నెత్తురోడిన అమెరికా వీధులు- 3 చోట్ల కాల్పుల మోత! 15 మంది..

Best Web Hosting Provider In India 2024


నెత్తురోడిన అమెరికా వీధులు- 3 చోట్ల కాల్పుల మోత! 15 మంది..

Sharath Chitturi HT Telugu

వారాంతంలో అమెరికా వీధులు నెత్తురోడాయి. మొత్తం చోట్ల కాల్పుల మోత మోగింది! ఆయా ఘటనల్లో ముగ్గురు మరణించారు. 15మంది గాయపడ్డారు.

అమెరికాలో కాల్పుల కలకలం! (HT_PRINT)

అమెరికా వీధులు మళ్లీ నెత్తురోడాయి. వారాంతంలో మూడు చోట్ల కాల్పుల మోత మోగింది! ఆయా ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 15మంది గాయపడ్డారు.

వర్జీనియాలో భారీ బహిరంగ సభలో కాల్పులు:

వర్జీనియాలోని డాన్ విల్లేలో ఆదివారం తెల్లవారుజామున రెండు వర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురికి గాయాలయ్యాయి.

నార్త్ కరోలినా సరిహద్దు సమీపంలోని ప్రైవేట్ ప్రాపర్టీలో తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని డాన్విల్లే పోలీస్ డిపార్ట్​మెంట్ తెలిపింది.

అక్కడికి చేరుకున్న అధికారులు రోడ్డు మధ్యలో నిలిపి ఉంచిన క్రిస్లర్ సెడాన్ కారులో శరీరం పైభాగంలో తుపాకీ గాయంతో బాధపడుతున్న వ్యక్తిని గుర్తించారు. వర్జీనియాలోని హర్ట్​కు చెందిన జే షాన్ టైజే వైట్ (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

క్రిస్లర్ డ్రైవర్​గా భావిస్తున్న మరో వ్యక్తి తుపాకీ గాయాలతో సమీపంలో కనిపించడంతో అతడిని సోవాహ్ హెల్త్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు వయోజన పురుషులు, 19 ఏళ్ల మహిళతో సహా మరో ముగ్గురు బాధితులు చికిత్స కోసం ఆసుపత్రికి చేరుకున్నారు.

“పెద్ద ఎత్తున బహిరంగ సభ జరిగినట్లు ఈ సంఘటనపై ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సమావేశంలో క్రిస్లర్- ఇతర వ్యక్తుల మధ్య తుపాకీ కాల్పులు జరిగాయి,” అని పోలీసు ప్రకటన తెలిపింది.

ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. సమాచారం ఉంటే వెంటనే డిటెక్టివ్లను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

ఇద్దరు కాలిఫోర్నియా అధికారులపై కాల్పులు:

దక్షిణ కాలిఫోర్నియాలోని బాల్డ్విన్ పార్క్​లో శనివారం రాత్రి ఓ అనుమానితుడు ఇద్దరు పోలీసు అధికారులపై కాల్పులకు తెగించాడు. వీరిలో ఒకరు మృతిచెందారు.

లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ జి లూనా తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 7:12 గంటలకు (పసిఫిక్ కాలమానం ప్రకారం) నివాస ప్రాంతంలో ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు.

అధికారులు రాగానే నిందితుడు ఎలాంటి హెచ్చరికలు లేకుండా వారిపై కాల్పులు జరిపాడని షెరీఫ్ లూనా అర్ధరాత్రి మీడియా సమావేశంలో చెప్పారు. లాస్ ఏంజిల్స్ జనరల్ మెడికల్ సెంటర్​లో శామ్యూల్ రివెరోస్ అనే అధికారి మృతి చెందాడు. ప్రాణాలతో బయటపడిన అధికారి ఆంథోనీ పిమెంటల్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్వాట్​తో జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితుడిని గాయపరిచి అదుపులోకి తీసుకున్నారు. సమీపంలోని ఫుట్​పాత్​పై తుపాకీ గాయాలతో ఒక వ్యక్తి చనిపోయినట్లు దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. అతను అనుమానితుడి మునుపటి బాధితుడిగా భావిస్తున్నారు!

నార్త్ కరోలినాలో కాల్పులు:

నిశ్శబ్దంగా ఉన్న హికోరీ పరిసరాల్లోని ఓ హౌస్ పార్టీలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన హింసాత్మక కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో 10 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సుమారు 100 మంది గుమిగూడిన ఓ ఇంట్లో అర్ధరాత్రి 12.45 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయని కాటవ్బా కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. 80కి పైగా కాల్పుల శబ్దాలు వినిపించాయని, ఈ ఘటనలో ఒకరి కంటే ఎక్కువ మంది షూటర్లు పాల్గొన్నట్లు అధికారులు ధృవీకరించారు.

“సాధారణంగా ప్రశాంతంగా ఉండే నివాస ప్రాంతం ఈ భయంకరమైన సంఘటనతో ఛిన్నాభిన్నమైంది.” అని షెరీఫ్ కార్యాలయానికి చెందిన మేజర్ ఆరోన్ టర్క్ విలేకరుల సమావేశంలో చెప్పారు.

హౌస్​ పార్టీకి హాజరైన వారిలో చాలా మంది స్థానిక హైస్కూల్ విద్యార్థులేనని ప్రత్యక్ష సాక్షులు స్థానిక విలేకరులకు తెలిపారు. కాల్పులు ప్రారంభం కాగానే జనం చెల్లాచెదురుగా పడి, ప్రాణాల కోసం పరుగులు తీశారని వివరించారు.

నార్త్ కరోలినా స్టేట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, హికోరీ పోలీస్ డిపార్ట్​మెంట్​ ఎఫ్​బీఐ సహకారంతో దర్యాప్తును నడిపిస్తున్నాయి. బాధితుల పేర్లు, వయసు వివరాలు వెల్లడించలేదు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link