



Best Web Hosting Provider In India 2024

9 మంది తెలంగాణ ఉద్యమ నేతలకు కోటి రూపాయల పురస్కారం
తెలంగాణ ఉద్యమంలో సమున్నత పాత్ర పోషించిన ప్రముఖులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నగదు పురస్కారం ప్రకటించింది. ఆయా పురస్కారాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా ప్రముఖులకు, వారి కటుంబ సభ్యులకు అందజేశారు.
తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రజల గుండెల్లో నిలిచిన కవులు కళాకారులు సాహితీవేత్తలు తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారం అందిస్తామని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజున ముఖ్యమంత్రి ప్రకటించారు.
రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా పెరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నగదు పురస్కారం అందించారు. ఈ నగదు పురస్కారాలు అందుకున్న వారిలో ఎక్కా యాదగిరి రావు, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి ఉన్నారు.
దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరిల తరపున వారి కుటుంబ సభ్యులు నగదు పురస్కారాన్ని అందుకున్నారు.
విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరపున ఆయన కూతురు పురస్కారాన్ని అందుకున్నారు.
పోలీసు అధికారులకు మెడల్స్
ఉత్తమ ప్రతిభ కనబర్చిన 19 మంది పోలీస్ అధికారులకు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 11 మంది కి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డు లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు.
కాళోజీ పురస్కారం
బహు బాషా సాహితీ వేత్త నలిమెల భాస్కర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళోజీ పురస్కారం అందించారు.
టాపిక్