రీ-రిలీజ్‍ ఫస్ట్ డే కలెక్షన్లలో కుమ్మేసిన ఖలేజా.. కానీ గబ్బర్ సింగ్ తర్వాతే!

Best Web Hosting Provider In India 2024

రీ-రిలీజ్‍ ఫస్ట్ డే కలెక్షన్లలో కుమ్మేసిన ఖలేజా.. కానీ గబ్బర్ సింగ్ తర్వాతే!

ఖలేజా సినిమా రీ-రిలీజ్‍లో సత్తాచాటింది. మంచి వసూళ్లతో కుమ్మేసింది. తెలుగు రీ-రిలీజ్‍ల్లో ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్ల సాధించిన జాబితాలో రెండో ప్లేస్ దక్కించుకుంది. ఆ వివరాలు ఇవే..

రీ-రిలీజ్‍ ఫస్ట్ డే కలెక్షన్లలో కుమ్మేసిన ఖలేజా

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ఖలేజా సినిమాకు ఓ రేంజ్‌‍లో క్రేజ్ ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ చిత్రం 2010 అక్టోబర్‌లో రిలీజైంది. అప్పట్లో మిక్స్డ్ టాక్‍తో ఈ చిత్రం ప్లాఫ్ అయింది. ఆ తర్వాత టీవీల్లో వందలసార్లు ప్రసారమైనా ఈ సినిమా టీఆర్పీల్లో అదరగొట్టింది. కల్ట్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అంతటి హైప్ సాధించిన ఖలేజా సుమారు పద్నాలుగున్నరేళ్ల తర్వాత ఈ శుక్రవారం (మే 30) థియేటర్లలో మళ్లీ రీ-రిలీజైంది. తొలి రోజే సూపర్ కలెక్షన్లతో దుమ్మురేపింది.

ఖలేజా రీ-రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్లు

ఖలేజా సినిమా రీ-రిలీజ్‍లో తొలి రోజు ఏకంగా రూ.6.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ చిత్రం రీ-రిలీజ్‍కు ఫుల్ బజ్ కనిపించింది. బుకింగ్స్ జోరుగా జరిగాయి. అభిమానులు థియేటర్లలో ఫుల్ హంగామా చేశారు. అందుకు తగ్గట్టే రీ-రిలీజ్‍లో ఫస్ట్ డే కలెక్షన్లలో కుమ్మేసింది ఖలేజా.

గబ్బర్ సింగ్ తర్వాతి ప్లేస్‍లో..

తెలుగు రీ-రిలీజ్ సినిమాల్లో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ఉంది. గతేడాది ఈ చిత్రం రీ-రిలీజై ఫస్ట్ డే సుమారు రూ.8కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఖలేజా ఫస్ట్ డే రూ.6.5 కోట్లను దక్కించుకొని రీ-రిలీజ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ జాబితాలో రెండో స్థానానికి దూసుకొచ్చింది. గబ్బర్ సింగ్ గతేడాది పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రీ-రిలీజైంది. ఇప్పుడు ఖలేజా మాత్రం బర్త్ డే సహా ఎలాంటి స్పెషల్ రోజు లేకుండా రీ-రిలీజై కూడా ఆ స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్లు సాధించి సత్తాచాటింది.

టాలీవుడ్ రీ-రిలీజ్‍ల్లో తొలి రోజు రూ.5కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన మూడు చిత్రాలు మహేష్ బాబువి ఉన్నాయి. మురారి, బిజినెస్‍మ్యాన్ ఫస్ట్ డే రూ.5కోట్లకు పైగా దక్కించుకోగా.. ఇప్పుడు ఖలేజా కూడా ఆ మార్క్ దాటేసింది. రీ-రిలీజ్ ఫస్ట్ డే అత్యథిక కలెక్షన్ల జాబితాలో గబ్బర్ సింగ్ తర్వాతి మూడు సినిమాలు మహేశ్‍వే.

ఖలేజా గురించి..

ఖలేజా చిత్రం ఫస్ట్ రిలీజైనప్పుడు ప్లాఫ్‍గా నిలిచింది. మహేశ్, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ 2010 అక్టోబర్ 7వ తేదీన విడుదలైంది. సుమారు రూ.35కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ రూ.20కోట్ల కలెక్షన్ల మార్క్ కూడా దాటలేకపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్‍గా డిజాస్టర్ అయింది.

టీవీల్లోకి వచ్చాక ఖలేజా సినిమాకు ఎనలేని క్రేజ్ వచ్చింది. మహేశ్ బాబు కామెడీ టైమింగ్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, సినిమా కాన్సెప్ట్, త్రివిక్రమ్ టేకింగ్ జనాలకు బాగా ఎక్కేసింది. మణిశర్మ మ్యూజిక్ కూడా ఈ మూవీకి మరో హైలైట్. ఈ చిత్రంలో సునీల్, ప్రకాశ్ రాజ్, అలీ, బ్రహ్మానందం కీలకపాత్రలు చేశారు. కనకరత్న మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని సింగనమల రమేశ్ బాబు, సి.కల్యాణ్, సత్యరామ మూర్తి ప్రొడ్యూజ్ చేశారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024