Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ జూన్ 2: జ్యోత్స్న, పారును ఆటాడుకున్న దీప.. కార్తీక్పై కాంచన డౌట్.. కొత్త పిలుపులు
కార్తీక దీపం 2 సీరియల్ నేటి ఎపిసోడ్ జూన్ 2: జ్యోత్స్న, పారిజాతాన్ని ఓ ఆటాడుకుంటుంది దీప. ఎవరినైనా చంపావా అని అడిగి కంగారు పెడుతుంది. శ్రీధర్పై కార్తీక్, అనసూయ పంచ్లు వేస్తారు. కొత్తగా వరుసలతో పిలుచుకోవాలని కార్తీక్, దీప అనుకుంటారు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (జూన్ 2, 2025) ఎపిసోడ్లో.. తలకు ఐస్ప్యాక్ పెట్టుకొని కంగారుగా కూర్చొని ఉంటుంది జ్యోత్స్న. వెనుక నుంచి నెమ్మదిగా వచ్చి నుదుళ్లకు మసాజ్ చేసి తలపడుతుంది దీప. అయితే, అలా చేస్తోంది పారిజాతం అనుకొని.. దాసు ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి తలపోటుగా ఉందని, థ్యాంక్స్ గ్రానీ అని జ్యోత్స్న అంటుంది. “నీ చేయి పడగానే రిలాక్స్డ్ గా ఉంది, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది గ్రానీ” అని జ్యో చెబుతుంది. ఇంతలోనే అక్కడికి పారు రావడం చూస్తుంది. ఇది ఎవరు అనుకుంటుంది. దీపను చూసి నువ్వా అని అంటుంది.
ఎవరినైనా చంపారా.. పారిజాతం షాక్
ఏమైందే అని పారిజాతం అంటుంది. దీప తల పట్టుకుందని జ్యోత్స్న చెబుతుంది. తల పట్టుకుందా గొంతు పట్టుకుందా అని పారిజాతం అంటుంది. గొంత ఎందుకు పట్టుకుంటానని దీప అడిగితే.. చంపేందుకేమోనని పారిజాతం అంటుంది. నేను ఎవరినీ ఎప్పుడూ చంపలేదు.. మీరు ఎవరినైనా చంపారా అని దీప ప్రశ్నిస్తుంది. దీంతో పారిజాతం షాక్ అవుతుంది. జ్యో కూడా కంగారు పడుతుంది. దోమలనే చంపను.. మనుషులను ఏం చంపుతా అని పారిజాతం అంటుంది. “నేను చంపారా అన్నాను కానీ.. మనుషులను చంపారా అని అనలేదు కదా” అని దీప అంటే.. పారిజాతం తడబడుతుంది. నువ్వు నా తల నొప్పి ఎందుకు పట్టుకున్నావ్.. పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావని జ్యోత్స్న అడుగుతుంది. ఈ పని మనిషి పర్మిషన్ లేకుండా వస్తుందని దీప అంటుంది.
ఇద్దరినీ ఆటాడుకున్న దీప
పోయి వంట చేసుకో అని దీపకు పారిజాతం చెబుతుంది. వంట అయిపోయిందని దీప అంటుంది. పారిజాతం ఏ పని చేసినా అయిపోయిందంటూ దీప బదులిస్తుంది. దీంతో పారిజాతం చిరాకు పడుతుంది. నన్ను ఏం చేయమంటావే అని అడుగుతుంది. నాకేదైనా పని చెప్పండి అని దీప అంటుంది. కాసేపు రెస్ట్ తీసుకో అని పారిజాతం అంటుంది. లేదు నాకు ఏదైనా పని చెప్పండి అంటూ జ్యోత్స్న, పారిజాతాన్ని ఆటాడుకుంటుంది దీప. ఇదెక్కడి టార్చరే అంటూ పారు చిరాకు పడుతుంది.
కాఫీ, జ్యూస్, కూల్డ్రింక్ తీసుకురావాలా అంటూ దీప అడుగుతూనే ఉంటుంది. వద్దు.. మాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావని జ్యోత్స్న అరుస్తుంది. పని మనిషిని, మీ మనిషిని, ఈ ఇంటి మనిషిని అని దీప అంటుంది. మిమల్ని ఓ కంట కనిపెట్టుకొని ఉండాల్సిన దాన్ని అని చెబుతుంది. దీంతో జ్యో అనుమానంగా చూస్తుంది. పని చెప్పకపోతే.. మళ్లీ వస్తానని అక్కడి నుంచి వెళుతుంది దీప.
కోరలు పీకిన తాచుపాములా..
