వీడియో : కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోను – ఎమ్మెల్సీ కవిత వార్నింగ్

Best Web Hosting Provider In India 2024


‘తెలంగాణ జాగృతి’ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె… కేసీఆర్‌, ఆచార్య జయశంకర్‌ స్ఫూర్తితో జాగృతి సంస్థ ఏర్పడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన ఖర్మ అని వ్యాఖ్యానించారు. జై తెలంగాణ అనని వారికి, అమరవీరులకు నివాళులులర్పించని వారికి సీఎం కుర్చిలో కూర్చొనే అర్హత లేదన్నారు. తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన కేసీఆర్‌కు నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోమని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. వీడియోను ఇక్కడ వీక్షించండి….

Source / Credits

Best Web Hosting Provider In India 2024