జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 ఫలితాలు విడుదల- టాప్​ 10లో ఇద్దరు ఐఐటీ హైదరాబాద్​ జోన్​ విద్యార్థులు..

Best Web Hosting Provider In India 2024

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 ఫలితాలు విడుదల- టాప్​ 10లో ఇద్దరు ఐఐటీ హైదరాబాద్​ జోన్​ విద్యార్థులు..

 

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలను తనిఖీ చేయడానికి డైరెక్ట్ లింక్​తో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

 
జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 ఫలితాలు విడుదల..
 

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్​డ్ 2025 ఫలితాలను ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ కాన్పూర్) ఫలితాలను తాజాగా ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను jeeadv.ac.in అధికారిక వెబ్​సైట్​లో చూసుకోవచ్చు. ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీని కూడా ఐఐటీ కాన్పూర్​ విడుదల చేసింది.

 

జేఈఈ అడ్వాన్స్ డ్ ప్రొవిజినల్ ఆన్సర్ కీ మే 25న విడుదలైంది. అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు.

జేఈఈ అడ్వాన్స్​డ్ రిజల్ట్ 2025 చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

జేఈఈ అడ్వాన్స్​డ్​ ఫలితాలు- ఇలా చెక్ చేసుకోండి..

  • జేఈఈ అడ్వాన్స్​డ్ రిజల్ట్​ను అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్ నుంచి ఈ స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా చెక్ చేసుకోవచ్చు
  • jeeadv.ac.in అధికారిక వెబ్​సైట్ ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో జేఈఈ అడ్వాన్స్​డ్ రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయండి.
  • మీ లాగిన్ వివరాలు ఎంటర్ చేయండి.
  • రిజల్ట్ చెక్ చేసుకోండి.

తాజాగా విడుదలైన జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో కామన్ ర్యాంక్ లిస్ట్ (సీఆర్​ఎల్ )లో ఐఐటీ దిల్లీ జోన్​కు చెందిన రజిత్ గుప్తా అగ్రస్థానంలో నిలిచాడు. 360 మార్కులకు గాను 332 మార్కులు సాధించాడు. ఐఐటీ ఖరగ్​పూర్ జోన్​కు చెందిన దేవదత్తా మాఝీ మహిళల్లో అగ్రస్థానంలో నిలిచింది.

ఐఐటీ దిల్లీ జోన్​కు చెందిన రజిత్ గుప్తా టాపర్​గా నిలవగా, మరో ఐఐటీ దిల్లీ జోన్ అభ్యర్థి సాక్షం జిందాల్ 332 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. ఐఐటీ బాంబే జోన్​కు చెందిన మజీద్ ముజాహిద్ హుస్సేన్ 330 మార్కులతో మూడో ర్యాంకు సాధించాడు. ఐఐటీ బాంబేకు చెందిన పార్థ్ మందర్ వర్తక్ 327 మార్కులతో నాలుగో స్థానంలో నిలిచాడు.

 

టాప్ 10లో ఐఐటీ దిల్లీ జోన్​కు చెందిన అభ్యర్థులకు 4, ఐఐటీ ముంబైకి 3, ఐఐటీ హైదరాబాద్​కు 2, ఐఐటీ కాన్పూర్​కు చెందిన ఒక అభ్యర్థి ఉన్నారు.

జేఈఈ అడ్వాన్స్​డ్​లో అర్హత సాధించిన టాప్ 500 అభ్యర్థుల్లో ఐఐటీ బాంబే జోన్​లో గరిష్టంగా 145 మంది, ఐఐటీ హైదరాబాద్​లో 139 మంది, ఐఐటీ దిల్లీలో 111 మంది, ఐఐటీ రూర్కీలో 53 మంది, ఐఐటీ ఖరగ్​పూర్​లో 32 మంది, ఐఐటీ కాన్పూర్​లో 17 మంది, ఐఐటీ గౌహతిలో ముగ్గురు ఉన్నారు.

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 పరీక్షను మే 18, ఆదివారం రెండు షిఫ్టులలో నిర్వహించారు. జేఈఈ అడ్వాన్స్​డ్ పేపర్ -1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ -2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించారు.

ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్​డ్ కు మొత్తం 187223 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. పరీక్ష నిర్వహించిన అనంతరం ప్రశ్నపత్రాలు, ప్రొవిజనల్ ఆన్సర్ కీలను విడుదల చేసింది.

ఫలితాలతో పాటు జేఈఈ అడ్వాన్స్​డ్ టాపర్ల పేర్లు, కటాఫ్ మార్కులను ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది.

అర్హులైన అభ్యర్థులు ఐఐటీ అడ్మిషన్ల కోసం నిర్వహించే జోసా కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చని, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

 

జేఈఈ అడ్వాన్స్​డ్ అనేది ఐఐటీలు, మరికొన్ని సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. జేఈఈ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన టాప్ 2.5 లక్షల మంది అభ్యర్థులు (అన్ని కేటగిరీలు కలిపి) ఈ ప్రవేశ పరీక్ష రాయవచ్చు.

 


Best Web Hosting Provider In India 2024


Source link