




Best Web Hosting Provider In India 2024

రూ. 6 వేల కోట్లు… 5 లక్షల మందికి ‘యువ వికాసం’ రుణాలు – ఈ 8 విషయాలు తెలుసుకోండి
స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు శ్రీకారం చుట్టింది. అర్హులైన వారికి జూన్ 2వ తేదీన మంజూరు పత్రాలను అందజేయనుంది. మొదటి విడత కింద రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నారు. ఈ స్కీమ్ కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకోండి….
రాజీవ్ యువ వికాసం స్కీమ్
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువకులకు అండగా నిలిచేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనుంది. లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లను అందజేయాలని నిర్ణయించింది.
యువ వికాసం స్కీమ్ – ముఖ్యమైన అంశాలు:
- తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. అన్ని జిల్లాల నుంచి కలిపి 16.22 లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారు.
- వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం….. ఈ ఏడాదికి 5 లక్షల మంది అర్హులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. దీని కోసం రూ.6,250 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో జూన్ 2న రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నిర్ణయించింది.
- ఈ స్కీమ్ లో మొత్తం నాలుగు కేటగిరిలు ఉన్నాయి రూ. 50 వేల వరకు 100 శాతం రాయితీ ఉంటుంది. ఇక రూ. లక్షల వరకు 90 శాతం, రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ.4 లక్షల వరకు శాతం సబ్సీడీ కింద రుణాలు మంజూరు చేయనున్నారు. బ్యాంక్ లింకేజీ తప్పనిసరి చేశారు.
- జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందిచనున్నారు. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో వారికి నైపుణ్యాలు మెరుగుపరచడానికి ప్రభుత్వంతో ఎంప్యానల్ చేసుకున్న సంస్థలు ఎంట్రప్రెన్యూరియల్షిప్ డెవలెప్మెంట్ ట్రైనింగ్ ఇస్తారు. జూన్ 16 నుంచి ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 2 నాటికి యూనిట్లన్నీ గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటారు.
- రాజీవ్ యువ వికాసం కింద లబ్ధిపొందనున్న 5 లక్షల మంది నిరుద్యోగలు ఎంఎస్ఎంఈ రంగంలో విభిన్న వ్యాపారాలను ప్రారంభించనున్నారు. తద్వారా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా వెనుకబడిన తరుగతుల సామాజిక-ఆర్థిక స్థితిగతులను సమూలంగా మారేందుకు దోహదపడుతుందని చెబుతోంది. రాష్ట్ర జీఎస్డీపీ మెరుగవడానికి కూడా దోహదం చేస్తుందని అంచనా వేస్తోంది.
- రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిపొందనున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాలకు చెందిన వారు 80 శాతం వరకు ఉన్నారు. బీసీలు అత్యధికంగా 31.44 శాతం, ఎస్సీలు 29.36 శాతం, ఎస్టీలు 19.59 శాతం ఉన్నారు.
- మొత్తం లబ్ధిదారుల్లో 25 శాతం మహిళలకు, 5% దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలో ప్రాధాన్యం ఇచ్చింది.
టాపిక్
Rajiv Yuva Vikasam SchemeTelangana NewsTrending TelanganaTg Welfare Schemes
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.