పద్మనాభస్వామి ఆలయంలో 270 ఏళ్ల తర్వాత అరుదైన మహా కుంభాభిషేకం

Best Web Hosting Provider In India 2024


పద్మనాభస్వామి ఆలయంలో 270 ఏళ్ల తర్వాత అరుదైన మహా కుంభాభిషేకం

Anand Sai HT Telugu

కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ఆలయంలో 270 ఏళ్ల తర్వాత అరుదైన మహా కుంభాభిషేకం జరగనుంది.

పద్మనాభస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం

కేరళలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో 270 ఏళ్ల తర్వాత అరుదైన కార్యక్రమం జరగనుంది. ఈ పురాతన ఆలయంలో చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పునరుద్ధరణ పనులు ఇటీవల పూర్తయిన తరువాత వచ్చే వారం మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.

ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడం, ఆలయ పవిత్రతను పునరుద్ధరించడమే దీని ఉద్దేశమని ఆలయ అధికారులు తెలిపారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఇలాంటి సమగ్ర పునరుద్ధరణ, దానికి సంబంధించిన ఆచారాలు జరుగుతున్నాయని ఆలయ అధికారి బి.శ్రీకుమార్ తెలిపారు. మళ్లీ జరిగేందుకు చాలా ఏళ్లు పడుతుందన్నారు. ఈ నెల 8న ఆలయ ప్రాంగణంలో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా నిర్మించిన తాళికకుడంల ప్రతిష్ఠ, విశ్వక్సేన విగ్రహ పునఃప్రతిష్ఠ, తిరువంబాడి శ్రీకృష్ణ ఆలయంలో అష్టబంధ కలశం సహా వివిధ కార్యక్రమాలు జరుగుతాయని శ్రీకుమార్ వెల్లడించారు. 2017లో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ ఆదేశాల మేరకు పునరుద్ధరణ చేపట్టారు. ఆ వెంటనే పనులు ప్రారంభమైనప్పటికీ కొవిడ్ పరిస్థితుల కారణంగా ముందుకు సాగలేదు. అనంతరం 2021 నుంచి దశలవారీగా పలు పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు.

శతాబ్దాల తర్వాత ఆలయంలో సమగ్ర పునరుద్ధరణ, సంబంధిత ఆచారాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్మనాభ స్వామి భక్తులకు ఇన్నేళ్ల తర్వాత ఈ ఆచారాలను వీక్షించే అరుదైన అవకాశం లభించినట్టైంది. శతాబ్దాల నాటి సంప్రదాయాలకు అనుగుణంగా పవిత్ర కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఆలయ యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది.

జూన్ 8న మహా కుంభాభిషేకం జరిగే రోజుల్లో ఆలయంలో ఆచార్య వరణం, ప్రసాద శుద్ధి, ధార, కలశం తదితర కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ వర్గాలు తెలిపాయి.

కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం విష్ణువు అవతారమైన పద్మనాభస్వామికి అంకితం. పద్మనాభస్వామి అంటే నాభిలో కమలం ఉన్నవాడు అని అర్థం. ఈ ప్రదేశంలో విష్ణువు విగ్రహం దొరికిన తర్వాత ఆలయం నిర్మించారని నమ్ముతారు. కేరళలోని ఈ ఆలయానికి స్వామి పద్మనాభ దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. ఈ ఆలయం నిధి గురించి తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ నిధి ఆలయం కింద నిర్మించిన నేలమాళిగల్లో ఉంది. ఆలయ నిధిలో ఏమి ఉందో, ఈ రహస్యం ఇప్పటికీ అలాగే ఉంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link