దీపలో ఈ మార్పును చూసి పారిజాతం, జ్యోత్స్న అనుమానిస్తారు. ఏదైనా మాట అంటే తాచుపాములా బుసలు కొట్టే దీప.. ఇప్పుడు ఏంటి కోరలు పీకిన పాములా సాధారణంగా అయిపోయిందంటూ పారిజాతం అంటుంది. పనిచెప్పు అంటూ టార్చర్ పెడుతోందేంటే అని చెబుతుంది. మనతో ఆడుకోవాలని మొగుడు పెళ్లాలు మెంటల్గా ఫిక్స్ అయినట్టు ఉన్నారు. ఏదో అనుమానంగా ఉందని పారు అంటే.. దీప, కార్తీక్ బావా ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నారని మనసులో అనుకుంటుంది జ్యో. నేనే వారిని ఓ కంట కనిపెట్టాలని ఆలోచిస్తుంది. గ్రానీ కొడుకు దాసు ఏమయ్యాడో తెలుసుకోవాలని అనుకుంటుంది.
తాళి తీసి ఇచ్చెయ్
కార్తీక్ ఇంటికి అతడికి తండ్రి శ్రీధర్ వస్తాడు. నువ్వు కన్నతల్లివా కసాయిదానివా అని కాంచనను శ్రీధర్ ప్రశ్నిస్తాడు. కావేరి అడ్డుపడుతుంది. నన్ను అడిగే అధికారం మీరు లేదని కాంచన అంటే.. అయితే తాళి తీసి ఇవ్వు అని శ్రీధర్ అడుగుతాడు. కాంచన దృష్టిలో ఆ తాళి అలంకారం మాత్రమే అని అనసూయ అంటుంది. ఇంతలో కార్తీక్, దీప వచ్చేస్తారు. శివన్నారాయణ ఇంటి పని మనుషులు అని వారిని శ్రీధర్ అంటాడు.
కారణం ఏంటో చెప్పు
జ్యోత్స్న చెప్పిన అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి, వాళ్ల ఇంట్లో పని చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అని కార్తీక్ను శ్రీధర్ అడుగుతాడు. నిజానికి అదేంటో తెలుసుందామనే వచ్చానని ప్రశ్నిస్తాడు. సంతకం పెట్టేందుకు వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అని అడుగుతాడు. ఖాళీగా ఉన్నట్టు ఉన్నావే అని కార్తీక్ వెటకరిస్తాడు. అనవసరమైన విషయాలు అడగకండి అని దీప అంటుంది.
నీకు చెప్పను
శ్రీధర్ను కావేరి, కార్తీక్, కాంచన, అనసూయ మాటలు అంటారు. పంచ్లు వేస్తారు. దీంతో “మీ ఆడాళ్ల నోటికి అడ్డుపడడం కంటే వెళుతున్న లారీ కింద పడడం నయం. అదైతే ఒకేసారి తొక్కేస్తుంది. మీరు ముందుకు వెనక్కి తొక్కుతూ నార తీస్తారు” అని శ్రీధర్ అంటాడు. తెలిసి ఎందుకు అని కార్తీక్ అంటే.. శ్రీధర్ తన మార్క్ మాటలతో కవర్ చేసుకుంటాడు. టైమ్ అయింది.. మాకు పనులు ఉన్నాయి.. వెళ్లండి అని కార్తీక్ అంటాడు. ఆ ఇంటికి వెళ్లడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి, చెప్పు అని కార్తీక్ను శ్రీధర్ అడుగుతాడు. నీకు చెప్పను అని కార్తీక్ అంటాడు. నువ్వు చెప్పొద్దు.. నేనే తెలుసుకుంటానని చెప్పి శ్రీధర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
పుట్టింటికి ఆడపడుచును బహుమతిగా ఇవ్వాలి
దీపను ఆ ఇంటికి ఎందుకు తీసుకెళ్లావని కార్తీక్ను కాంచన ప్రశ్నిస్తుంది. నేనే వెళ్లానని దీప బదులిస్తుంది. నిజంగానే దీని వెనుక ఏదైనా కారణం ఉందా అని కాంచన అడుగుతుంది. ఆ పెద్ద మనిషి ఏదో వాగి వెళితే పట్టించుకుంటావా.. నిజంగా ఏదైనా కారణం ఉన్నా నీ కొడుకు మీద నమ్మకం లేదా అని ప్రశ్నిస్తాడు. ఒక ఆడపడుచును తన పుట్టింటికి బహుమతిగా ఇవ్వాలని దీపను చూస్తూ కార్తీక్ అంటాడు. నాకోసం ఎందుకు అంత కష్టం పడుతున్నావని కాంచన అడుగుతుంది. అమ్మ కోసం చేస్తే బాధ్యత అని, బంధాలను మళ్లీ కలుపుతానేలా కార్తీక్ మాట్లాడతాడు. కార్తీక్ బాబుపై నమ్మకం ఉంచాలని దీప అంటుంది.
