కృష్ణమ్మ పరవళ్లు – నిండుకుండలా జూరాల, శ్రీశైలానికి కొనసాగుతున్న వరద..!

Best Web Hosting Provider In India 2024

కృష్ణమ్మ పరవళ్లు – నిండుకుండలా జూరాల, శ్రీశైలానికి కొనసాగుతున్న వరద..!

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు పెడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో…కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. జురాల నిండుకుండలా ఉండగా… మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది.

శ్రీశైలం డ్యామ్ (ఫైల్ ఫొటో)

కొద్దిరోజులుగా ఏపీకి ఎగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో కృష్ణమ్మ పరుగులు మొదలయ్యాయి. బేసిన్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ పరిధిలోని జూరాల నిండుకుండను తలపిస్తోంది. జూరాలతో పాటు సంకుశుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాలకు వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో… కొన్ని గేట్లు కొంత మేర పైకి ఎత్తిని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలంలో పెరుగుతున్న నీటిమట్టం…

ఇక జూరాల నుంచి కృష్ణమ్మ పరుగులు పెట్టడంతో.. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో డ్యామ్ లోని నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం (మే 31) ఉదయం రిపోర్ట్ ప్రకారం…. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 826 దాటింది. నీటినిల్వ 46 టీఎంసీలకుగా నమోదైంది. ఎగువ నుంచి 55,999 క్యూసెక్కుల వరద వస్తుండగా…ఔట్ ఫ్లో 800 ఉంది. వరద ప్రవాహం కొనసాగుతున్న క్రమంలో… నీటినిల్వలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

శ్రీశైలం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంటుంది. ఫలితంగా శ్రీశైలం డ్యామ్‌ నిండడానికి మరికొన్ని రోజులు పడుతుంది. పూర్తిస్థాయిలో డ్యామ్‌ నిండాలంటే 885 అడుగులకు నీరు చేరాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఎగువ రాష్ట్రాల్లోనే కాకుండా ఏపీలోనూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో…. శ్రీశైలం ప్రాజెక్ట్ ఈసారి ముందుగానే నిండటం ఖాయంగానే కనిపిస్తోంది.

మరోవైపు నాగార్జున సాగర్ లో పరిస్థితి చూస్తే ఇవాళ ఉదయం రిపోర్ట్ ప్రకారం నీటిమట్టం 512.4 గా ఉంది. ఇక 135.78 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 10,176 గా ఉండగా… 10,176 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. 159.77 అడుగుల నీటిమట్టం ఉంది. 25.29 టీఎంసీల నీటి నిల్వ ఉంది.ఇన్ ఫ్లో నిల్ ఉండగా… ఔట్ ఫ్లో 300 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత… గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి స్వల్పంగా వరద నీరు చేరుతోంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsSrisailamKrmbKrishna RiverTelangana NewsNagarjuna Sagar
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024