నిన్ను కోరి జూన్ 2 ఎపిసోడ్: ఇంట్లోకి భీమవరం శ్యామల ఎంట్రీ- మందులు మార్చడంపై ఎంక్వైరీ- శాలినికి కామాక్షి శాపనార్థాలు!

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి జూన్ 2 ఎపిసోడ్: ఇంట్లోకి భీమవరం శ్యామల ఎంట్రీ- మందులు మార్చడంపై ఎంక్వైరీ- శాలినికి కామాక్షి శాపనార్థాలు!

 

నిన్ను కోరి సీరియల్ జూన్ 2 ఎపిసోడ్‌లో రఘురాం మందులు మార్చడంపై అంతా చంద్రకళను నిందిస్తారు. అసలు దోషి ఎవరో కనిపెట్టేందుకు తాను ఎంక్వైరీ చేస్తానని క్రాంతి అంటాడు. జగదీశ్వరి ఇంట్లోకి భీమవరం శ్యామల ఎంట్రీ ఇస్తుంది. దాంతో కామాక్షి తెగ భయపడిపోతుంది. కూతురుకు శ్యామల గురించి కామాక్షి చెబుతుంది.

 
నిన్ను కోరి సీరియల్ జూన్ 2 ఎపిసోడ్‌
 

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళను కొడుతుంది జగదీశ్వరి. మీరు కట్టిన తాళి నా మాంగళ్యాన్ని బలి కోరుతుంది అని జగదీశ్వరి విరాట్‌ను అంటుంది. దీంతో నన్ను చంపుతున్నావ్ కదే అని వెళ్లిపోతాడు విరాట్. అమ్మ ఎక్కడో ఏదో తప్పు జరుగింది అని క్రాంతి అంటాడు. మీ వదినను వెనుకేసుకురావాలంటే రా కానీ నన్ను మర్చిపో అని జగదీశ్వరి అంటుంది.

 

చంద్రకళే మార్చి ఉంటుంది

అది కాదమ్మా అని క్రాంతి అంటే.. నన్ను నా భర్తను వదిలేయండి. కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటాను అని జగదీశ్వరి అంటుంది. దాంతో చంద్రకళ ఏడుస్తూ వెళ్లిపోతుంది. అంతా వెళ్లిపోతారు. పక్కకు వెళ్లిన కామాక్షి, శ్రుతి చంద్రకళ కావాలనే మందులు మార్చి ఉంటుంది అని తిడతారు. అందుకే ఇంట్లోకి వచ్చి. ఇంక అత్తయ్య ఆలోచిస్తుంది. మెడ పట్టి గెంటేయకుండా అని శ్రుతి అంటుంది.

అన్నయ్య జీవచ్ఛవంలా ఉన్నారు. అలాంటి వారిని చంపాలని ఎవరైనా చూస్తారా. అలాంటి మనుషులు సుఖంగా బతుకుతారా. నాశనం అయిపోతారు. వాళ్లు కూడా చేతులు కాళ్లు పడిపోయి ఒక మూలన పడిపోతారు అని ఇన్‌డైరెక్ట్‌గా శాలినినే శపిస్తుంది కామాక్షి. అదంతా విన్న శాలిని సర్లే పిన్ని వదిలేయండి. శాపనార్థాలు పెట్టడం ఎందుకు. చంద్రను ఎలా బయటకు పంపాలో అది ఆలోచించండి అని శాలిని అంటుంది.

ఇంతలో క్రాంతి వచ్చి శ్రుతి ఇది నువ్వు చేసిన పనేగా. అది నువ్వే అని నాకు తెలుసు. అలాంటి పని చేసే అవసరం నీకు, నీ కూతురుకు తప్ప ఎవరికి లేదని క్రాంతి నిలదీస్తాడు. శ్రుతిని అన్నయ్యకు ఇచ్చి చేయాలని, చంద్రను దూరం చేయాలని ఇలా చేసినట్లు నాకు డౌట్‌గా ఉందని క్రాంతి అంటాడు. దాంతో కామాక్షి ఏడుస్తుంది. నేను పెళ్లి చేయాలనుకుందే మా అన్నయ్యకు దూరంగా ఉండకూడదని, అలాంటిది నేనేందుకు చేస్తాను అని కామాక్షి అంటుంది.

 

అసలు దోషి ఎవరో

ఇన్నాళ్లు మనతో ఉన్నారు వీళ్లేందుకు చేస్తారు అని శాలిని అంటుంది. ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది. చంద్ర వదినకు మాత్రం లేదు. నేను ఎంక్వైరీ చేసి ఇది ఎవరు చేశారో కచ్చితంగా కనిపెడతాను. వాళ్ల పాపం బయటపెట్టి శిక్ష పడేలా చేస్తాను అని క్రాంతి అంటాడు. అలా చేయి, నిజం బయటపడుతుందని, అసలు దోషి ఎవరో తెలుస్తుంది అని శ్రుతి అంటుంది.

