



Best Web Hosting Provider In India 2024

‘చంద్రబాబు గారు… పేదలకు ‘రేషన్’ కష్టాలు ఎందుకు తెస్తున్నారు..? ఇదేనా మీ విజన్..?’ – వైఎస్ జగన్
రేషన్ పంపిణీ వ్యవస్థలో మార్పులపై వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. మళ్లీ పేదలకు “రేషన్’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. రేషన్ డోర్ డెలివరీని రద్దు చేయడం ద్వారా ఏం సాధిస్తారని నిలదీశారు.
రాష్ట్ర్ ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. డోర్ డెలివరీని రద్దు చేయడం ద్వారా ఏం సాధిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. ఈ సందర్భంగా జగన్ ఓ ప్రకటన ద్వారా పలు ప్రశ్నలు సంధించారు.
చంద్రబాబు గారు ఎందుకీ కక్ష…? – వైఎస్ జగన్
“చంద్రబాబు గారూ ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ పేదలకు “రేషన్’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలికానీ, వారిని కష్టపెట్టడం సబబేనా…? ప్రభుత్వ సేవల డోర్డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా…?” అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20 వేలమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం? అని వైఎస్ జగన్ నిలదీశారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా…? అని ప్రశ్నించారు.
రద్దు చేసి ఏం సాధిస్తారు..?
వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చిందని జగన్ గుర్తు చేశారు. వాలంటీర్ల వ్యవస్థలతోపాటు, ఇంటివద్దకే రేషన్ అందించే డోర్డెలివరీని ప్రారంభించిందని చెప్పారు. రేషన్ వాహనాల ద్వారా ప్రతి ఇంటింటికీ అత్యంత పారదర్శకంగా అందించి.. దోపిడీకి అడ్డుకట్ట వేసిందన్నారు.”చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం రేషన్ డోర్డెలివరీని రద్దు చేయడం, పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా? దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దు చేసి ఏం సాధిస్తారు..?” అని జగన్ నిలదీశారు.
రేషన్ వాహనాల తొలగింపుతో పేదల కష్టాలు మరింత పెరిగాయని జగన్ అన్నారు. “ఈ వాహనాలపై ఆధారపడ్డ 20వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కనీసం వారికి ప్రత్యామ్నాం కూడా చూడలేదు. మొత్తంగా మీరు అధికారంలోకి వచ్చాక వాలంటీర్లుగా పనిచేస్తున్న 2.6లక్షల మంది, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్ నెట్ల్లో తొలగించిన వాటితో కలిపితే మొత్తంగా 3 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏడాది పాలనలో ఇన్ని లక్షల కుటుంబాల పొట్టకొట్టడం మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబు గారూ..!” అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.
సంబంధిత కథనం
టాపిక్