కాంచనకు డౌట్
వీళ్ల మాటలు చూస్తుంటే ఏదో చేస్తున్నారని కార్తీక్, దీపపై కాంచనకు డౌట్ వస్తుంది. అనసూయతో ఇదే మాట అంటుంది. దాని వెనుక పెద్ద కారణమే ఉందని అనిపిస్తోందని కాంచన అనుమానిస్తుంది. దీప మాటలు విన్నాక నమ్మకంగా అనిపిస్తోందని అనసూయ చెబుతుంది.
ఏనాటికైనా అక్కడికే..
బొమ్మతో మాట్లాడుతూ ఉంటుంది శౌర్య. ఏం చేస్తున్నావ్ అని కార్తీక్ అడుగుతాడు. ముందు మీరు ఎక్కడికి వెళ్లారో చెప్పండని కార్తీక్, దీపను శౌర్య ప్రశ్నిస్తుంది. పని చేసేందుకు వెళ్లామని అంటాడు. మీ నాన్న నాకు తోడుగా ఉన్నాడంటూ చెబుతుంది. అందమైన పూదోటకు వెళ్లామని దీప అంటే.. నన్ను అక్కడికి తీసుకెళ్లొచ్చు కదా అని శౌర్య అడుగుతుంది. ఏనాటికైనా నువ్వు అక్కడికి రావాల్సిందే రౌడీ అని కార్తీక్ అంటాడు. నాది అని తెలియక ఇప్పటి వరకు అక్కడికి వెళ్లలేదని దీప అంటుంది. తన పుట్టింటిని పూదోటతో దీప పోలుస్తుంది.
మరదలిగా చూస్తున్నా.. సిగ్గు పడిన దీప
కార్తీక్, దీప ప్రేమగా మాట్లాడుకుంటారు. ఒకప్పుడు నిన్ను జాలిగా, ఆ తర్వాత దీపలా, భార్యలా, ప్రాణదాతలా చూసే వాడినని కార్తీక్ అంటాడు. మరి ఇప్పుడు అని దీప అడిగితే.. నా అత్త కూతురిలా, మరదలిలా చేస్తున్నానని కార్తీక్ చెబుతాడు. దీంతో దీప సిగ్గు పడుతుంది. జ్యోత్స్న అంటే తనకు ముందు నుంచి కూడా ఇష్టం ఉండేదని కాదని, కానీ నిన్ను మొదటిసారి చూసిన వెంటనే దగ్గరితనంగా అనిపించిందని అంటాడు. దానికి కారణంగా శౌర్య అని అనుకునేవాడినని, కానీ మనది భగవంతుడు ముడేసిన బంధం అని చెబుతాడు. బంధాలు ఎదురుపడినప్పుడు వారి మీద ఆకర్షణ, ఆరాధన ఏర్పడతాయంట అని అంటాడు.
“మనది రక్తం బంధం కాబట్టి, నా ప్రాణాలు కాపాడేందుకు నువ్వు రక్తం ఇచ్చావ్. లేకపోతే జ్యోత్స్న ఇచ్చి ఉండేది కదా” అని కార్తీక్ అంటాడు. మనం కలవాలని కాలమే అనుకుందని చెబుతాడు.
మరదలా.. బావా.. కొత్త పిలుపులు
ఇక నుంచి మనం కొత్తగా పిలుచుకుందామని కార్తీక్ అంటాడు. నేను నిన్ను మరదలా అంటాను.. నువ్వు నన్ను బావా అని పిలువు అని అడుగుతాడు. ఎవరైనా వింటే అని దీప సిగ్గు పడుతూ అడుగుతుంది. ఏమీ చెప్పకుండానే ఏదో కారణం ఉందని మీ నాన్న కనిపెట్టారు, మీ అమ్మకు అనుమానం వచ్చిందని దీప అంటుంది. రానివ్వు దీప, మనం ఈ నిజం ఎప్పుడో ఒకసారి చెప్పేయాలి, అప్పటి వరకు కొన్ని చేయాలి అని కార్తీక్ అంటాడు. అలాగే కార్తీక్ బాబు అని దీప అంటుంది. కార్తీక్ బాబు ఏంటి.. బావా అని పిలువు మరదలా అని కార్తీక్ అంటాడు.
మరదలా.. ఎవరు అంటూ అక్కడికి శౌర్య ఎంట్రీ ఇస్తుంది. ఎవరు ఆ మరదలు, ఎవరా బావ అని అడుగుతుంది. బావామరదళ్ల కథను శౌర్యకు చెబుతుంటాడు కార్తీక్. నా జీవితంలో ఇన్ని అద్భుతాలు జరుగుతాయని నేను ఊహించలేదు. మీరు బావ, నేను మరదలు. నేను మళ్లీ కొత్తగా పుట్టినట్టు ఉంది” అని మనసులో సంతోషంగా అనుకుంటుంది దీప. దీంతో కార్తీక దీపం 2 నేటి (జూన్ 2) ఎపిసోడ్ ముగిసింది.