




Best Web Hosting Provider In India 2024
పులితో ఆటలాడితే ఇంతే! సెల్ఫీ దిగుతున్న టూరిస్ట్పై దాడి- ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
అటవీ జంతువులతో ఆటలు ఎప్పుడూ ప్రమాదకరమే! తాజాగా జరిగిన ఒక సంఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఓ వ్యక్తి పులిని పెట్ చేస్తూ, సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ పులి అతనిపై దాడి చేసింది. ఒళ్లు గగుర్పొడిచే వీడియోని ఇక్కడ చూడండి..
థాయ్లాండ్కి చెందిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అయ్యింది. ఓ యానిమల్ పార్కులోని ఓ పులి.. ఓ టూరిస్ట్పై అకస్మాత్తుగా దాడి చేసింది. పులితో అతను సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోని చూసిన వారందరు షాక్ అవుతున్నారు. అటవీ జంతువులతో ఇలాంటి పనులు చేస్తే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.
టూరిస్ట్పై పులి దాడి..
ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ప్రత్యక్షమైన ఈ వీడియోలో ఒక భారతీయ టూరిస్ట్, ఒక పులి, కర్ర పట్టుకున్న ఒక గైడ్ కనిపిస్తున్నారు. ఆ టూరిస్ట్ మోకరిల్లి పులిని పెట్ చేస్తూ ఫోటోకు ఫోజులు ఇవ్వడం మొదలుపెట్టాడు. కానీ అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ పులు.. అకస్మాత్తుగా అతనిపై దాడికి దిగింది. ఇదంతా వీడియోలో రికార్డు అయ్యింది. ఆ వెంటనే వీడియో కట్ అయ్యింది కానీ, బాక్గ్రౌండ్లో టూరిస్ట్ అరుపులు వినొచ్చు. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో, ఆడియోతో భయపడటం ఖాయం!
“థాయ్లాండ్లో ఓ భారతీయుడిపై పులి దాడి చేసింది. పులులను పెంపుడు జంతువుల్లా పెంచుకునే ప్రదేశాల్లో ఇదొకటి. ప్రజలు సెల్ఫీలు తీసుకోవచ్చు, వాటికి ఆహారం ఇవ్వవచ్చు,” ఎక్స్ పోస్ట్ కింద క్యాప్షన్లో రాసి ఉంది.
పులి దాడి తర్వాత ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? అనేది తెలియరాలేదు. కాగా ఈ వీడియో ఇలాంటి వన్యప్రాణుల పర్యాటక ప్రదేశాల గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది.
సోషల్ మీడియాలో వైరల్గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :
ఈ ప్రదేశం ఫుకెట్లోని టైగర్ కింగ్ డమ్ అని తెలుస్తోంది. థాయ్లాండ్లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ఇది. ఇక్కడ సందర్శకులను పులులతో సన్నిహితంగా ఉండటానికి అనుమతిస్తారు. వీటిలో ఆహారం, నడక, సెల్ఫీలకు కూడా పోజులివ్వడం వంటివి ఉంటాయి.
ఈ ఘటనపై పలువురు కామెంట్స్ విభాగంలో తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
“క్యాట్స్కి శరీరం వెనుక భాగం, మరీ ముఖ్యంగా బట్ దగ్గర పెట్ చేస్తే నచ్చదు. ఈ వ్యక్తి పులిని అదే చోట నిరంతరం పెట్ చేశాడు. ఇది పులికి చిరాకు తెప్పించుండొచ్చు. అంత చిరాకులో ఉన్న పులితో సెల్ఫీ దిగాలని ప్రయత్నించినప్పుడు ఇలా జరిగి ఉండొచ్చు,” అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.
“ఈ వీడియోకు నా తక్షణ ప్రతిస్పందన ఒక భయంకరమైన సాక్షాత్కారం. అది నేను కావచ్చు! ఈ భయానక వీడియో ఒక ప్రమాదకరమైన ధోరణిని బహిర్గతం చేస్తుంది. చాలా మంది భారతీయ పర్యాటకులు థాయ్లాండ్లో పులులతో ప్రమాదకరమైన విధంగా ఫొటోలు దిగాలని చూస్తుంటారు. ఈ క్రూరమృగాలు ఇలా కనిపించడానికి భారీగా మత్తుమందు ఇస్తారు. కానీ వాటి నిజస్వరూపాన్ని మచ్చిక చేసుకోలేరు. మత్తు మసకబారినప్పుడు, పులి హింసాత్మకంగా మారుతుంది. తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది,” అని మరొకరు పేర్కొన్నారు.
ఓ యూజర్ కామెంట్ చేస్తూ.. ‘గతంలో నేను ఈ ప్రదేశానికి వెళ్లాను. ఫుకెట్లోని టైగర్ కింగ్డమ్ ఇది. ప్రజలపై దాడి చేయకుండా ఉండేందుకు పులులకు మత్తుమందు ఇస్తారు. ఇలా జరుగుతుందేమోనని ఎప్పుడూ భయపడతాను,” అని ఇంకొకరు అన్నారు.
ఈ సంఘటన జరిగిన ప్రదేశాన్ని హెచ్టీ తెలుగు, HT.com స్వతంత్రంగా ధృవీకరించలేదు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link