



Best Web Hosting Provider In India 2024

మిస్ వరల్డ్ 2025 విజేత ఒపాల్ సుచాతా చువాంగ్స్రీ గురించి తెలుసుకోవాల్సిన 8 విషయాలు
హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో థాయ్ లాండ్ కు చెందిన ఒపాల్ సుచాతా చువాంగ్స్రీ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని దక్కించుకుంది. ఆమె తన దేశానికి మొదటి ప్రపంచ సుందరిగా నిలిచింది. ఓపల్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవీ.
థాయ్లాండ్కు చెందిన ఒపాల్ సుచాతా చువాంగ్స్రీ తన తెలివితేటలు, అందం, ప్రతిభతో న్యాయమూర్తులను ఆకట్టుకుంది. మే 31, 2025న ఆమె మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని గెలుచుకుంది. గత సంవత్సరం విజేత, చెక్ రిపబ్లిక్కు చెందిన మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిష్కోవా 21 ఏళ్ల ఒపాల్కు కిరీటం తొడిగింది. మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన థాయ్లాండ్ నుండి వచ్చిన మొదటి ప్రతినిధి ఒపాల్.
ఎవరు ఈ ఒపాల్ సుచాతా చువాంగ్స్రీ?
హైదరాబాద్లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 108 మంది పోటీదారులు పాల్గొన్నారు. విజేతగా నిలిచి తన కొత్త పాత్రను స్వీకరించిన ఒపాల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ చూడొచ్చు.
చరిత్ర సృష్టించింది: మిస్ వరల్డ్ గెలిచిన థాయ్లాండ్ నుండి వచ్చిన మొదటి ప్రతినిధిగా ఒపాల్ సుచాతా చువాంగ్స్రీ చరిత్ర సృష్టించింది.
చదువు: ఒపాల్ థమ్మసాట్ యూనివర్సిటీలోని పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీలో రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసిస్తోంది.
భాషా నైపుణ్యం: బ్యాంకాక్లోని ట్రియామ్ ఉడోమ్ సుక్సా స్కూల్ నుండి చైనీస్ భాషలో పట్టభద్రురాలైంది.
ఇష్టాలు, లక్ష్యాలు: Missworld.com ప్రకారం, ఒపాల్కు సైకాలజీ, ఆంత్రోపాలజీపై కూడా ఆసక్తి ఉంది. భవిష్యత్తులో తన దేశానికి రాయబారిగా మారాలని ఆమె కోరుకుంటున్నారు.
సామాజిక సేవ: రొమ్ము క్యాన్సర్కు మద్దతు ఇచ్చే సంస్థలకు ఆమె స్వచ్ఛందంగా సేవ చేసింది. 16 సంవత్సరాల వయస్సులో ఆమె స్వయంగా శస్త్రచికిత్సను ఎదుర్కొంది.
ప్రత్యేక ప్రతిభ: ఒపాల్ ఉకులేలేను వెనుకకు పట్టుకొని వాయించడంలో ప్రత్యేక ప్రతిభను కలిగి ఉంది.
పెంపుడు జంతువులు: ఆమెకు 16 పిల్లులు, ఐదు కుక్కలు పెంపుడు జంతువులుగా ఉన్నాయి.
ఇతర విజయాలు: ఒపాల్ పోటీలోని మల్టీమీడియా విభాగాన్ని కూడా గెలుచుకుంది. పోటీదారుల యాప్ లీడర్బోర్డ్లో 2.3 మిలియన్లకు పైగా వీక్షణలతో అగ్రస్థానంలో నిలిచింది. ఆమె ఆసియా, ఓషియానియా కాంటినెంటల్ విజేత కూడా. అంటే నాలుగు కాంటినెంటల్ విజేతలలో ఆమె ఒకరు.
ఒపాల్ను గెలిపించిన సమాధానం
“ఎవరైనా సరే, ఎంత వయసు వారైనా సరే, జీవితంలో ఏ హోదాలో ఉన్నా సరే, మీ పక్కన ఎప్పుడూ ఒక వ్యక్తి ఉంటారు. అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మీ సొంత తల్లిదండ్రులు కూడా కావచ్చు. వారు మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతారు. ప్రజలను నడిపించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, మీ పనులలో దయతో ఉండటం. మన చుట్టూ ఉన్న ప్రజలకు, మన ప్రపంచానికి మనం చేయగలిగిన ఉత్తమమైన పని ఇదే” అని మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలో సమాధానం ఇచ్చినట్టు PTI వార్తా సంస్థ తెలిపింది.
జడ్జీల్లో ఒకరైన సోనూసూద్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ బదులిచ్చింది. నిజాయితీ, వ్యక్తిగత బాధ్యత గురించి మిస్ వరల్డ్ ప్రయాణం ఆమెకు ఏమి నేర్పిందో చెప్పాలన్న ప్రశ్నకు ఆమె ఈ సమాధానం చెప్పింది.
మిస్ వరల్డ్ 2025లో ఇథియోపియాకు చెందిన హాస్సెట్ దెరెజె అడ్మాస్సు రన్నరప్గా నిలిచారు. పోలాండ్కు చెందిన మాయా క్లాజ్డా రెండో రన్నరప్గా, మార్టినిక్కు చెందిన ఆరేలి జోచిమ్ (ఆరేలి జోచిమ్) మూడో రన్నరప్గా నిలిచారు. భారతదేశం తరపున మిస్ వరల్డ్ పోటీదారు నందిని గుప్తా టాప్ 8 కి చేరుకోకముందే నిష్క్రమించారు.
టాపిక్