతో వైదేహి కంగారుపడుతుంది. మరోవైపు శోభనం గదిలో అప్పు, కల్యాణ్ ఉంటారు. మెసేజ్ రావడంతో అప్పు ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అది చూసి కల్యాణ్ షాక్ అవుతాడు. మరోవైపు రామ్‌ను యామిని రిసార్ట్‌కు తీసుకెళ్తుంది. అక్కడ ఫస్ట్ నైట్ అయ్యేలా ప్లాన్ చేస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024