ఇప్పుడు ఎంక్వైరీ ఎందుకని శాలిని అంటే.. నేను వదిలిపెట్టను. ఈ పని చేసింది ఎవరో కనిపెట్టి తీరుతాను అని వెళ్లిపోతాడు క్రాంతి. దాంతో శాలిని భయపడిపోతుంది. మరోవైపు ఏడుస్తున్న చంద్రకళను ఓదార్చుతాడు క్రాంతి. నా మీద ఇంతపెద్ద నింద వేస్తే ఎలా తట్టుకోవాలి. నేను పిశాచిలా కనిపిస్తున్నానా వాళ్లకు అని ఏడుస్తుంది చంద్రకళ.

అత్తయ్య శత్రువులా చూస్తుంది. నేను ఎంత ప్రయత్నించినా చివరికి నేనే చెడ్డదాన్ని అవుతున్నాను. నా తప్పు లేదని నిరూపించడానికి నాకు ఇంకో దారి కనిపించట్లేదు. అందుకు దేవుడే దిగిరావాలి అని చంద్ర అంటే అప్పుడే ఆటోలో కొత్త క్యారెక్టర్ భీమవరం శ్యామల ఎంట్రీ అవుతుంది. ఆటో 999 అయిందని డ్రైవర్ చెబితే అమ్మో అని ఆశ్చర్యపోయినా శ్యామల వెయ్యి ఇచ్చి తగ్గిన ఒక్క రూపాయి ఇవ్వమంటుంది.

 

తోడేలులా

చిల్లర లేదని ఆటో డ్రైవర్ అంటాడు. తర్వాత కాసేపటికి చిల్లర ఇచ్చి పంపించిస్తుంది శ్యామల. ఇంట్లో వాళ్లు ఎలా వేగుతారో అని ఆటో డ్రైవర్ వెళ్లిపోతాడు. భీమవరం శ్యామల ఇంట్లోకి అడుగుపెట్టగానే భూకంపం వచ్చినట్లు అవుతుంది. దాంతో శ్రుతికి భీమవరం శ్యామల గురించి చెబుతుంది కామాక్షి. తోడబుట్టిందయినా తోడేలులా పీక్కుతింటది అని కామాక్షి అంటుంది.

వచ్చి కామాక్షిని పలకరిస్తుంది శ్యామల. నేను వచ్చినందుకు మీ అమ్మ నోరు పడిపోయినట్లుందని శ్రుతి అంటుంది శ్యామల. మా చిన్న తాతయ్య గారి కూతురు, మాకు అత్త అవుతుందని శాలినికి క్రాంతి చెబుతాడు. విరాట్, క్రాంతి వచ్చి పలకరిస్తారు. శాలినిని క్రాంతి పరిచయం చేస్తాడు. ఇంతలో జగదీశ్వరి వచ్చి హగ్ చేసుకుంటుంది. చంద్రకళకు శ్యామల గురించి క్రాంతి చెబుతాడు.

అన్నయ్య ఎక్కడ అని శ్యామల అడిగితే రఘురాం దగ్గరికి తీసుకెళ్తారు. దాంతో రఘురాంను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్యామల. నాకు ఒక్కరైనా ఒక్క మాట అయినా చెప్పాలిగా అని శ్యామల అంటుంది. చంద్రను చూసి ఎవరు అని శ్యామల అడిగితే.. విరాట్ అన్నయ్య భార్య అని క్రాంతి చెబుతాడు. ఈ పెళ్లికి కూడా పిలవలేదా అని శ్యామల అంటుంది.

 

జగదీశ్వరి ఆర్డర్

వాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మేము ఎక్కడ ఒప్పుకోమో అని భయపడి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు అని జగదీశ్వరి అబద్ధం చెబుతుంది. చంద్రను వచ్చి తన భర్త పక్కన నిలబడమంటుంది. తర్వాత నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు, మా ఆయనకు శ్యామల అంటే చాలా గౌరవం. మేము ఇలా ఉన్నామంటే శ్యామల వల్లే. నాకంటే ఎక్కువ మర్యాద శ్యామలకు ఇవ్వాలి అని ఆర్డర్ పాస్ చేస్తుంది జగదీశ్వరి.

అనంతరం రెండు జంటలను ఒకరినొకరు తినిపించుకోమ్మని శ్యామల చెబుతుంది. దాంతో విరాట్-చంద్ర, క్రాంతి-శ్యామల అలాగే చేస్తారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Best Web Hosting Provider In India 2024