





Best Web Hosting Provider In India 2024

చిలిపిగా కన్ను కొట్టిన ప్రీతి జింటా.. క్యూట్ వీడియో వైరల్.. ఎంత ముద్దొస్తుందో!
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. 11 ఏళ్ల తర్వాత ఆ టీమ్ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఆ టీమ్ కో ఓనర్ ప్రీతి జింటా సంతోషంలో మునిగిపోయింది. ఆ టీమ్ ప్లేయర్స్ ను చూసి చిలిపిగా కన్ను కొట్టింది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్ లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న ఆ టీమ్.. ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం (జూన్ 1) క్వాలిఫయర్ 2లో ముంబయి ఇండియన్స్ ను పంజాబ్ కింగ్స్ చిత్తుచేసింది. ఈ మ్యాచ్ లో విజయంతో 11 ఏళ్ల తర్వాత పంజాబ్ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఆ టీమ్ కో ఓనర్ ప్రీతి జింటా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఆటగాళ్లను చూసి ఆమె కన్ను కొట్టిన వీడియో తెగ వైరల్ గా మారింది.
సంతోషంతో దూసుకొచ్చి
శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 87 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ కింగ్స్ ను గెలిపించాడు. ముంబయి పై ఐదు వికెట్ల తేడాతో, ఆరు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అతను మ్యాచ్ విన్నింగ్ సిక్స్ కొట్టిన వెంటనే పంజాబ్ కింగ్స్ డగ్అవుట్ లో ఉత్సాహం పెరిగింది.
పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మొదట డగ్అవుట్ లోకి దూసుకెళ్లి జట్టులోని ప్రతి సభ్యుడినీ హత్తుకున్నాడు. ఆ తర్వాత అతను తన కెప్టెన్ శ్రేయస్ను హగ్ చేసుకున్నాడు. తీవ్ర ఒత్తిడిలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినందుకు అభినందించాడు. అతను శ్రేయస్ ప్రయత్నాలను గుర్తిస్తూ భుజం మీద తట్టాడు.
చిలిపిగా ప్రీతి
శ్రేయస్ విన్నింగ్ రన్స్ కొట్టిన వెంటనే ప్రీతి జింటా చేతులు గాల్లోకి లేపి ఎగిరింది. ముంబయిపై పంజాబ్ విజయంతో సంబరాల్లో తేలిపోయింది. ఆమె హెడ్ కోచ్ పాంటింగ్ ను గట్టిగా హగ్ చేసుకుంది. తన టీమ్ ఆటగాళ్ల వైపు చూస్తూ చిలిపిగా కన్ను కొట్టింది. 2014 తర్వాత 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికింది పంజాబ్. దీంతో సంతోషంలో ప్రీతి ఇలా చేసిందని అర్థం చేసుకోవచ్చు. సీరియస్ గా ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను నవ్వించేందుకు ప్రీతి ప్రయత్నించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హార్దిక్ పాండ్యా విచారంలో
పంజాబ్ కింగ్స్ విన్నింగ్ సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా.. ఓడిన టీమ్ ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య విచారంలో మునిగిపోయాడు. ఐపీఎల్ 2025 సీజన్ క్వాలిఫైయర్ 2లో ఓడిన తర్వాత ముంబయి శిబిరం బాధతో ఎమోషనల్ అయింది. 19వ ఓవర్ చివరి బంతికి అశ్వని బౌలింగ్ లో శ్రేయస్ సిక్స్ కొట్టిన వెంటనే కెప్టెన్ హార్దిక్ పాండ్య నిరాశతో నేలమీద పడిపోయాడు. హార్దిక్ ను బుమ్రా ఓదార్చాడు. ముంబయి ఇండియన్స్ ఓనర్స్ ఆకాశ్ అంబాని కూడా నిరాశ చెందారు.
పంజాబ్ కింగ్స్ ఇప్పుడు జూన్ 3న మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్సీబీతో ఐపీఎల్ 2025 ఫైనల్లో తలపడనుంది.